Encounter in Bihar: బీహార్‌లో కలకలం.. పోలీసులు, గ్యాంగ్‌స్టర్ల మధ్య భీకర కాల్పులు

బీహార్‌ రాజధాని పాట్నాలో తూటాలు పేలడం కలకలం రేపింది. నలుగురు గ్యాంగ్‌స్టర్లు, పోలీసుల మధ్య కాల్పులు జరిగాయి. గ్యాంగ్‌స్టర్ల కోసం పోలీసులు ఆపరేషన్ చేపట్టారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Encounter in Bihar

Encounter in Bihar

Encounter in Bihar: బీహార్‌ రాజధాని పాట్నా(Patna)లో తూటాలు పేలడం కలకలం రేపింది. గ్యాంగ్‌స్టర్లు, పోలీసుల(Gangsters vs Police) మధ్య కాల్పులు జరిగాయి. నలుగురు గ్యాంగ్‌స్టర్ల కోసం పోలీసులు ఆపరేషన్ చేపట్టారు. ఓ ఇంట్లో దాక్కున్న దుండగులు.. పోలీసులను చూసి కాల్పులు జరిపారు. అక్కడి నుంచి పారిపోయారు. అనంతరం రామ్‌లఖన్‌ మార్గ్‌లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లోని నాలగవ అంతస్తులోకి చొరబడ్డారు. వాళ్లని లొంగిపోవాలని పోలీసులు హెచ్చరించినా పట్టించుకోలేదు.  

Also Read: కేంద్రం సంచలన ప్రకటన.. బీపీ, షుగర్, క్యాన్సర్‌ టెస్టులు ఫ్రీ

STF బలగాలు కూడా రంగంలోకి

ఆ ప్రాంతంలో పోలీసులు, గ్యాంగ్‌స్టర్లకు మధ్య కాల్పులు జరగడంతో అక్కడున్న దుకాణాలు మూసివేయించారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ప్రజలు బయటికి రావొద్దని హెచ్చరించారు. దీంతో అక్కడ ఏం జరుగుతుందో తెలియక అక్కడి ప్రజలు బిల్డింగ్‌లపై ఎక్కి చూస్తున్నారు. మరోవైపు దుండగుల కోసం STF బలగాలు కూడా రంగంలోకి దిగాయి. బీహార్‌ ATS బలగాలు కూడా అక్కడికి వచ్చాయి. అయితే దుండగుల వద్ద అధునాతన ఆయుదాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. 

Also Read: కుంభమేళా నీళ్లలో కోలీఫామ్‌ బ్యాక్టీరియా.. బాంబు పేల్చిన పొల్యుషన్ కంట్రోల్ బోర్డ్

పాట్నాలో కంకర్‌బాగ్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఉన్న ఓ ఇంట్లో రెండు వైపుల కాల్పులు చోటుచేసుకున్నాయి. దీంతో అక్కడున్న స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దుండుగలు ప్రవేశించిన ఆ ఇల్లు ఉపేంద్ర సింగ్‌ అనే వ్యక్తికి చెందినట్లుగా గుర్తించారు. ప్రస్తుతం దుండగుల కోసం బలగాలు ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి.  

Also Read: కుంభమేళాకు సాహసయాత్ర.. గంగానదిలో 550km పడవ ప్రయాణం వీడియో వైరల్

Also Read: అశ్లీల కంటెంట్‌ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారా.. కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Muda case: ముడా స్కామ్ కేసులో సిద్దరామయ్యకు కోర్టు షాక్..!

ముడా కేసులో కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు ఎదురుదెబ్బ తగిలింది. విచారణను కొనసాగించేందుకు లోకాయుక్త పోలీసులకు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు అనుమతించింది. లోకాయుక్త పోలీసులు దాఖలు చేసిన బిరిపోర్ట్ విభేదిస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును వాయిదా వేసింది.

New Update
MUDA Scam: కర్ణాటకలో ముడా స్కామ్ కలకలం.. సిద్ధరామయ్య భార్యపై కేసు

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను ముడా స్కామ్ కేసు వేంటాడుతోంది. మైసూరు అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ కేసులో ఆయనకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ముడా కేసులో విచారణను కొనసాగించేందుకు లోకాయుక్త పోలీసులకు బెంగళూరు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు మంగళవారం అనుమతించింది. కర్ణాటక లోకాయుక్త పోలీసులు దాఖలు చేసిన బి రిపోర్ట్ తో విభేదిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది.

Also read: ఖమ్మం వరదల్లో చనిపోయిన అగ్రికల్చర్ సైంటిస్ట్‌కు అరుదైన గౌరవం

ముడా భూముల కేటాయింపులో సిద్ధరామయ్య అవినీతికి పాల్పడలేదని లోకాయుక్త పోలీసులు ఇటీవల క్లీన్‌చిట్ ఇచ్చారు. అయితే దీనిని ఈడీ, హక్కుల కార్యకర్త స్నేహమయి కృష్ణ సవాలు చేశారు. ఈ కేసులో కొన్ని కీలక కోణాల్లో విచారణ జరగలేదని ఈడీ, స్నేహమయి కృష్ణ వాదించారు. మరింత లోతుగా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. దీనిపై న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్‌ విచారణ చేపట్టారు. లోకాయుక్త పోలీసులు పూర్తి దర్యాప్తు నివేదిక సమర్పించిన తర్వాతే బి రిపోర్ట్ పై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేస్తూ, తదుపరి విచారణను మే 7న తేదీకి వాయిదా వేశారు. దీనికి ముందు, సిద్ధరామయ్య, మరో ముగ్గురిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి మైసూరు డివిజన్ లోకాయుక్త పోలీసులు ప్రాథమిక నివేదకను సమర్పించారు. అయితే విచారణ కేవలం నలుగురు వ్యక్తులకే పరిమితం కాదని, ఇందులో ప్రమేయమున్న అందరికీ దర్యాప్తు జరపాలని, సమగ్ర నివేదిక సమర్పించాలని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

Also read: Mirabhai Chanu: ఒలంపిక్స్ విజేత మీరాభాయ్ చానుకు కీలక పదవి

Advertisment
Advertisment
Advertisment