Andhra Pradesh: వారికి వెంటనే జీతాలు చెల్లించాలి.. లోకేష్ కీలక ఆదేశాలు

వచ్చే విద్యాసంవత్సరం మొదలయ్యే నాటికి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు సిద్ధంగా ఉంచాలని మంత్రి నారా లోకేష్ అధికారులకు ఆదేశించారు. అలాగే పాఠశాలల్లో ఆయాలు, వాచ్‌మెన్లకు పెండింగ్‌లో ఉన్న జీతాలను తక్షణమే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

New Update
Andhra Pradesh: వారికి వెంటనే జీతాలు చెల్లించాలి.. లోకేష్ కీలక ఆదేశాలు

వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు సిద్ధంగా ఉంచాలని మంత్రి నారా లోకేష్ అధికారులకు ఆదేశించారు. పాఠశాల విద్య ఉన్నతాధికారులతో ఆయన ఉండవల్లి నివాసంలో శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. ''పాఠ్యపుస్తకాలను సకాలంలో అందించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా సీబీఎస్ఈ సిలబస్ అమలవుతున్న వెయ్యి పాఠశాలల్లో అసెస్‌మెంట్ టెస్ట్ కొనసాగుతోంది. ఇందుకు సంబంధించిన ఫలితాలు వచ్చాక విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవాలి. మండల స్థాయిలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చింది. ఆ తర్వాత డివిజన్ స్థాయిలో చేపట్టాలి. సర్దుబాటు ప్రక్రియలో ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాం. సెప్టెంబర్ 5 న గురుపూజోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించాలి. ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించాలి. నవంబర్‌లో మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాన్ని ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలి.

Also Read: ఏపీలో నైపుణ్య గణన సర్వే.. నారా లోకేష్ కీలక ఆదేశాలు

అలాగే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో సైన్స్ ఫేర్, స్పోర్ట్స్ మీట్స్ నిర్వహించాలి. విద్యార్థుల్లో క్రీడానైపుణ్యాలను పెంపొందించేందుకు అవసరమైన స్పోర్ట్స్ కిట్స్ అందజేయాలి. పాఠశాల విద్య శాఖను పట్టిపీడిస్తున్న కోర్టు వివాదాల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించిన యాప్‌ల భారాన్ని టీచర్లకు తప్పించాం. గ్రామ సచివాలయాల్లో వెల్ఫేర్ అసిస్టెంట్లకు ఈ బాధ్యతలు అప్పగించాం. స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలూ కూడా ఇందులో భాగస్వామ్యమై పర్యవేక్షణ చెయాలి. పాఠశాలల్లో ఆయాలు, వాచ్‌మెన్లకు పెండింగ్‌లో ఉన్న జీతాలను తక్షణమే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలి. లెర్నింగ్స్ అవుట్‌కమ్స్‌పై సమీక్షిస్తూ విద్యా సామర్థ్యాల మెరుగుదలకు పకడ్బందీగా శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలని'' మంత్రి లోకేష్ సూచనలు చేశారు.

అలాగే అనకాపల్లి అనాథ శరణాలయంలో కలుషితాహారం తిని ముగ్గురు విద్యార్థులు మృతిచెందిన ఘటనపై లోకేష్ విచారం వ్యక్తంచేశారు. ఆ సంఘటనకు సంబంధించిన వివరాలను ఆరా తీశారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏజెన్సీ స్కూళ్లతో పాటు ప్రైవేట్ వ్యక్తులు నడిపే ఆశ్రమాలు కూడా నిరంతరం ట్రాక్ చేస్తూ పర్యవేక్షించాలన్నారు. పాఠశాలల్లో ఇంటర్నల్, ఎక్సటర్నల్ ప్రశ్నాపత్రాలు ఏ స్థాయిలో లీకైనా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించి లెక్చరర్స్, ప్రిన్సిపాల్స్ పదోన్నతులు, పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులపై కూడా లోకేశ్ సుదీర్ఘంగా చర్చించారు. సాధ్యమైనంత త్వరగా కేసుల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. ఈ సమావేశంలో పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి కోన శశిధర్, డైరక్టర్ విజయరామరాజు, ఇంటర్మీడియట్ విద్య డైరక్టర్ కృతికా శుక్లా తదితరులు పాల్గొన్నారు.

Also Read: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకాలో ఉద్రిక్తత.. రెండు వర్గాల మధ్య ఘర్షణ..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vontimitta Temple : ప్రతి భక్తుడికి ముత్యపు తలంబ్రాలు, అన్నప్రసాదాలు.

శ్రీరామ నవమి ఉత్సవాలకు ఒంటిమిట్ట ఆలయంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏప్రిల్ 11న జరుగనున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి విచ్చేసే ప్రతి భక్తుడికి ముత్యపు తలంబ్రాలు, అన్నప్రసాదాలు అందించేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు టీటీడీ అధికారులు సమీక్ష చేసారు.

New Update
Vontimitta Temple

Vontimitta Temple

Vontimitta Temple : శ్రీరామనవమి వేడుకులకు దేశమంతా సిద్ధమైంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే తెలంగాణలో భద్రాచలం, ఆంధ్రప్రదేశ్‌లో ఒంటిమిట్ట దేవాలయాల్లో స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. కాగా శ్రీరామనవమి వేడుకలకు రెండు రాష్ట్రాలు ఘనంగా ఏర్పాట్లుచేస్తున్నాయి. శ్రీరామ నవమి ఉత్సవాలకు ఒంటిమిట్ట ఆలయంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతీ ఏటా ఈ ఆలయంలో వైభవంగా వేడుకలు నిర్వహిస్తారు. ఒంటిమిట్ట ఏకశిలానగరంలో ఏప్రిల్ 11న జరుగనున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి విచ్చేసే ప్రతి భక్తుడికి ముత్యపు తలంబ్రాలు, అన్నప్రసాదాలు అందించేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ముందస్తు ఏర్పాట్ల పైన టీటీడీ అధికారులు సమీక్ష చేసారు. అధికారులకు పలు సూచనలు ఇవ్వటంతో పాటుగా చేపట్టా ల్సిన చర్యల పైన దిశా నిర్దేశం చేసారు. 

ఇది కూడా చదవండి: వేయించిన ఆహారాలతో క్యాన్సర్‌ ముప్పు

క్షేత్ర స్థాయిలో అధికారులు పటిష్ట ప్రణాళికలు ఏర్పాటు చేసుకుని అమలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. కల్యాణ వేదిక ప్రాంగణం వద్ద ఉన్న 120 గ్యాలరీల లో ఉండే భక్తులతో పాటు, కల్యాణం వీక్షించేందుకు వచ్చిన భక్తులందరూ శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కల్యాణ వేదిక ప్రవేశ ప్రారంభంలో తలంబ్రాలు పంపిణీ కోసం 16 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భారీగా రానున్న భక్తులు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం తిలకించేలా 15 ఎల్ ఈడీ స్క్రీన్ లు, ఆలయం , కల్యాణ వేదిక, తదితర ప్రాంతాల్లో విద్యుత్ కాంతులతో 38 దేవతామూర్తుల విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు సులువుగా గుర్తించేదెలా సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 

ఇది కూడా చదవండి: లంగ్స్‌ బేషుగ్గా ఉండాలంటే తులసి ఆకులు నమలండి

విజిలెన్స్ శాఖ ఆధ్వర్యంలో 100 సిసి కెమెరాలు, 3 డ్రోన్ లు, 3 కంట్రోల్ రూమ్ లు, దాదాపు 2400 మంది భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్స వాలకు దాదాపు 3 లక్షల తాగునీరు బాటిల్స్, 250 మంది పారామెడికల్ సిబ్బంది, 35 మంది వైద్య నిపుణులు, 13 మెడికల్ టీంలు, 8 అంబులెన్స్ లు, అగ్నిమాపక సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 

ఇది కూడా చదవండి: పప్పు ధాన్యాలు తినడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు తప్పవా?

 హెచ్ డి పీపీ - (18), దాస సాహిత్య ప్రాజెక్టు - (4,) అన్నమాచార్య ప్రాజెక్టు- (8) ఆధ్వర్యంలో మొత్తం 30 కళాబృందాలతో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మొదటిసారి కళాకృతులుతో సంక్షిప్త రామాయణాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు, కల్యాణ వేదిక, ఆలయం, పరిసర ప్రాంతాల్లో 12 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, లక్ష కట్ ఫ్లవర్స్ తో పుష్పాలంకరణలు చేస్తున్నట్లు తెలిపారు. కల్యాణోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. ఒంటిమిట్టలో జరిగే ఈ కల్యాణోత్సవం తిలకించటానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి.

Also read :  నీ అభిమానం సల్లగుండా.. పవన్ కోసం రక్తం చిందించిన అభిమాని.. ఏం చేశాడంటే?

Advertisment
Advertisment
Advertisment