ఖాళీ కడుపుతో ఇవి తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త

ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ, కాఫీ, అరటి పండ్లు, ఆరెంజ్ వంటివి తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటిని పరగడుపున తింటే అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా తిన్న తర్వాత వీటిని తీసుకోవచ్చని అంటున్నారు.

New Update
నగ్నంగా నిద్రిస్తే ఏం అవుతుంతో తెలుసా?

Early Morning

ఆరోగ్యాన్ని కాపాడేది మనం అనుసరించే ఆహారపు అలవాట్లే. ఏదైనా ఆహారం ఎంత మంచిదైనా సరైన సమయంలో తీసుకోవడమే ఆరోగ్యానికి మంచిది. అయితే చాలా మంది తెలియక ఉదయం పూట కొన్ని రకాల పదార్థాలను పరగడుపున తీసుకుంటారు. అయితే ఖాళీ కడుపుతో తీసుకోకూడని ఆ ఆహార పదార్థాలు ఏంటో చూద్దాం.

ఇది కూడా చూడండి: Ganja: గంజాయి బ్యాచ్‌కు బిగ్ షాక్.. తాగినా, అమ్మినా పదేళ్ల జైలు శిక్ష, లక్ష జరిమానా!

కాఫీ, టీ

పొద్దున్నే లేవగానే చాలామంది కాఫీ లేదా టీ తాగడం అలవాటుగా మార్చుకుంటారు. కానీ, ఖాళీ కడుపుతో ఇవి తాగితే కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరిగిపోతుంది. దీని వల్ల అసిడిటీ, గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్ణం సమస్యలు తలెత్తుతాయి. 

సిట్రస్ పండ్లు
ఆరెంజ్, నిమ్మ వాటిలో అధికంగా సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇవి ఖాళీ కడుపుతో తింటే అదనపు యాసిడ్ ఉత్పత్తి పెరిగి, గుండెల్లో మంట, గ్యాస్ట్రిక్ సమస్యలు, అల్సర్లు ఏర్పడే ప్రమాదం ఉంది.

ఇది కూడా చూడండి: IPL 2025: SRHకు నిరాశ.. లక్నో సూపర్ జెయింట్స్‌ విక్టరీ

అరటి పండ్లు
అరటిపండులో అధికంగా సహజ చక్కెరలు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. దీనిని ఖాళీ కడుపుతో తింటే రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరిగి, ఇన్సులిన్ స్థాయిలను ప్రభావితం చేయవచ్చు.

అధిక చక్కెరగల ఆహారాలు
ఉదయం పూట స్వీట్లు, చాక్లెట్లను అసలు తినకూడదు. వీటిని తినడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: Bharat-America:అమెరికా నుంచి సాయం ఆగిపోతే కనుక ...10 లక్షల మరణాలు !

స్పైసీ ఫుడ్స్
అధిక మసాలా కలిగిన ఆహారం ఖాళీ కడుపుతో తింటే జీర్ణక్రియ పై ప్రభావం చూపిస్తుంది. కడుపులో మంట, అజీర్ణం, అసౌకర్యం కలిగించే అవకాశం ఉంటుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చూడండి: Gold Rates-Trump: మరో బాంబ్ పేల్చిన ట్రంప్.. బంగారం ధరల్లో ఊహించని మార్పు..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఇంట్లోనే ఎండు ద్రాక్షను తయారు చేసుకోవడం ఎలాగంటే?

ఒక పాత్రలో నీళ్లు తీసుకుని మరిగించాలి. ఇందులో కేజీ ద్రాక్ష పండ్లను వేసి ఉబ్బినంత వరకు ఉడికించాలి. ఆ తర్వాత వడబోసి కాటన్ క్లాత్‌లో వేసి ఎండలో ఆరబెట్టాలి. ఇలా నాలుగు రోజుల పాటు ఆరబెడితే హోమ్ మేడ్ కిస్‌మిస్ రెడీ.

New Update
raisins making

raisins making Photograph: (raisins making)

కిస్‌మిస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలోని పోషకాలు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడతాయి. అయితే వీటిని స్వీట్లు, తీపి పదార్థాలు ఇలా ప్రతీ దాంట్లో కూడా వేస్తారు. మరికొందరు వీటిని నానబెట్టి పరగడుపున తింటారు. అయితే మార్కెట్‌లో దొరికే కిస్‌మిస్‌లో కల్తీ ఉంటుంది. వీటివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఎలాంటి కల్తీ లేకుండా సహజంగా ఇంట్లోనే కిస్‌మిస్‌ను ఈజీగా తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఈ స్టోరీలో చూద్దాం.

ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

ద్రాక్ష పండ్లు మునిగేంత వరకు..

కిస్‌మిస్‌ను తయారు చేయడానికి కేజీ ద్రాక్ష, నీరు ఉంటే సరిపోతుంది. ఒక వెడల్పు ఉన్న గిన్నెలో ద్రాక్ష పండ్లు వేసి, మునిగేంత వరకు నీళ్లు, ఉప్పు వేసి ఒక 15 నిమిషాల పాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత వాటిని శుభ్రం చేసి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి సగానికి పైగా నీళ్లు వేయాలి. నీరు మరుగుతున్నప్పుడు శుభ్రం చేసుకున్న ద్రాక్ష వేసుకుని ఓ 5 నిమిషాల పాటు ఉడికించాలి. 

ఇది కూడా చూడండి: SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

అవి కాస్త ఉబ్బిన వెంటనే స్టవ్​ ఆఫ్​ చేసి వెంటనే వడకట్టాలి. వీటిని కాటన్ క్లాత్‌లో వేసుకుని ఎండలో ఉంచాలి. రెండు లేదా ఆరు రోజుల వరకు ఎండలో ఉంచితే అవి ఎండుతాయి. వీటిపై ఎలాంటి దుమ్ము, ధూళీ పడకుండా ఉండటానికి పల్చటి క్లాత్ కప్పాలి. ​అంతే ఇక కిస్‌మిస్ రెడీ అయినట్లే.

ఇది కూడా చూడండి: TS: భూభారతిపై అవగాహనా సదస్సులు..సీఎం రేవంత్ రెడ్డి

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment