Morning Work: ఉదయం 9 గంటలలోపు ఈ ఐదు పనులు చేయండి

ప్రతిరోజు ఉదయం ఈ 5 పనులు చేస్తే శరీరం శుభ్రంగా ఉంటుంది. ఆయిల్ పుల్లింగ్, కొబ్బరినూనెను నోటిలో వేసుకుని, వేడినీటి స్నానం, గోరువెచ్చని నీటిలో అల్లం, నిమ్మరసం కలిపి తాగాలి, లోతైన యోగా, శ్వాస వ్యాయామాలు చేయడం వలన రక్త సరఫరా, జీర్ణక్రియను పెంచుతుంది.

New Update
Morning Work

Morning Work

Morning Work: మన శరీరం నుండి మలినాలు, వ్యర్థాలను తొలగించడం వల్ల మెరుగైన ఆరోగ్యం లభిస్తుంది. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. శరీరం నుండి వ్యర్థాలను, మలినాలను తొలగించడం కష్టతరంగా కొందరు భావిస్తారు. అయితే ప్రతిరోజు ఉదయం ఈ 5 పనులు చేస్తే శరీరం శుభ్రంగా ఉంటుంది. ఆయిల్ పుల్లింగ్ అనేది ఒక పురాతన ఆయుర్వేద ప్రక్రియ. ఇది శరీరాన్ని, ముఖ్యంగా నోటిలోని మలినాలను శుభ్రపరచడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతిరోజూ ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను నోటిలో వేసుకుని 10-15 నిమిషాలు పుక్కిలించడం వల్ల హానికరమైన బ్యాక్టీరియా తొలగిపోతుందని చెబుతున్నారు.

ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది:

ఉదయం 7 గంటలకు ఇలా చేయడం వల్ల రాత్రి నుండి నోటిలో పేరుకుపోయిన మలినాలు తొలగిపోతాయి. ఫలితంగా తాజా శ్వాసను ఇవ్వడమే కాకుండా దంతాలను కూడా శుభ్రపరుస్తుంది. ఉదయం వేడినీటి స్నానం చేయడం వల్ల శరీరంలో పేరుకుపోయిన మలినాలు, వ్యర్థాలు తొలగించబడి విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది. అలాగే శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడి, ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. యూకలిప్టస్, లావెండర్ వంటి కొన్ని చుక్కల ముఖ్యమైన నూనెలను జోడించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని నిపుణులు అంటున్నారు ప్రతి ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అల్లం, నిమ్మరసం కలిపి తాగాలి.  

ఇది కూడా చదవండి: ఇంట్లో మనీ ప్లాంట్లు ఇక్కడ పెట్టండి... డబ్బే డబ్బు!

ఇది శరీరంలోని pH స్థాయిని నియంత్రిస్తుంది. ఇది శరీరం నుండి మలినాలను తొలగించే సహజ నిర్విషీకరణిగా కూడా పనిచేస్తుంది. అలాగే అల్లం శోథ నిరోధక లక్షణాలు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయని, ఆమ్లతను తగ్గిస్తాయి. ప్రతి ఉదయం లోతైన యోగా, శ్వాస వ్యాయామాలు చేయండి. ఇది ఊపిరితిత్తుల నుండి మలినాలను తొలగిస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. దీనివల్ల రక్తంలో ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది. నాలుగు సెకన్ల పాటు లోతుగా శ్వాస తీసుకోండి, 7 సెకన్ల పాటు మీ శ్వాసను పట్టుకోండి, ఆపై 8 సెకన్ల పాటు గాలిని వదిలివేయండి. ఇలా చేయడం వల్ల శరీరం శుభ్రపడుతుంది. ఉదయాన్నే ఎండలో నడవడం ద్వారా కూడా విటమిన్ డి పొందవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: చెరకు రసం మొటిమలు, మచ్చలను తొలగిస్తుందా?


( health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news )

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vaishakha Amavasya వైశాఖ అమావాస్య రోజున.. ఈ రాశుల వారు ఇవి దానం చేస్తే అన్నీ శుభాలే !

హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ 27న వైశాఖ అమావాస్య వస్తుంది. ఈరోజు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. అయితే వైశాఖ అమావాస్య రోజున రాశిచక్రం ప్రకారం కొన్ని చర్యలు  చేయడం ద్వారా  శుభ ఫలితాలను కలిగిస్తుంది. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.. 

New Update
Vaishakha Amavasya

Vaishakha Amavasya

Vaishakha Amavasya హిందూ మతవిశ్వాసాల ప్రకారం వైశాఖ అమావాస్య ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఏడాదిలో 12 అమావాస్య తిథులు ఉంటాయి. అందులో వైశాఖ మాసంలో వచ్చే అమావాస్యను వైశాఖ అమావాస్య అంటారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 27 ఉదయం 4: 28 గంటలకు మొదలై 28 తెల్లవారుజామున 1: 02 గంటలకు ముగుస్తుంది. ఈ ప్రత్యేకమైన రోజున విష్ణువును పూజిస్తారు. అలాగే దానధర్మాలకు కూడా ఇది పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. పితృదేవులకు పిండం, తర్పణం కూడా చేస్తారు. అయితే పితృదేవుల ఆత్మశాంతి కోసం  వైశాఖ అమావాస్య రోజున రాశిచక్రం ప్రకారం కొన్ని చర్యలు  చేయడం ద్వారా  శుభ ఫలితాలను కలిగిస్తుంది. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.. 

రాశి చక్రం ప్రకారం చేయాల్సిన పనులు 

మేష రాశి 

 మేష రాశి వారు వైశాఖ అమావాస్య రోజున  తమ పూర్వీకులకు నీరు, షర్బత్, చల్లని వస్తువులను దానం చేయడం శుభ ఫలితాలను కలిగిస్తుంది. 

వృషభ రాశి 

వైశాఖ అమావాస్య రోజున వృషభ రాశి వారు డబ్బు, ఆహారాన్ని దానం చేయడం ద్వారా తమ పూర్వీకులను ప్రసన్నం చేసుకుంటారు. అలాగే శుభఘడియలు కూడా మొదలవుతాయి. 

కర్కాటక రాశి 

ఈ ప్రత్యేకమైన రోజున కర్కాటక రాశి వారు తెల్లటి ఆహార పదార్థాలను, ధనాన్ని ఎక్కువగా దానం చేయాలి. ఇలా చేయడం వల్ల శుభఫలితాలు కలగడంతో పాటు పూర్వీకుల ఆత్మ శాంతిస్తుంది. 

సింహరాశి 

సింహ రాశివారు బెల్లం, పప్పుదినుస్సులు, తేనే దానం చేయవచ్చు. వైశాఖ అమావాస్య రోజున ఈ దానాలు సింహరాశి వారికి శుభప్రదంగా పరిగణించబడతాయి. 

కన్య రాశి 

వైశాఖ అమావాస్య రోజున కన్య రాశి వారు పూర్వీకుల ఆనందం కోసం నెయ్యితో తయారు చేసిన ఆహార పదార్థాలను దానం చేయాలి. 

తులారాశి 

తులారాశిలో జన్మించినవారు బ్రాహ్మణులకు భోజనం పెట్టడం, తెల్లటి వస్త్రాలను దానం చేయడం ద్వారా శుభాలు చేకూరుతాయి. 

వృచ్చిక రాశి 

వృచ్చిక రాశివారు బెల్లం, ఎర్రటి బట్టలు దానం చేస్తే పూర్వీకుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

telugu-news | latest-news | life-style | zodiac-signs

Advertisment
Advertisment
Advertisment