OTT Platforms: ఓటీటీలకు కేంద్రం సీరియస్ వార్నింగ్‌

ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లకు కేంద్రం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఐటీ రూల్స్ 2021 ప్రకారం అసభ్యకరమైన కంటెంట్‌ను ప్రసారం చేయకూడదని తెలిపింది. అన్ని ఓటీటీ సంస్థలు నైతిక విలువలను పాటించాలని వెల్లడించింది. పిల్లలకు ఎ రేటెడ్‌ కంటెంట్‌ నుంచి దూరంగా ఉంచాలని తెలిపింది.

New Update
OTT

OTT Photograph: (OTT)

ఓటీటీ సంస్థ(OTT Platforms)కు కేంద్రం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఐటీ రూల్స్ 2021(IT Rules 2021) ప్రకారం సోషల్ మీడియాలు, ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లు అన్ని కూడా తప్పకుండా రూల్స్ అన్ని పాటించాలని తెలిపింది. అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్‌(Obscene Content)ను అసలు ప్రసారం చేయకూడదని తెలిపింది. వయస్సు ఆధారిత కంటెంట్(Age-based Content) మాత్రమే అందుబాటులో ఉండాలని, ఓటీటీ సంస్థలు అన్ని కూడా తప్పకుండా నైతిక విలువలను పాటించాలని వెల్లడించింది.

ఇది కూడా చూడండి: HYDRAA Jobs: హైడ్రాలో 357 ఉద్యోగాలు.. ఆ మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక!

ఇది కూడా చూడండి: BRS vs Congress: రాజలింగమూర్తి హత్య కేసుపై స్పందించిన గండ్ర వెంకట రమణారెడ్డి..

రణవీర్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో..

నిబంధనలకు విరుద్ధంగా చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది. ఇటీవల జరిగిన ఇండియాస్‌ గాట్‌ లాటెంట్‌(IGL) కార్యక్రమంలో రణ్‌వీర్‌ అల్హాబాదియా (Ranveer Allahbadia) వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇవి తీవ్ర దుమారం రేపడంతో కేంద్రం ఓటీటీ సంస్థలపై సీరియస్ అయ్యింది. పిల్లలకు ఎ రేటెడ్‌ కంటెంట్‌ అందుబాటులో లేకుండా చూడాలని కేంద్రం ఆదేశించింది. 

ఇది కూడా చూడండి: Aaryan Shukla: 14ఏళ్ల మహారాష్ట్ర కుర్రాడు.. ఒకేరోజు 6 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్స్ ఎలా క్రియేట్ చేశాడంటే..?

ఇండియాస్‌ గాట్‌ లాటెంట్‌ పాల్గొన్న ఓ వ్యక్తిని ప్రముఖ యూట్యూబర్‌ రణ్‌వీర్‌ అల్హాబాదియా తల్లిదండ్రులు, శృంగారంపై ప్రశ్నించారు. దీంతో అతనిపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. పలు రాష్ట్రాల్లో అతనిపై ఎఫ్‌ఐఆర్‌లు కూడా నమోదయ్యాయి. దీంతో ఆ యూట్యూబర్ ఎఫ్‌ఐఆర్‌లు అన్నింటిని కూడా క్లబ్ చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో సుప్రీం కోర్టు ఆల్హాబాదియా వ్యాఖ్యలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే కేంద్రం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. 

ఇది కూడా చూడండి: రాజలింగం హత్య వెనుక కేసీఆర్, కేటీఆర్, హరీశ్.. మంత్రి కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Nainar Nagendran: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్

బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా పార్టీ నేత, తిరునల్వేలి ఎమ్మెల్యే నైనార్ నాగేంద్రన్ ఎన్నికయ్యారు. చెన్నైలో జరిగిన పార్టీ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ ఛుగ్‌ ఈ విషయాన్ని ప్రకటించారు.

New Update
Nainar Nagendran declared BJP Tamil Nadu unit president

Nainar Nagendran declared BJP Tamil Nadu unit president

బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా పార్టీ నేత, తిరునల్వేలి ఎమ్మెల్యే నైనార్ నాగేంద్రన్ ఎన్నికయ్యారు. చెన్నైలో జరిగిన పార్టీ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ ఛుగ్‌ ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే అధ్యక్ష పదవికి నాగేంద్రన్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఏకపక్షంగా పదవి ఆయనకే ఖరారైపోయింది. ఈ ఎన్నిక వెనుక అమిత్ షా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల బీజేపీ, అన్నాడీఎంకే పార్టీలు పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే.

Also Read: రేయ్ పాపం రా.. 13 కుక్కలను రేప్ చేసిన దుర్మార్గుడు- లైవ్ వీడియో వైరల్?

1960లో కన్యాకుమారి జిల్లా వడివీశ్వరంలో నాగేంద్రన్ జన్మించారు. 2001, 2011, 2021 ఎన్నికల్లో తిరునల్వేలి స్థానం నుంచి ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2001- నుంచి 2006 సమయంలో ఏఐడీఎంకే పార్టీలో మంత్రిగా కూడా పనిచేశారు. ఇక 2017లో ఏఐడీఎంకేను వీడి బీజేపీలో చేరారు. 2020 జులై నుంచి పార్టీకి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉంటున్నారు. జయలలిత, పన్నీరుసెల్వం ప్రభుత్వాల్లో వివిధ శాఖలకు మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. 

Also Read: సోనియా, రాహుల్ గాంధీకి ఈడీ బిగ్ షాక్..

ప్రభుత్వ పాలనలో అనుభవం, ప్రజాధారణ, రాజకీయ వ్యూహాలపై పట్టుఉండటంతో అధిష్ఠానం ఆయన వైపే మొగ్గు చూపిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఏఐడీఎంకే, బీజేపీలను సమన్వయం చేసుకోవడంలో ఆయన కీలకంగా వ్యవహరిస్తారని అంటున్నారు. అయితే ఇటీవల రామేశ్వరంలో పాంబన్ వంతెన ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వేదికపై ప్రధాని మోదీతో పాటు నాగేంద్రన్ కనిపించారు. వాస్తవానికి బీజేపీలో రాష్ట్ర అధ్యక్షులు కావాలంటే పదేళ్ల పాటు ప్రాథమిక సభ్యత్వం ఉడాలి. కానీ పార్టీ అభివృద్ధికి నాగేంద్రన్ కృషి చేయడం వల్ల  ఆయనకు మినహాయింపు ఇచ్చినట్లు సమాచారం. 

telugu-news | rtv-news | national-news | bjp

Advertisment
Advertisment
Advertisment