Bengalore: ప్లీజ్ ఉద్యోగం ఇవ్వండి చాలు.. ఉచితంగా పనిచేస్తాను.. బెంగళూరు టెకీ పోస్ట్ వైరల్

ఉద్యోగ కోతలు చదువు పూర్తి చేసుకుని ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారిని ఎంత క్షోభకు గురి చేస్తుందో ఈ పోస్ట్ చూస్తే తెలుస్తుంది. బెంగళూరుకు చెందిన ఓ యువకుడు ఉద్యోగం ఇస్తే చాలు..ఫ్రీగా అయినా చేస్తా అంటూ పోస్ట్‌ పెట్టడం వైరల్‌ అవుతుంది

New Update
 job

job Photograph: (fake job trend )

బీటెక్ పూర్తి చేసిన ఓ యువకుడు...ఉద్యోగం కోసం రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నా ఎక్కడా ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. అనుభవం లేదంటూ తిరస్కరణలను ఎదుర్కొన్న అతడు తన గోడును వెళ్లబోసుకోడానికి సోషల్ మీడియాను ఎంచుకున్నాడు. సామాజిక మాధ్యమం వేదికగా తన రెజ్యుమ్‌ ను  షేర్ చేసిన యువకుడు.. మారుమూల లోకేషన్‌లో అయినా తనకు ఉద్యోగం ఇవ్వండి చాలు, జీతం ఇవ్వకపోయినా పర్వాలేదు అంటూ వేడుకున్నాడు. 

Also Read: Ap: ఏపీలో మహిళలకు తీపికబురు.. వారందరికి ఉచితంగా కుట్టు మిషన్లు

ప్రస్తుతం ఆ పోస్టు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. బెంగళూరుకు చెందిన ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ పోస్ట్‌కు నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. రెడ్డిట్‌లో రెజ్యుమేను పోస్ట్ చేసిన గ్రాడ్యుయేట్‘‘2023లో ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌ కోర్సులో బీఈ చేశాను.. ప్రస్తుతం ఉద్యోగ వేటలో అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నాను.. నా రెజ్యుమేను తగులబెట్టేసినా పర్లేదు కానీ నాకు సాయం చేయండి.. వీలైనంత త్వరగా మారుమూల ప్రాంతంలో అయినా జీతం లేకుండా ఉచితంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను’ అని చెప్పుకొచ్చాడు. 

Also Read: CEC: కేంద్ర ఎన్నికల కమిషనర్ గా జ్ఞానేష్.. ఆయన బ్యాగ్రౌండ్ ఇదే..!

తనకు జావా, పైథాన్‌, క్లౌడ్ కంప్యూటింగ్‌, మెషిన్ లెర్నింగ్‌, ఏపీఐ, డాకర్, కుబేర్‌నెట్స్, తదితర వాటిలో ప్రావీణ్యం ఉందని చెప్పాడు. ఇలా చేయడం వల్ల కనీసం అనుభవమైనా వస్తుందని అన్నాడు. ఈ పోస్టుపై స్పందించిన పలువురు.. అతడికి సలహాలు, సూచనలు చేశారు. సీవీని మరింత మెరుగ్గా సిద్ధం చేసుకోమని సూచించారు. మరికొందరు మెయిల్ ద్వారా తమకు పంపాలని, ఆఫర్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని భరోసా ఇచ్చారు. అలాగే, ఇంకొందరు హైబ్రిడ్ లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగం ఇప్పిస్తానని అన్నారు. అయితే, టెక్ పరిశ్రమలో ఒడిదొడుకులకు ఈ పోస్ట్ అద్దంపడుతోంది.

700 మందిని సామూహికంగా...

పది రోజుల కిందట దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ మైసూర్ క్యాంపస్‌లోని 700 మందిని సామూహికంగా తొలగించడంపై కలకలం రేగిన విషయం తెలిసిందే. దీనిపై ఐటీ ఉద్యోగుల సంఘం ఫిర్యాదు చేయడంతో కేంద్ర కార్మిక శాఖ కూడా స్పందించింది. అవసరమైన చర్యలు తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వానికి సూచించింది. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగానికి ఇదో ఉదాహరణ. ఏటా లక్షల్లో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకొస్తున్నా.. కొంత మందికి మాత్రమే ఉద్యోగాలు లభిస్తున్నాయి.

Also Read: America-Russia: అమెరికాలో ఉద్రిక్తతలకు తెర పడనుందా...రష్యా ఏమంటుందంటే!

Also Read: Horoscope Today: ఆ రాశుల వారికి ఈరోజు అసలు బాలేదు- తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు

#latest-telugu-news #job #telugu-news #latest telugu news updates #bengalore #tech #latest-news
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam attack : హ్యాట్సాఫ్..ఉగ్రదాడితో ముస్లిం ఆ...

Pahalgam attack : హ్యాట్సాఫ్..ఉగ్రదాడితో ముస్లిం ఆవేదన.. ఇస్లాంను వదిలేస్తూ కోర్టుకు!

ఉగ్రవాదులకు వ్యతిరేకంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న నిరసనల మధ్య, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక పాఠశాల ఉపాధ్యాయుడు సబీర్ హుస్సేన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇస్లాంను వదిలేసి ఓ సాధారణ మనిషిగా గుర్తింపు పొందేందుకు కోర్టును ఆశ్రయించారు.

New Update
west-bengal-teacher

west-bengal-teacher

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22వ తేదీ మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడిని భారత్ ఎప్పటికీ మరచిపోదు. బైసరన్ లోఅమాయక టూరిస్టులపై ఉగ్రవాదులు నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 26 మంది స్పాట్ లోనే మరణించారు. ఈ ఘటనలో ఎక్కువ మంది పర్యాటకులు గాయపడ్డారు కూడా. టూరిస్టులను చంపేముందు ఉగ్రవాదులు వారు ఏ మతానికి చెందినవారో కూడా నిర్ధారించుకున్నారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న నిరసనల మధ్య, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక పాఠశాల ఉపాధ్యాయుడు పెద్ద అడుగు వేశాడు. స్కూల్ టీచర్ అయిన సబీర్ హుస్సేన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఇది నా వ్యక్తిగత నిర్ణయం

ఇస్లాంను వదిలేసి ఓ సాధారణ మనిషిగా గుర్తింపు పొందేందుకు కోర్టును ఆశ్రయించనున్నట్లు వెల్లడించారు. కశ్మీర్ లో హింసకు మతాన్ని సాధనంగా ఉపయోగించడాన్ని అంగీకరించలేనని తెలిపారు.  మతం పేరుతో ప్రాణాలు తీయడం బాధను కలిగిస్తోందని ..  అందుకే ఇస్లాంను త్యజిస్తున్నానని వెల్లడించారు. అయితే తన నమ్మకాలను తన కుటుంబంపై రుద్దబోనని అతను స్పష్టం చేశాడు. నా భార్య, పిల్లలకు ఈ విషయంలో ఏ మార్గాన్ని ఎంచుకున్నా వారికి స్వేచ్ఛ ఉంటుందని తెలిపారు. నేను ఏ మతాన్ని అగౌరవపరచడం లేదని ఇది తన వ్యక్తిగత నిర్ణయం అని తెలిపాడు. ప్రతిదీ మతం చుట్టూ తిరుగుతున్న ప్రపంచంలో తాను జీవించాలనుకోవడం లేదని హుస్సేన్ అన్నారు. 

Also Read :  Veeraiah Chowdary Murder Case : టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్యకేసులో కీలక పరిణామం..నిందితులు ఎవరంటే...

Advertisment
Advertisment
Advertisment