Chattisghar: ఛత్తీస్ ఘడ్ లో  17 మంది మావోయిస్టుల లొంగుబాటు...

ఛత్తీస్ ఘడ్ బీజాపూర్ లో 17 మంది మావోయిస్టులు ఈరోజు లొంగిపోయారు. వీరిలో ముఖ్యులు కూడా ఉన్నారు. వీరి తలలపై 24 లక్షల రివార్డ్ కూడా ఉందని పోలీసులు తెలిపారు. వీరు జనజీవన స్రవంతిలో కలిసేందుకు, పునరావాసం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

New Update
Maoists

Maoists

ఛత్తీస్ ఘడ్ లో పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయారు. ఈ మధ్య అక్కడ పోలీసులు కూంబింగ్ చాలా ఎక్కువ అయింది. దానికి తోడు మావోయిస్టులే తమంతట తాము వచ్చి లొంగిపోయేలా బెటాలియన్ కృషి చేస్తోంది. దాని ఫలితమే ఈరోజు 17 మంది మావోయిస్టులు పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఇందులో తొమ్మిది మంది తలలపై 24 లక్షల రివార్డ్ కూడా ఉందని పోలీసులు తెలిపారు.  లొంగిపోయిన వారిలో మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు దినేష్‌ మొడియం (36), అతడి భార్య జ్యోతి తాటి అలియాస్‌ కళా మొడియం (32) కూడా ఉన్నారని చెప్పారు. దినేష్ తలపై 8, జ్యోతిపై 5 లక్షల రివార్డ్ ఉంది. అలాగే అక్కడి ఏరియా కమిటీ సభ్యులు దుడ్ల కరంపై రూ.5లక్షలు, మరో ఆరుగురి తలలపై రూ.లక్ష చొప్పున రివార్డు ఉందన్నారు.ఈ మావోయిస్టులందరూ గంగలూరు ఏరియా కమిటీలో పలు హోదాల్లో ఇప్పటి వరకూ చురుగ్గా ఉన్నవారే కావడం గమనార్హం. మావోయిస్టుల లొంగుబాటు వెనుక డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డు, బస్తర్‌ ఫైటర్స్‌, స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌, సీఆర్‌పీఎఫ్‌, కోబ్రా దళాలు కీలక పాత్ర పోషించారని బీజాపూర్ ఎస్సీ జితేంద్ర కుమార్ యాదవ్ వివరించారు. 

పునారావాసం ఏర్పాట్లు..

మావోయిస్టుల మధ్య తేడాలే లొంగుబాటుకు కారణాలయ్యాయి. సైద్ధాంతిక లోపాలు, కొందరు అమాయక గిరిజనులను దోచుకోవడం లాంటి వాటితో నిరాశ చెందిన కొంత మంది మావోయిస్టులు ఈరోజు పోలీసుల ఎదుటకు వచ్చి లొంగిపోయారు. అలాగే గ్రామాల్లో అభివృద్ధి కోసం తాము చేపట్టిన నియా నెల్లనార్ అనే పథకం పట్ల ఆకర్షితులయ్యారని ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన వారికి రూ. 25వేలు చొప్పున సహాయం అందించామని.. ప్రధాన స్రవంతిలోకి చేర్చేందుకు ప్రభుత్వ విధానం ప్రకారం వారికి పునరావాసం కల్పిస్తామని చెప్పారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Earthquake: భారీ భూకంపం.. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ప్రజలు పరుగే పరుగు- ఎక్కడంటే?

పాకిస్థాన్‌లో భూకంపం సంభవించింది. ఇస్లామాబాద్ సమీపంలో శనివారం మధ్యాహ్నం 1:00 గంటలకు రిక్టర్ స్కేలుపై 5.8 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. షోపియన్, శ్రీ నగర్‌తో సహా భారతదేశంలోని జమ్మూ, కాశ్మీర్‌లో కూడా ప్రకంపనలు సంభవించాయి.

New Update
Pakistan Earthquake of 5.8 magnitude hits

Pakistan Earthquake of 5.8 magnitude hits

ప్రపంచ వ్యాప్తంగా భూకంపాలు ప్రజలను వణికిస్తున్నాయి. భూమి గజగజ వణుకుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇప్పటికి ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా.. దేశంలోని పలు రాష్ట్రాల్లో సైతం భూమి కంపించింది. తాజాగా దాయాదు దేశం పాకిస్తాన్‌లో భూమి వణికింది. దాదాపు 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. జమ్మూ-కాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి అని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. 

Also Read: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!

రిక్టర్ స్కేలుపై 5.8 తీవ్రత

పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్ సమీపంలో శనివారం మధ్యాహ్నం 1:00 గంటలకు (IST) రిక్టర్ స్కేలుపై 5.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉండటంతో.. ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని పేర్కొంది. పాకిస్తాన్‌లో 33.63 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 72.46 డిగ్రీల తూర్పు రేఖాంశంలో 5.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని వెల్లడించింది. అదే సమయంలో జమ్మూ, షోపియన్, శ్రీ నగర్‌తో సహా భారతదేశంలోని జమ్మూ, కాశ్మీర్‌లో కూడా ప్రకంపనలు సంభవించాయి. 

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

పాకిస్తాన్ మీడియా ప్రకారం.. పాకిస్తాన్‌లోని కరక్, చినియోట్, మియాన్వాలి, హఫీజాబాద్, షేఖుపురా, గుజ్రాన్‌వాలా, సాంగ్లా హిల్, సఫ్దరాబాద్, పిండి బాటియన్, అటాక్‌లలో ప్రకంపనలు సంభవించాయని తెలిపాయి. ప్రకంపనల తరువాత ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారని అక్కడి మీడియా తెలిపింది. ఇకపోతే పాకిస్తాన్‌లో తరచుగా వివిధ తీవ్రతలతో కూడిన భూకంపాలు సంభవిస్తుంటాయి. 2005లో ఆ దేశంలో అత్యంత దారుణమైన భూకంపం సంభవించింది. ఆ ప్రకంపానికి దాదాపు 74,000 మందికి పైగా మరణించారు. 

Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!

(latest-telugu-news | telugu-news | pakistan | earthquake)

Also Read: 'మంగపతి' గెటప్‌లో శివాజీ స్పెషల్ వీడియో వైరల్

Advertisment
Advertisment
Advertisment