Anand Mahindra: భారత్‌ లో టెస్లా..ఆనంద్‌ మహీంద్రా కీలక వ్యాఖ్యలు!

టెస్లా భారత్‌ లోకి ఎంట్రీ ఇవ్వడంతో పలువురు నెటిజన్లు ఈ విషయం గురించి ఆనంద్‌ మహీంద్రాను ప్రశ్నించారు. దానికి ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలను చేశారు. ఆయన ఏం అన్నారో ఈ కథనంలో...

New Update
Anand Mahindra: అతని ఫోన్ నెంబర్ ఇవ్వండి.. ఆనంద్ మహింద్రా బంఫర్ ఆఫర్

Anand Mahindra:

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) ఎన్నో ఆసక్తికర విషయాలు, ప్రేరణ కలిగించే వీడియోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటుంటారు. తాజాగా ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ టెస్లా భారత్‌ లోకి ఎంట్రీ పై సంకేతాలిచ్చిన సంగతి తెలిసిందే. దీని పై ఓ నెటిజన్‌ స్పందిస్తూ..టెస్లా మార్కెట్‌ లోకి వస్తే ఎదురయ్యే పోటీని ఎలా ఎదుర్కొంటారని మహీంద్రాను ప్రశ్నించారు.

Also Read:Gold Prices: బంగారం కొనాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త...వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు!

పోటీని తట్టుకొని...

దీనికి ఆయన స్పందిస్తూ 1991 లో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన తరువాత కూడా తమకు ఇలాంటి ప్రశ్నలే ఎదురయ్యాయని పేర్కొన్నారు. అప్పుడు మార్కెట్‌ లోకి వచ్చిన దేశీయ, విదేశీ కంపెనీలైన టాటా, సుజుకీ వంటి ఎన్నో ఇతర కంపెనీలతో పోటీని తట్టుకొని నిలబడ్డామన్నారు. తమ ఉత్పత్తుల పై ఉన్న నమ్మకమే దీనికి కారణమని..టెస్లా మార్కెట్‌ లోకి వచ్చినా తమ సంస్థ ఇదే విధంగా ముందుగా వెళ్తుందని అన్నారు.

Also Read: Gautham Death Mystery: అల్లుడికి నిప్పంటించిన అత్తామామ! గౌతమ్ మృతి కేసులో బిగ్ ట్విస్ట్

దేశ ప్రజలు, వినియోగదారులు ఇస్తున్న ప్రోత్సాహంతో పోటీకి తగ్గట్లు తమను తాము మార్చుకుంటామన్నారు. 2018  సమయంలో ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) సంస్థలు ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఆయనకు మద్దతిస్తూ పెట్టిన పోస్ట్‌ను షేర్‌ చేసి..అప్పుడెలా ఆయనకు మద్దతు ఇచ్చానో ఇప్పుడు కూడా అలాగే ఉంటానని పేర్కొన్నారు.

మహీంద్రా సమాధానం పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మహీంద్రా ఆటో మొబైల్స్‌ కు మార్కెట్లో ఉన్న విలువకు కారణం... సంస్థ పాటించే ఆరోగ్యకర పోటీ విధానం మాత్రమే అని ఓ నెటిజన్‌ అన్నారు. మహీంద్రా కంపెనీ భారతదేశపు వాస్తవికతను, భారతీయుల మనస్తత్వాన్ని అర్థం చేసుకున్న సంస్థ. కాబట్టి భారత్‌ లో దీని పునాది గట్టిగా ఉంది. 

మార్కెట్‌ లో ఆరోగ్యకరమైన వాతావరణ లేకపోతే...కొత్త ఆవిష్కరణలు చేయలేం అంటూ మరో నెటిజన్ పేర్కొన్నారు.  

