జైలులో మొబైల్‌ ఫోన్లు, టీవీ వాడుతున్న ఖైదీలు.. సిబ్బందిపై వేటు

కర్ణాటకలోని బెంగళూరులో ఉన్న పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైలు మరోసారి వివాదంలో ఇరుక్కుంది. ఆ జైలులో ఖైదీలు మొబైల్ ఫోన్లు, టీవీలు వాడుతున్నట్లు కనిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

New Update
Bengaluru Jail Inmates Seen Using Mobile Phones, TV

Bengaluru Jail Inmates Seen Using Mobile Phones, TV

కర్ణాటకలోని బెంగళూరులో ఉన్న పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైలు మరోసారి వివాదంలో ఇరుక్కుంది. ఆ జైలులో ఖైదీలు మొబైల్ ఫోన్లు, టీవీలు వాడుతున్నట్లు కనిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఖైదీలు జైల్లో విలాసవంతమైన జీవితం గడుడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ వ్యవహారంపై తీవ్రంగా విమర్శలు రావడంతో జైలు అధికారులు చర్యలు దిగారు. ముగ్గురు జైలు సిబ్బందిని సస్పెండ్ చేశారు.   

Also Read: దూసుకుపోతున్న మహిళలు.. పురుషుల కన్నా ఎక్కువ జీతాలు వీళ్లకే.. రిపోర్టులో సంచలన విషయాలు

ఓ హత్య కేసులో రెండున్నర ఏళ్లకు పైగా జైల్లో ఉన్న ఖైదీలు మార్చి 27న వీడియో రికార్డు చేశారు. తమ స్నేహితులకు దీన్ని పంపించారు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో జైలు అధికారులు అలెర్ట్ అయ్యారు. ఖైదీల గదుల్లో చెక్ చేశారు. టాయిలెట్‌ సమీపంలో భూగర్భ పైప్‌లైన్ ప్రాంతంలో ఫోన్లను దాచినట్లు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని ఈ వ్యవహారంపై కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలతో ముగ్గురు జైలు వార్డెన్లను సస్పెండ్ చేశారు. 

Also Read: టీవీకే అభ్యర్థుల లిస్టు విడుదల.. రెండుచోట్ల నుంచి బరిలోకి విజయ్‌

ఇదిలాఉండగా పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైల్‌లో ఖైదీల అక్రమ కార్యకలపాలు నియంత్రించేందుకు గత కొంతకాలంగా చర్యలు తీసుకుంటూనే ఉన్నామని జైలు అధికారులు చెప్పారు. తమ ప్రయత్నాలు దెబ్బతీసేందుకే ఈ వీడియోను బయటపెట్టారని తెలిపారు. జైళ్ల డీజీపీ అలోక్ కుమార్‌ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఏదైనీ కుట్ర జరుగుతుందా అనేదానిపై విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. గతేడాది కూడా ఈ జైల్లో ఖైదీలు మొబైల్ ఫోన్లు, టీవీలు వాడుతున్నారంటూ పలు వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. 

Advertisment
తాజా కథనాలు