Obesity: ఊబకాయం నుండి బయటపడాలంటే మామిడి పండ్లు బెటరా?

మామిడిలో పొటాషియం, మెగ్నీషియం పుష్కలం. మామిడి పండ్లు చర్మ ఆరోగ్యానికి మంచివి. ఇది చర్మాన్ని తేమ, మెరుపు, మచ్చలు, ముడతల నుంచి రక్షించి యవ్వనంగా కనబడేలా చేస్తాయి. ఊబకాయం సమస్యకు మామిడిని తరచుగా ఔషధంగా ఉపయోగిస్తారని నిపుణులు అంటున్నారు. 

New Update
mangoes

mangoes

Obesity: వేసవి వచ్చిందంటే మార్కెట్లో మామిడి కాయలు గుట్టలుగా కనిపిస్తాయి. మామిడి ప్రియులకు వేసవి ఒక పండుగ లాంటిది. అంతే కాకుండా ఈ సీజన్‌లో మామిడి పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు అంటున్నారు. మామిడి పండ్లు చర్మ ఆరోగ్యానికి చాలా మంచివి. ఇది చర్మానికి తేమను అందించి, మెరుపును ఇస్తాయి. మచ్చలను తొలగిస్తాయి. ముడతల నుండి రక్షిస్తుంది. మిమ్మల్ని యవ్వనంగా కనబడేలా చేస్తాయి. మామిడిలో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి అధిక రక్తపోటు నుండి రక్షిస్తాయి.

ఊబకాయం సమస్యలు:

ఇది గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. రక్తహీనతతో బాధపడేవారికి మామిడి ఒక అద్భుతమైన ఎంపిక. ఈ సీజన్‌లో వీటిని ప్రతిరోజూ తీసుకోవచ్చు. ఇటీవలి సంవత్సరాలలో పెరుగుతున్న ఊబకాయం సమస్యకు మామిడిని తరచుగా ఔషధంగా ఉపయోగిస్తారని నిపుణులు అంటున్నారు. ఇందులో ఉండే ప్రోటీన్, ఫైబర్, ఫోలిక్ యాసిడ్ ఊబకాయాన్ని తగ్గించడంలో చాలా ఉపయోగపడతాయి. వేసవిలో వీటిని తీసుకోవడం వల్ల ఊబకాయం సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

ఇది కూడా చదవండి: సిజేరియన్ డెలివరీ తర్వాత ఇవి తింటే త్వరగా కోలుకుంటారు

మామిడి పండు జీర్ణ సమస్యలకు మంచిది. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే బీటా కెరోటిన్ రోగనిరోధక శక్తిని పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మామిడి కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అంటున్నారు. చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలను తొలగిస్తుంది. కానీ మామిడి పండ్లను క్రమం తప్పకుండా తీసుకుంటేనే ఈ ప్రయోజనాలను పొందవచ్చని చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: నిమ్మకాయ ముక్కను ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Plants: షాంపూతో మొక్కలకు పట్టిన పురుగులు పరార్‌.. ఏం చేయాలంటే!!

కీటకాల నుంచి మొక్కలను కాపాడేందుకు క్రిమిసంహారక మందులు అవసరం లేదు. లీటరు నీటిలో రెండు మిల్లీ లీటర్ల షాంపూను కలిపి ఈ స్ప్రే బాటిల్‌లో మొక్కలపై చల్లితే మీలీబగ్స్ తగ్గుతాయి. వారానికి మూడుసార్లు పిచికారీ చేస్తే మెరుగైన ఫలితం ఉంటుంది.

New Update
Plants

Plants

Plants: ఇంటిలో చిన్న తోటను సృష్టించడం వలన అందం పెరగడమే కాదు మనకు మనశ్శాంతి, ఆరోగ్యకరమైన వాతావరణం కూడా లభిస్తుంది. అయితే మొక్కలు నాటడమే కాకుండా వాటిని కాపాడుకోవడంలోనూ మన బాధ్యత ఉంటుంది. మొక్కలకు హాని కలిగించే తెగుళ్లలో మీలీబగ్స్ చాలా ముఖ్యమైనవి. ఇవి చిన్న తెల్లటి పిండిలా కనిపించే పురుగులు. మొక్కల కాండం, ఆకులపై కనిపిస్తూ వాటి జీవరసాన్ని పీలుస్తూ ఉంటాయి. దీనివల్ల మొక్కలు బలహీనమవుతాయి. 

మందులు అవసరం లేదు:

ఆకులు పసుపు రంగులోకి మారి, ఎండిపోతూ చివరికి మొక్క నశిస్తుంది. ఇలాంటి కీటకాల నుంచి మొక్కలను కాపాడేందుకు ఖరీదైన క్రిమిసంహారక మందులు అవసరం లేదు. కేవలం రూపాయి విలువైన షాంపూ పౌచ్‌తోనే దీన్ని సమర్థవంతంగా నివారించవచ్చు. ఒక లీటరు నీటిలో రెండు మిల్లీ లీటర్ల షాంపూను కలిపి తయారు చేసే ఈ ద్రావణాన్ని స్ప్రే బాటిల్‌లో పెట్టి మొక్కలపై చల్లితే మీలీబగ్స్ తగ్గుతాయి. కానీ దీన్ని సూర్యరశ్మి ఉన్న సమయంలో కాకుండా సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలి. మొదటిసారి చేయగానే ఫలితం రాకపోవచ్చు. వారానికి మూడుసార్లు పిచికారీ చేస్తే మెరుగైన ఫలితాన్ని పొందవచ్చు.

ఇది కూడా చదవండి: పండ్లను చూసే తియ్యగా ఉన్నాయో లేదో చెప్పొచ్చు

దీంతో పాటు వేపనూనె కూడా ఒక మంచి సహజ పరిష్కారం. వేప నూనెను నీటిలో కలిపి పిచికారీ చేస్తే మీలీబగ్స్ నివారణకు తోడ్పడుతుంది. అంతేకాకుండా సేఫర్ సబ్బు లేదా సాదా వాషింగ్ సొప్పుతో తయారైన ద్రావణాలను ఉపయోగించవచ్చు. కొన్ని సందర్భాల్లో మీలీబగ్ తీవ్రత అధికంగా ఉంటే ప్రభావిత ఆకులను తొలగించడం ఉత్తమమైన చర్య. ఇలా ఇంట్లో చిన్న ప్రయత్నాలతోనే మొక్కలను కాపాడుకోవచ్చు. సహజ పద్ధతుల్లో క్రిమిసంహారక చర్యలు తీసుకోవడం వల్ల మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.  

ఇది కూడా చదవండి: క్యాన్సర్‌ను తరిమికొట్టే అద్భుతమైన ఆహారాలు

( home-tips | home tips in telugu | latest-news | bedroom-plants | coconut-plants | Green Power Plants | houseplants)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు