/rtv/media/media_files/2025/04/03/TZQpbubm2HKskIOeoq59.jpg)
Srirama navami Photograph: (Srirama navami)
చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తూ ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని శ్రీరామనవమిగా విశేషంగా జరుపుకుంటాం. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ద నవమి,గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహుర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు.
Also Read: Ukraine: పేరుకే అగ్రరాజ్యం..చేసేవన్నీ బలహీనమైన పనులే..అమెరికాపై జెలెన్ స్కీ విమర్శలు
పదునాలుగు సంవత్సరాలు అరణ్యవాసం,రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు.ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజలు నమ్ముతారు.మరీ ఈ రోజే ఎందుకు సీతారాముల కల్యాణం చేస్తారు అనే విశేషాలు ఈ కథనంలో...
Also Read: Kerala: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!
Sri Rama Navami Story
ఆగమ శాస్త్రం ప్రకారం...శ్రీ సీతారామల కల్యాణం ఉత్తర ఫల్గుణి నక్షత్రం యుక్త వైశాఖ శుద్ధ దశమి రోజున జరిగింది. కానీ ఆగమశాస్త్రం మాత్రం గొప్ప వ్యక్తులు, అవతార పురుషులు జన్మించిన తిథి నాడే ఆ నక్షత్రంలోనే వివాహం జరిపించాలని శాస్త్రాల నియమం. అందుకే శ్రీరాముడు పుట్టిన చైత్ర శుద్దనవమి, పునర్వసు నక్షత్రం వేళ దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం జరుపుకుంటారు. ఈ లోకోత్తర కల్యాణం జరిగినప్పుడే లోక కల్యాణ యఙానికి హేతువుగా నిలబడిందని శాస్త్రాలలో వివరించడం జరిగింది.
శ్రీరాముడు, సీతాదేవి ఇద్దరూ కూడా సాధారణ వ్యక్తులు కాదు.వీరిద్దరూ యజ్ఙ ఫలితంగా ఆధారంగా ఆవిర్భవించినట్లు పురాణాలు చెబుతున్నాయి.దశరథ మహారాజు తన వంశం కోసం చేసిన యాగం ఫలితంగా శ్రీరాముడు జన్మిస్తాడు. అదే సమయంలో యజ్ఙం నిర్వహించేందుకు యాగశాల కోసం భూమిని తవ్వుతున్న జనకుడికి నాగేటి చాలు ద్వారా లభించిన యజ్ఙప్రసాదం సతీమ్మ వారు.
చైత్రమాసం శుద్ద నవమి రోజున లోక కల్యాణం అని సంకల్పంలో పండితులు చదువుతుంటారు. అందుకే కొత్తగా పెళ్లయిన దంపతులను సీతారామచంద్రులుగా భావిస్తారు.తలంబ్రాల కార్యక్రమంలో కూడా శ్రీసీతారాముల కల్యాణం పాటను భజంత్రీలు పాడుతుంటారు.పూజలు కూడా చేస్తారు.
ఇదిలా ఉంటే...మరో కథనం ప్రకారం..భక్తరామదాసు చెరసాలలో ఉండిపోయిన కారణంగా పూర్వం సీతారాముల కల్యాణం మార్గశిర శుద్ధ పంచమి నాడు జరిగినట్లుగా , అయితే తాను చెరసాల నుంచి తిరిగి వచ్చాక చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామ చంద్రుని పుట్టిన రోజు వేడుకలు,కల్యాణ వేడుకలు ఒకేసారి జరిపించారు. సీతారామ కల్యాణం, రాముడు రావణున్ని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చింది కూడా శ్రీరామనవమి నాడే. ఆ మరునాడు దశమి నాడు శ్రీరామ పట్టాభిషేకం రామునికి జరిగింది.
కోదండ రామ కల్యాణ్యాన్నిచూసేందుకు సకల దేవతలు దివి నుంచి భువికి దిగి వస్తారంటూ ..శ్రీరామచంద్రుని దివ్యదర్శనం మహనీయంగా నేత్రపర్వంగా పట్టాభిషేకం సమయాన తిలకించి పులకితులవుతారని నమ్మకం.
Also Read: Musk: యూఎస్-యూరప్ ల మధ్య సుంకాలుండవు..మస్క్ సంచలన వ్యాఖ్యలు!
Also Read: Trump Tarrifs: అసలైన ప్రమాదం ముందుంది: జేపీ మోర్గాన్!
latest telugu news updates | latest-telugu-news | telugu-news | Sri Rama Navami 2025 | today-news-in-telugu | daily-life-style | human-life-style