Tamilanadu: నటి పై రాజకీయ నేత అత్యాచారం.. ఏడుసార్లు అబార్షన్..కోర్టు సంచలన తీర్పు!

తమిళ దర్శక నటుడు, నామ్‌ తమిళర్‌ కట్చి ప్రధాన సమన్వయకర్త సీమాన్‌పై నటి విజయలక్ష్మి దాఖలు చేసిన లైంగిక వేధింపుల కేసులో మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. సీమాన్‌పై కేసు తీవ్రమైందని, దీనిని కొట్టివేయడం కుదరదని తేల్చిచెప్పింది

New Update
madras

madras

తమిళ దర్శక నటుడు, నామ్‌ తమిళర్‌ కట్చిప్రధాన సమన్వయకర్త సీమాన్‌పై నటి విజయలక్ష్మి ఫైల్‌ చేసిన లైంగిక వేధింపుల కేసులో మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పెళ్లి చేసుకుంటానని బాధితురాలిని సీమాన్ మోసం చేశాడని, దీంతో ఆమెకు ఏడుసార్లు అబార్షన్‌ జరిగిందని వివరించింది. సీమాన్‌పై కేసు తీవ్రమైందని, దీనిని కొట్టివేయడం కుదరదని తేల్చిచెప్పింది. 

Also Read: Uganda-Indian Woman:లంచం ఇచ్చాకే నీళ్లు, ఫుడ్. జైలు కష్టాలను గురించి చెప్పకొచ్చిన భారత బిలియనర్ కుమార్తె

లైంగిక వేధింపులకి గురిచేసినట్లు నటుడు సీమాన్‌పై నటి విజయలక్ష్మి చేసిన ఫిర్యాదు ఆధారంగా 2011లో తమిళనాడు పోలీసులు కేసు ఫైల్‌ చేశారు.అయితే, ఈ కేసును రద్దుచేయాలని కోరుతూ సీమాన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఇళంతిరైయన్‌ ఈ నెల 17న తీర్పు ప్రకటించారు.

Also Read: Horoscope: నేడు ఈ రాశివారు చెప్పుడు మాటలకు దూరంగా ఉంటే మంచిది!

కేసు రద్దు చేయడం కుదరదని, 12 వారాల్లోగా తుది నివేదికను తమకు సమర్పించాలని పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు సీమాన్ పిటిషన్‌ని న్యాయమూర్తి కొట్టేశారు. నటుడు, దర్శకుడు అయిన సీమాన్.. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నారు. సీమాన్‌ దర్శకత్వం వహించిన ఓ సినిమాలో విజయలక్ష్మి నటించారని, ఆ పరిచయం కారణంగా తన కుటుంబసమస్యల పరిష్కారానికి అతడ్ని ఆమె సంప్రదించారని న్యాయమూర్తి అన్నారు.

ప్లేటు ఫిరాయించి...

ఈ క్రమంలో ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక సంబంధం పెట్టుకున్నాడని, తర్వాత ప్లేటు ఫిరాయించి బెదిరింపులకి పాల్పడ్డారని తెలిపారు. అనంతరం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారని అన్నారు. అయితే, ఇరువురి ఆమోదంతో జరిగింది లైంగికచర్య నేరం కాదని, విజయలక్ష్మి తనపై కేసును 2012లో వెనక్కి తీసుకున్నట్లు సీమాన్ వాదించారన్నారు. అయితే, తనను వివాహం చేసుకుంటానని అందరి ముందు ఇచ్చిన హామీని నమ్మి ఫిర్యాదును వెనక్కి తీసుకున్నట్లు విజయలక్ష్మి తిరువళ్లూర్‌ మహిళా కోర్టులో వాగ్మూలం ఇచ్చినట్టు గుర్తించామని న్యాయమూర్తి తెలిపారు. 

అంతేకాదు, ఫిర్యాదును వెనక్కితీసుకుంటున్నట్టు లాయర్‌కు ఆమె ఇచ్చిన లేఖ సంబంధిత పోలీసు అధికారికి చేరలేదని, దీంతో ఆ కేసు పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు. ఈ కేసులో 15 మంది వాగ్మూలాలను నమోదుచేసినట్టు ప్రభుత్వం తరఫున న్యాయవాది తెలిపారని, ఇద్దరి మధ్య ఉన్నది ప్రేమ కాదని జస్టిస్ ఇళంతిరైయన్ అభిప్రాయపడ్డారు. అతడి కారణంగా బాధితురాలు సుమారు 7 సార్లు గర్బం దాల్చి.. అబార్షన్‌ చేయించుకున్నారని విచారణలో తెలిసిందన్నారు. అంతేకాదు, నటి విజయలక్ష్మి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు కూడా తీసుకుని.. ఆమెను బెదిరింపులకు గురిచేసి ఫిర్యాదుని వెనక్కి తీసుకునేలా ఒడిగట్టారని తెలిపారు.

