10th విద్యార్థులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్.. టాప్ 3 ర్యాంకర్లకు రూ.2లక్షలు.. ల్యాప్‌టాప్, మెడల్!

పదవ తరగతి విద్యార్థులకు బీహార్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. 2025 టాప్ 3 ర్యాంకర్లకు రూ.2 లక్షలు బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ల్యాప్‌టాప్, సర్టిఫికెట్, మెడల్ కూడా అందిస్తామని తెలిపింది. టాప్ 4-10 పది నుంచి ఇరవై వేలు ఇవ్వనున్నట్లు పేర్కొంది. 

New Update
TS Tenth Exams: టెన్త్ ఎగ్జామ్స్ కు హాజరయ్యే స్టూడెంట్స్ కు రేవంత్ సర్కార్ శుభవార్త.

Bihar government bumper offer to 10th class students

Bihar: పదవ తరగతి విద్యార్థులకు బీహార్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. 2025 టాప్ 3 ర్యాంకర్లకు రూ.2 లక్షలు బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ల్యాప్‌టాప్, సర్టిఫికెట్, మెడల్ కూడా అందిస్తామని తెలిపింది. టాప్ 4-10 పది నుంచి ఇరవై వేలు ఇవ్వనున్నట్లు పేర్కొంది. 

భారీగా పెంచిన ప్రైజ్ మనీ..

ఈ మేరకు గత సంవత్సరం కంటే ఈ ఏడాది ప్రైజ్ మని పెంచినట్లు తెలిపింది. అలాగే 10, 12 తరగతుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులను బోర్డు ఇంటర్వ్యూ చేస్తుంది. అనంతరం వీరికి బీహార్ విద్యాశాఖ బోర్డు అవార్డులను కూడా అందించనున్నట్లు అనౌన్స్ చేసింది. ఇక మొదటి స్థానంలో నిలిచిన వారికి రూ. 2 లక్షలు, రెండవ స్థానంలో నిలిచిన విద్యార్థికి రూ.1.5 లక్షల ప్రైజ్ మనీ, మూడవ స్థానంలో నిలిచిన విద్యార్థులకు లక్ష రూపాయలు అందుతాయి. దీనితో పాటు నాల్గవ స్థానం నుంచి పదో స్థానంలో నిలిచిన విద్యార్థులకు రూ. 10 నుంచి 30 వేల బహుమతి ఇవ్వబడుతుంది. ఇక గత సంవత్సరం మొదటి ప్రైజ్ మనీ లక్ష మాత్రమే అందించగా ఈసారి భారీగా పెంచింది.

ఇది కూడా చూడండి: Contaminated Food: ప్రాణాలు తీస్తున్న కలుషిత ఆహారం.. అందుకే వండిన వెంటనే తినేయాలి  

మొదటి స్థానం: 1 లక్షకు బదులుగా 2 లక్షలు.
రెండవ స్థానం: 75,000 నుంచి 1.5 లక్షలకు పెరిగింది.
మూడవ స్థానం: 50,000 నుంచి 1 లక్షకు పెరిగింది.
నాల్గవ నుండి 10వ స్థానం: ₹10,000 నుంచి ₹20,000కి పెరిగింది.

ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

 10th-class | prize-money | today telugu news

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

CPI(M): సీపీఎం నూతన ప్రధాన కార్యదర్శిగా మాజీ మంత్రి

సీపీఎం కొత్త ప్రధాన కార్యదర్శిగా కేరళ మాజీ మంత్రి ఎం.ఎ బేబికి అవకాశం దక్కింది. తమిళనాడులోని మదురైలో జరిగిన సీపీఎం 24వ మహాసభల్లో ఆయన్ని పార్టీ సభ్యులు కొత్త సారథిగా ఎన్నుకున్నారు. గతేడాది సీతారం ఏచూరి మృతితో ఆయనకు ఈ పదవి దక్కింది.

New Update
Former Kerala Minister MA Baby elected as General Secretary of CPI(M)

Former Kerala Minister MA Baby elected as General Secretary of CPI(M)

సీపీఎం కొత్త ప్రధాన కార్యదర్శిగా కేరళ మాజీ మంత్రి ఎం.ఎ బేబికి అవకాశం దక్కింది. తమిళనాడులోని మదురైలో జరిగిన సీపీఎం 24వ మహాసభల్లో ఆయన్ని పార్టీ సభ్యులు కొత్త సారథిగా ఎన్నుకున్నారు. గతేడాది సీతారం ఏచూరి మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటినుంచి ప్రధాన కార్యదర్శి పదవి ఖాళీగానే ఉంది. ఇప్పటివరకు తాత్కాలిక సమన్వయకర్తగా సీనియర్ నేత ప్రకాశ్ కారాట్‌ వ్యవహరిస్తున్నారు. 

Also Read: అమ్మో బాబోయ్.. చీతాలకు నీళ్లు తాగించిన యువకుడు.. చివరికీ ఊహించని షాక్

ఈ క్రమంలోనే మదురైలో జరిగిన సీపీఎం 24వ మహాసభలో 85 మంది సభ్యులతో కేంద్ర కమిటీని ఎన్నుకున్నారు. నూతన కేంద్ర కమిటీ.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీని, అలాగే 18 మందితో పొలిట్ బ్యూరోను ఎన్నుకున్నారు. అయితే ఈ కేంద్ర కమిటీలో 20 శాతం మంది మహిళలే ఉండటం మరో విశేషం. సీపీఎం ప్రధాన కార్యదర్శి పదవి రేసులో సీనియర్ నేతలైన  ఎం.ఎ.బేబీతో పాటు అశోక్‌ ధవలే, మహమ్మద్‌ సలీం, బి.వి.రాఘవులు, బృందా కారాట్‌ పేర్లు ఎక్కువగా వినిపించాయి. ఆ పార్టీలో ఓ వర్గం ఆలిండియా కిసాన్ సభ (AIKS) అధ్యక్షుడైన అశోక్ ధవలేకు కూడా మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది. 

Also Read: పాపం.. అందర్నీ నవ్విస్తూనే కుప్పకూలి చనిపోయింది!

ఇదిలాఉండగా.. 1954లో కేరళలోని ప్రాక్కుళంలో ఎం.ఎ బేబీ జన్మించారు. ఈయన తల్లిదండ్రులు  పి.ఎం.అలెగ్జాండర్, లిల్లీ అలెగ్జాండర్ . బేబీ విద్యార్థి దశలో ఉన్నప్పడే కేరళ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ (ఇప్పుడు SFI)లో చేరారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లారు. 1986 నుంచి 1998 వరకు రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. కేరళ మంత్రిగా కూడా సేవలు అందించారు. 2012 నుంచి సీపీఎం పొటిల్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారు. తాజాగా నూతన ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.   

Also Read: పంబన్ బ్రిడ్జ్ ప్రారంభించిన మోదీ.. భారత్‌లో ఇలాంటి వంతెన ఇదే ఫస్ట్ టైం

rtv-news | cpm | national-news

Advertisment
Advertisment
Advertisment