UP: పాపం పెళ్లి కొడుకు.. బంగారం, రూ.3.5 లక్షలతో పెళ్లి కూతురు జంప్.. ఎక్కడంటే..!?

యూపీలోని మహారాజ్‌గంజ్‌ జిల్లాల్లో ఓ కొత్త పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కుటుంబానికి పెద్ద షాకిచ్చింది. పెళ్లి అయిన రాత్రే వరుడి కుటుంబం విందు ఏర్పాట్లలో ఉండగా..కొత్త పెళ్లి కూతురు 3.5 లక్షల విలువైన నగలతో పారిపోయింది.

New Update
Karthika masam: ఎంత ట్రై చేసినా పెళ్లి కావడం లేదా..అయితే కార్తీక మాసం లో ఇలా చేయండి మరీ!

up

యూపీలోని మహారాజ్‌గంజ్‌ జిల్లాల్లో ఓ షాకింగ్‌ విషయం వెలుగు చూసింది. ఓ నవ వధువు పెళ్లైన కొన్ని గంటలకే వరుడి కుటుంబానికి పెద్ద షాకిచ్చింది. రాత్రికి రాత్రే లక్షల విలువైన నగలతో పారిపోయింది. దీంతో ఏం చేయాలో తెలియని వరుడి కుటుంబం ప్రస్తుతం పోలీస్‌ స్టేషన్ చుట్టూ తిరుగుతుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువతి కోసం వెదకడం ప్రారంభించారు. 

Also Read: US Rains: అమెరికాలో అల్లకల్లోలం.. భారీ వర్షాలు, వరదలతో 9 మంది మృతి.. ట్రంప్ కీలక ఆదేశాలు!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాజ్‌గంజ్‌ లోని ఘుగ్లి పోలీస్‌ స్టేషన్‌ ప్రాంతంలోని రాంపూర్‌ బల్దిహాకు చెందిన మనీష్‌ అనే యువకుడికి ఫిబ్రవరి 7న  కోతిబహార్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన ఓ యువతిని  వివాహం చేసుకున్నాడు. ఫిబ్రవరి 10న వధువు తన అత్తమామల ఇంటికి వచ్చింది. ఇంట్లో బంధువులు ఎక్కువగా ఉండడం వల్ల వరుడి కుటుంబ సభ్యులందరూ తమ నగలను వధువు గదిలో ఉంచారు.

Also Read: Bihar Earthquake: బాబోయ్ భూకంపం.. ఢిల్లీతో పాటు బీహార్‌లో కూడా: ఇళ్లలోంచి పరుగే పరుగు!

 పెళ్లి కొడుకు సోదరి నగలు కూడా...

మరి ఏం బుద్ధి పుట్టిందో ఏమో..రాత్రికి రాత్రే తన నగలతో పాటు..పెళ్లి కొడుకు సోదరి నగలు కూడా పట్టుకుని పెళ్లికూతురు పారిపోయింది.విషయం తెలుసుకున్న వరుడు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 11 వ తేదీ రాత్రి కుటుంబ సభ్యులు,బంధువులు విందు ఏర్పాట్లలో ఉన్న సమయంలో పెళ్లి కూతురు నగలతో పారిపోయిందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.

అంతేకాకుండా రాత్రంతా వధువు కోసం వెతికినప్పటికీ ఆమె ఎక్కడా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వధువు  తల్లిదండ్రులకు కూడా ఆమె గురించి తెలియదని అంటున్నారు.కానీ వరుడు మాత్రం ఈ సంఘటనలో వధువు కుటుంబం ప్రమేయం ఉందని ఆరోపించారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిపారు. 

Also Read: KUMBH MELA 2025: కుంభమేళా ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఏపీ, తెలంగాణ నుంచి స్పెషల్ ట్రైన్స్: లిస్ట్ ఇదే!

Also Read: America-Bharat: తీరు మార్చుకోని అగ్రరాజ్యం..మరోసారి సంకెళ్లతోనే వారిని భారత్ కు పంపిన వైనం!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

పెళ్లిలో చెప్పుల గొడవ.. నా కొడకా అంటూ పెళ్లి కొడుకుని ఊతికారేశారు!

పెళ్లి టైమ్ లో వరుడి చెప్పులను దాచిపెట్టి రూ. 50 వేలు అడిగితే రూ. 5వేలు ఇచ్చాడంటూ వధువు బంధువులు పెళ్లి కుమారుడితో గొడవ పెట్టుకున్నారు. మాట మాట పెరగడంతో వరుడిని గదిలో బంధించి మరి కర్రలతో కొట్టారు వధువు తరుపు బంధువులు. 

New Update
Joota Chupai

Joota Chupai

ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. పెళ్లి టైమ్ లో వరుడి చెప్పులను దాచిపెట్టి రూ. 50 వేలు అడిగితే రూ. 5వేలు ఇచ్చాడంటూ వధువు బంధువులు పెళ్లి కుమారుడితో గొడవ పెట్టుకున్నారు. తక్కువ డబ్బు ఇచ్చినందుకు గానూ వధువు వైపు మహిళలు వరుడిని బిచ్చగాడు అని పిలిచారు.  దీంతో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ నెలకొంది. మాట మాట పెరగడంతో వరుడిని గదిలో బంధించి మరి కర్రలతో కొట్టారు వధువు తరుపు బంధువులు. 

ఉత్తరాఖండ్‌లోని చక్రతా నుండి వచ్చిన వరుడు ముహమ్మద్ షబీర్ శనివారం తన కుటుంబంతో కలిసి వివాహ ఊరేగింపులో బిజ్నోర్ చేరుకున్నాడు. అయితే అక్కడి వారి ఆచారంలో భాగంగా వరుడి బూట్లును దాచిపెట్టి పెళ్లి కుమారుడిని వధువు తరుపు మహిళలు రూ.50,000 డిమాండ్ చేశారు. పెళ్లి కొడుకు రూ.50,000 కు బదులుగా రూ.5,000 ఇవ్వడంతో వధువు వైపు మహిళలు వరుడిని బిచ్చగాడు అని సంభోధించారు.  

పెళ్లి వాయిదా

దీంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది.  మాట మాట పెరగడంతో వరుడిని ఒక గదిలో బంధించి వధువు కుటుంబ సభ్యులు కర్రలతో కొట్టారు. ఈ సంఘటన గురించి పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు. అనంతరం వరుడు, వధువు కుటుంబ సభ్యులు బిజ్నోర్‌లోని నాజీబాబాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.  పెళ్లిని వాయిదా వేశారు.  

Also read :  Lemon: సమ్మర్ ఎఫెక్ట్.. వాచిపోతున్న నిమ్మకాయల ధరలు.. పిండితే రసం కూడా రావట్లే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు