Andhra Pradesh: విద్యార్ధులకు సర్టిఫికేట్లు..మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు

విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలతో సర్టిఫికేట్లు అందక బాధపడుతున్న విద్యార్ధుల విషయంలో ఆంద్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. అందరికీ సర్టిఫికేట్లు అందజేయాలని అధికారులకు చెప్పారు. దీని వలన 6 లక్షల మంది స్టూడెంట్స్‌కు పర్టిఫికేట్లు అందనున్నాయి.

New Update
Andhra Pradesh: విద్యార్ధులకు సర్టిఫికేట్లు..మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు

Minister Lokesh: ఉన్నత విద్య అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యాదీవెన, వసతిదీవెన కింద వైసీపీ ప్రభుత్వం రూ.3,480 కోట్లు బకాయిలు పెట్టడం వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అధికారులతో చర్చించారు. విద్యాసంస్థలతో మాట్లాడి ముందు విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించాలని సూచించారు.

దాంతో పాటూ యూనివర్సిటీలు, డిగ్రీ కళాశాలల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి చేపట్టాల్సిన చర్యలు, ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాల పెంపు, కరిక్యులమ్‌లో మార్పులు, విద్యార్థుల్లో నైపుణ్యత పెంచడానికి పాఠ్యాంశాల్లో మార్పులు, ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజులు, ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో మౌలిక వసతుల కల్పన, అడ్మిషన్ల పెంపుదలకు తీసుకోవాల్సిన చర్యలు, రూసా నిధుల వినియోగం మొదలగు వాటి మీద కూడా మంత్రి లోకేష్ సమీక్షించారు. వాటికి సంబంధించి కూడా త్వరలోనే నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు.

Also Read:Telanagna: డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ రిలీజ్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Lady Aghori: ఆ పెళ్లి చెల్లదు.. లేడీ అఘోరీ జైలుకే..! చట్టం ఏం చెబుతుందంటే..?

LGBTQ చట్టం కేవలం ట్రాన్స్‌జెండర్ల వివాహం గురించి మాత్రమే చెబుతుందని, ఓ ట్రాన్స్‌జండర్ స్త్రీని పెళ్లి చేసుకోవడం ఎక్కడా జరగలేదని ఈ పెళ్లి చెెల్లదని న్యాయనిపుణులు అంటున్నారు. అఘోరీకి గతంలో 2సార్లు పెళ్లైందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అది నిజమైతే అఘోరీ జైలుకే.

New Update
aghori marriage

aghori marriage Photograph: (aghori marriage)

గతకొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో సనాతన ధర్మాన్ని రక్షిస్తా.. హిందూ ఆలయాలపై దాడిని ఖండిస్తా అంటూ హల్ ఛల్ చేసిన అఘోరీ మరోసారి హాట్ టాపిక్‌గా నిలిచారు. తను ఒక స్త్రీగా చెప్పుకొని తిరుగుతూ.. అందులోనూ లేడీ అఘోరీగా ఫేమస్ అయిన అల్లురి శ్రీనివాస్ అలియాస్ లేడీ అఘోరీ పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. శ్రీవర్షణి అనే యువతిని లేడీ అఘోరీ పెళ్లి చేసుకుంది. తనకు ఎలాంటి సెక్సువల్ ఫీలింగ్స్ లేవంటూ అల్లూరి శ్రీనివాస్ చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. సాధువు అంటేనే అన్నింటిని త్యజించడం.. కానీ ఇక్కడ నాగసాధువుగా చెప్పుకొనే అల్లూరి శ్రీనివాస్ ప్రేమ, పెళ్లి అంటూ తిరుగుతున్నాడు.