సీమాన్‌పై లైంగిక ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని, ఫిర్యాదు వెనక్కి తీసుకున్నప్పటికీ రాజీ చేసుకోవడం కుదరదని తెగేసి చెప్పారు. 2023 వరకు ఇద్దరి మధ్య ఏదో ఒకరకంగా సంబంధం ఉందని, కాబట్టి లైంగిక వేధింపుల కేసు కొట్టేయడం కుదరదని న్యాయమూర్తి తన ఉత్తర్వులో పేర్కొన్నారు.

Also Read: Hezbollah-Nasralla: నసల్లా అంత్యక్రియలు..జనసంద్రంగా మారిన రోడ్లు..!

Also Read:  Slbc Tunnel Accident: ఆ 8 మంది ఎక్కడ...ఎలా ఉన్నారో...సవాల్‌ గా మారిన సహాయక చర్యలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Periods: ఇదేం మూర్ఖత్వం.. పిరియడ్స్ ఉన్న విద్యార్థికి క్లాస్ బయట పరీక్ష

తమిళనాడులోని కోయంబత్తూర్‌లో అమానవీయ ఘటన జరిగింది. పీరియడ్స్‌లో ఉన్న ఓ దళిత విద్యార్థిని పరీక్ష రాసేందుకు వస్తే.. ఆమెను తరగతి బయటే కూర్చోబెట్టారు. దీంతో బాలిక తల్లి విద్యాశాఖ అధికారులకు దీనిపై ఫిర్యాదు చేసింది.

New Update
Menstruating Class 8 student in Tamil Nadu made to take exam outside classroom

Menstruating Class 8 student in Tamil Nadu made to take exam outside classroom

తమిళనాడులోని కోయంబత్తూర్‌లో అమానవీయ ఘటన జరిగింది. పీరియడ్స్‌లో ఉన్న ఓ దళిత విద్యార్థిని పరీక్ష రాసేందుకు వస్తే.. ఆమెను తరగతి బయటే కూర్చోబెట్టారు. నెలసరి శుభ్రతపై ప్రభుత్వాలు పాలసీలు రూపొందిస్తూ.. అవగాహన కార్యక్రమాలు చేపడుతుంటే కొందరు మాత్రం మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. కోయంబత్తూర్‌లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినికి ఏప్రిల్ 5న మొదటిసారిగా రుతుక్రమం మొదలైంది. 

Also Read: భార్యపై అనుమానంతో బాత్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరా.. టెక్‌ బిలియనీర్‌ కేసులో భయంకర నిజాలు!

రెండ్రోజుల తర్వాత ఏప్రిల్ 7న ఫైనల్ పరీక్షల రాసేందుకు ఆమె స్కూల్‌కు వచ్చింది. కానీ ఆ విద్యార్థిని ఉపాధ్యాయులు లోపలికి అనుమతించలేదు. తరగతి బయటే కూర్చోబెట్టి పరీక్ష రాయించారు. ఆ తర్వాత ఆమె ఇంటికెళ్లాక తన తల్లికి ఈ విషయాన్ని చెప్పింది. దీంతో బుధవారం ఆ బాలిక తన తల్లితో కలిసి స్కూల్‌కు వచ్చింది. కానీ అప్పుడు కూడా ఆ విద్యార్థిని ఉపాధ్యాయులు బయటే కూర్చోబెట్టి పరీక్ష రాయించారు. 

Also Read: బిర్యానీ పెట్టి పడుకోపెట్టొద్దు.. వెంటనే ఉరి తీయండి: రాణాకు వ్యతిరేకంగా నిరసనలు!

తన కూతురికి జరిగిన ఘటనను తల్లి వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది వైరల్ అయ్యింది. దీంతో పాఠశాల యాజమాన్యంపై విమర్శలు వచ్చాయి. బాలిక తల్లి విద్యాశాఖ అధికారులకు కూడా ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది.  ఇదిలాఉండగా మధ్యప్రదేశ్‌లో కూడా మేరఠ్‌లో 11వ తరగతి విద్యార్థిని పరీక్ష రాస్తుండగా పీరియడ్స్ వచ్చాయి. శానిటరీ నాప్‌కిన్ కావాలని అడగగా.. ఉపాధ్యాయుడు ఆమెను బయటికి పంపించేశాడు. దీంతో అమ్మాయి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

Also Read: తీహార్ జైలుకు తహవూర్ రాణా.. పటిష్ట భద్రత ఏర్పాటు!

tamilnadu | national-news | periods

Advertisment
Advertisment
Advertisment