PM Modi:ఈనెల 30న పాలమూరుకు ప్రధాని మోదీ

తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటనలో మార్పులు చోటుచేసుకున్నాయి. అక్టోబర్ 2వ తేదీన మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించాల్సి ఉండగా దాన్ని రెండు రోజుల ముందుకు అంటే సెప్టెంబర్ 30 కు మార్చారు. మహబూబ్ నగర్ లో బీజెపీ నిర్వహించే భారీ బహిరంగ సభలో మోదీ మాట్లాడనున్నారు.

New Update
PM Modi:ఈనెల 30న పాలమూరుకు ప్రధాని మోదీ

తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటనలో మార్పులు చోటుచేసుకున్నాయి. అక్టోబర్ 2వ తేదీన మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించాల్సి ఉండగా దాన్ని రెండు రోజుల ముందుకు అంటే సెప్టెంబర్ 30 కు మార్చారు. అక్టోబర్ 2 న రావాల్సి ఉండగా దాన్ని కొంచెం ముందుకు జరిపారు. మహబూబ్ నగర్ లో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. 30వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకు పాలమూరులో ఐటీఐ గ్రౌండ్ లో సభ ఉండనుంది. ప్రధాని మోదీ సభను 2023 ఎన్నికల శంఖారావం సభగా బీజెపీ రాష్ట్ర నేతలు చెబుతున్నారు. ఈ సభను తెలంగాణ బీజెపీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కనీసం లక్ష మందిని సభకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

భారీ బహిరంగ సభ ఏర్పాట్లను రాష్ట్ర బీజెపీ నేతలు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, తల్లోజు ఆచారి పర్యవేక్షిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజెపీ గెలిచేలా చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. ఇంటింటికీ వెళ్ళి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ , కాంగ్రెస్ లకంటే తమ పార్టీనే బెటర్ అని ప్రజలకు ప్రచారం చేస్తున్నారు.

అలాగే అక్టోబర్ 3 న నిజామాబాద్ కు కూడా ప్రధాని మోదీ రానున్నారు. ఇక్కడ కూడా బహిరంగ సభ లేదా రోడ్ షో ఉండవచ్చని లోకల్ బీజెపీ నేతలు చెబుతున్నారు.
దీనికి సంబంధించి అక్టోబర్ 1 న బీజేపీ విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉంటుందని తెలిపారు. దీనికి
రాష్ట్ర పదాదికారులు, జిల్లా అధ్యక్షులు , జిల్లా ఇంఛార్జి లు , పార్లమెంట్ ఇంఛార్జి లు, అసెంబ్లీ కన్వీనర్ లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరుకానున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: మెటా ఓనర్ జుకర్ బర్గ్ చైనాతో చేతులు కలిపారు..సంచలన ఆరోపణలు

మెటా ఓనర్ మార్క్ జుకర్ బర్గ్ పై చాలా పెద్ద ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఆ సంస్థలో పని చేసిన మాజీ ఉద్యోగి ఒకరు మార్క్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఆయన చైనాతో చేతులు కలిపి అమెరికన్ల మోసం చేస్తున్నారని ఆరోపించారు. 

New Update
meta

meta

అసలే ఒక పక్క అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకున్నాయి. దానికి తోడు మరో కొత్త వివాదం తెర మీదకు వచ్చింది. ఇందులో మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్ మీదనే ఏకంగా సంచలన ఆరోపణలు తెర మీదకు వచ్చాయి. జుకర్ బర్గ్ అమెరికా జాతీయ భద్రత గురించి ఆలోచించలేదని...అమెరికన్లను మోసం చేస్తున్నారని మెటాలో పని చేసిన మాజీ ఉద్యోగి ఒకరు ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. మొత్తం అమెరికన్లతో సహా మెటా వినియోగదారుల డేటా చైనీస్‌ అధికారుల చేతుల్లోకి వెళుతోందని అన్నారు. 

మెటా చైనాతో చేతులు కలిపింది..

మెటా ఇప్పటికే చాలా ప్రాబ్లెమ్స్ ను ఎదుర్కొంటోంది. గోప్యతా విధానం, అనైతిక వ్యాపా విలువలు లాంటి అంశాల్లో మెటా యూఎస్ కాంగ్రెస్ ఎదుట విచారణను ఎదుర్కొంటోంది. ఇందులో భాగంగానే మెటా మాజీ ఉద్యోగి సారా విన్ విలియమ్స్ వెట్ నెస్ గా మారి జుకర్ బర్గ్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కమిటీ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. అప్పుడే ఆయనపై విలియమ్స్ సంచలన ఆరోపణలు చేశారు. మెటా ఎగ్జిక్యూటివ్ లు పదేపదే జాతీయ భద్రతను అణగదొక్కారని...అమెరికా విలువలకు ద్రోహం చేయండ తాను చూశానని విలియమ్స్ చెప్పారు. మెటా చైనీస్‌ ప్రభుత్వం కోసం కస్టమ్‌ సెన్సార్‌షిప్‌ టూల్స్‌ను అభివృద్ధి చేసింది. ఈ టూల్స్‌తో కంటెంట్‌పై విస్తృత నియంత్రణ లభిస్తుందని చెప్పారు. జుకర్ బర్గ్ అమెరికా దేశ భక్తుడు అని చెబుతారు కానీ చైనాలో 18 బిలియన్ డాలర్ల   వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారని తెలిపారు. అమెరికన్లు సహా మెటా యూజర్ల డేటాను చైనా ప్రభుత్వం తెలుసుకునేలా మెటా ఎగ్జిక్యూటివ్‌లు నిర్ణయాలు తీసుకొంటున్నారని విలియమ్స్ ఆరోపించారు.

today-latest-news-in-telugu | meta | mark-zuckerberg

Also Read: US Dollar: డాలర్ పడిపోతోంది..రూపాయి పెరుగుతోంది..ఏమవుతోంది అమెరికా ఆర్థిక వ్యవస్థకు?

 

Advertisment
Advertisment
Advertisment