Also Read:Mamata Benarjee: అది నిరూపిస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తా.. బీజేపీకి దీదీ సవాల్

Also Read: America-Russia: అమెరికాలో ఉద్రిక్తతలకు తెర పడనుందా...రష్యా ఏమంటుందంటే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

CPI(M): సీపీఎం నూతన ప్రధాన కార్యదర్శిగా మాజీ మంత్రి

సీపీఎం కొత్త ప్రధాన కార్యదర్శిగా కేరళ మాజీ మంత్రి ఎం.ఎ బేబికి అవకాశం దక్కింది. తమిళనాడులోని మదురైలో జరిగిన సీపీఎం 24వ మహాసభల్లో ఆయన్ని పార్టీ సభ్యులు కొత్త సారథిగా ఎన్నుకున్నారు. గతేడాది సీతారం ఏచూరి మృతితో ఆయనకు ఈ పదవి దక్కింది.

New Update
Former Kerala Minister MA Baby elected as General Secretary of CPI(M)

Former Kerala Minister MA Baby elected as General Secretary of CPI(M)

సీపీఎం కొత్త ప్రధాన కార్యదర్శిగా కేరళ మాజీ మంత్రి ఎం.ఎ బేబికి అవకాశం దక్కింది. తమిళనాడులోని మదురైలో జరిగిన సీపీఎం 24వ మహాసభల్లో ఆయన్ని పార్టీ సభ్యులు కొత్త సారథిగా ఎన్నుకున్నారు. గతేడాది సీతారం ఏచూరి మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటినుంచి ప్రధాన కార్యదర్శి పదవి ఖాళీగానే ఉంది. ఇప్పటివరకు తాత్కాలిక సమన్వయకర్తగా సీనియర్ నేత ప్రకాశ్ కారాట్‌ వ్యవహరిస్తున్నారు. 

Also Read: అమ్మో బాబోయ్.. చీతాలకు నీళ్లు తాగించిన యువకుడు.. చివరికీ ఊహించని షాక్

ఈ క్రమంలోనే మదురైలో జరిగిన సీపీఎం 24వ మహాసభలో 85 మంది సభ్యులతో కేంద్ర కమిటీని ఎన్నుకున్నారు. నూతన కేంద్ర కమిటీ.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీని, అలాగే 18 మందితో పొలిట్ బ్యూరోను ఎన్నుకున్నారు. అయితే ఈ కేంద్ర కమిటీలో 20 శాతం మంది మహిళలే ఉండటం మరో విశేషం. సీపీఎం ప్రధాన కార్యదర్శి పదవి రేసులో సీనియర్ నేతలైన  ఎం.ఎ.బేబీతో పాటు అశోక్‌ ధవలే, మహమ్మద్‌ సలీం, బి.వి.రాఘవులు, బృందా కారాట్‌ పేర్లు ఎక్కువగా వినిపించాయి. ఆ పార్టీలో ఓ వర్గం ఆలిండియా కిసాన్ సభ (AIKS) అధ్యక్షుడైన అశోక్ ధవలేకు కూడా మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది. 

Also Read: పాపం.. అందర్నీ నవ్విస్తూనే కుప్పకూలి చనిపోయింది!

ఇదిలాఉండగా.. 1954లో కేరళలోని ప్రాక్కుళంలో ఎం.ఎ బేబీ జన్మించారు. ఈయన తల్లిదండ్రులు  పి.ఎం.అలెగ్జాండర్, లిల్లీ అలెగ్జాండర్ . బేబీ విద్యార్థి దశలో ఉన్నప్పడే కేరళ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ (ఇప్పుడు SFI)లో చేరారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లారు. 1986 నుంచి 1998 వరకు రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. కేరళ మంత్రిగా కూడా సేవలు అందించారు. 2012 నుంచి సీపీఎం పొటిల్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారు. తాజాగా నూతన ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.   

Also Read: పంబన్ బ్రిడ్జ్ ప్రారంభించిన మోదీ.. భారత్‌లో ఇలాంటి వంతెన ఇదే ఫస్ట్ టైం

rtv-news | cpm | national-news

Advertisment
Advertisment
Advertisment