పుట్టుకతో పురుషుడైన శ్రీనివాస్ లింగమార్పిడి ఆపరేషన్ చేసుకున్నాడు. తర్వాత సాధువుగా మారి సన్యాసం తీసుకున్నాడు. 12 సంవత్సరాలు కఠోర దీక్ష చేశానని, నిత్యం శివనామ స్మరణ చేస్తానని అల్లూరి శ్రీనివాస్ అందరితో చెప్పాడు. అయితే ఇప్పుడు మాత్రం ఓ యువతి చుట్టూ తిరుగుతున్నాడు. నువ్వు లేక నేను లేను అంటూ ఆమెతో కలిసి దేవాలయాలకు వెళ్తున్నాడు. మా అమ్మాయిపై వసీకరణ చేసి తనతో వెళ్లిపోయేట్లు చేశాడని శ్రీవర్షణి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 20రోజుల క్రితం శ్రీవర్షిణి అఘోరీతో వెళ్లింది. శ్రీవర్షిణి కుటుంబ సభ్యులు ఆమెను అఘోరి నుంచి ఇంటికి తీసుకొచ్చారు. తన ఇంట్లో ఉండటం ఇష్టం లేదని.. అఘోరీ అమ్మతోనే వెళ్లిపోతానని శ్రీవర్షణీ అంటోంది. మళ్లీ ఇంట్లో నుంచి వెళ్లి పోయింది. ఈసారి అఘోరీతో వెళ్లి మధ్య ప్రదేశ్‌లో పెళ్లి కూడా చేసుకుంది. హిందూ సాంప్రదాయాల ప్రకారం గుడిలో అల్లూరి శ్రీనివాస్ అలియాస్ లేడీ అఘోరీ శ్రీవర్షణిని పెళ్లి చేసుకున్నారు. అసలు చట్టప్రకారం వారి పెళ్లి చెల్లుతుందా? అఘోరీ అనే విషయం పక్కన పెడితే అల్లూరి శ్రీనివాస్ ట్రాన్స్‌జెండర్, అయితే ఓ ట్రాన్స్‌జెండర్ స్త్రీని వివాహం చేసుకోవచ్చా..? అనే ప్రశ్న చాలామంది మైండ్‌లో తిరుగుతుంది.

భారతదేశంలో 2023 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. భిన్న లింగ సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తులు పెళ్లి చేసుకోవచ్చు. అంటే పుట్టుకతో వారికున్న లింగాన్ని మార్చుకొని ఇతరులను పెళ్లి చేసుకునే హక్కులు చట్టరీత్య ఉన్నాయి. కోర్టు ఈ తీర్పును ఒక లింగమార్పిడి పురుషుడు సిస్జెండర్ స్త్రీని వివాహం చేసుకోవచ్చు. అలాగే ఒక ట్రాన్స్‌జెండర్ స్త్రీని సిస్జెండర్ పురుషుడిని వివాహం చేసుకోవచ్చు. భిన్న లింగ సంబంధాలలో ఉన్న ట్రాన్స్‌జెండర్లు పర్సనల్ రైట్స్‌తోపాటు వివాహం చేసుకునే హక్కును కూడా కలిగి ఉన్నారని సుప్రీంకోర్టు ధృవీకరించింది. 

స్త్రీగా ఉన్న వర్షిణిని, స్త్రీగా మారిన ట్రాన్స్ జెండర్ అఘోరీ పెళ్లి చేసుకుంటే అది స్వలింగ వివాహం అవుతుంది. స్వలింగ వివాహంపై కోర్టు ఇప్పటివరకు ఎలాంటి తీర్పు ఇవ్వలేదు, కానీ రాజ్యాంగం ప్రకారం LGBTQ+ పౌరుల హక్కులను గుర్తించింది. LGBTQ సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కోవడానికి చట్టాలను రూపొందించడానికి పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభలకు అధికారం ఇచ్చింది. లింగమార్పిడి వ్యక్తుల చట్టం 2019 అని తయారు చేసింది. ఇందులో ట్రాన్స్‌జెండర్ల, సిస్జెండర్ల మధ్య వివాహాలు ప్రత్యేక వివాహ చట్టం మరియు వ్యక్తిగత చట్టాలతో సహా ప్రస్తుత చట్టాల ప్రకారం చెల్లుబాటు అవుతాయని కోర్టు పేర్కొంది. ఇందులో స్వలింగ వివాహం గురించి చెప్పలేదు. అంతేకాదు లింగమార్పిడి చేసుకున్న వ్యక్తి స్త్రీని వివాహం చేసుకోవచ్చని కూడా చెప్పలేదు. కావున చట్ట ప్రకారం అఘోరీ పెళ్లి చెల్లదని కొందరు న్యాయ నిపుణులు అంటున్నారు. పురుషుడి భావాలు కలిగి ఉండి స్త్రీ అవతారంలో ఉన్న అల్లూరి శ్రీనివాస్ శ్రీవర్షిణిల వివాహం చట్ట విరుద్ధమని చెబుతున్నారు. అంతేకాదు.. ఇది వరకే అఘోరీ మరో ఇద్దర్ని పెళ్లి చేసుకుందని బాధితులు మీడియా ముందుకు వస్తున్నారు. అదే కనుక వాస్తవం అయితే.. లేడీ అఘోరీ జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుంది.

Advertisment
Advertisment
Advertisment