ఉదయాన్నే ఇలా స్నానం చేస్తే.. అలసట మాయం

ఉదయం పూట పాలు, తేనె, బేకింగ్ సోడా, కీరదోస తొక్క వంటి వాటితో స్నానం చేస్తే రోజంతా కూడా యాక్టివ్‌గా ఉంటారు. వీటిలోని పోషకాలు రోజంతా యాక్టివ్‌గా ఉండేలా చేస్తాయి. అలాగే చర్మ సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయని నిపుణులు అంటున్నారు.

New Update
Hot water bath

bath

వేసవిలో ఎక్కువగా అలసటకు గురవుతుంటారు. అయితే ఉదయం పూట కొన్ని రకాల పదార్థాలతో స్నానం చేస్తే రోజంతా ఎలాంటి అలసట లేకుండా హాయిగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. అయితే వేసవిలో వేటితో స్నానం చేస్తే హాయిగా ఉంటారో ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి: Trump Tarriffs:ప్రతీకార సుంకాల పై ట్రంప్ కీలక ప్రకటన..భారత్‌ కు ఎంత శాతం విధించారంటే..!

పాలు, తేనె

పాలు, తేనె మిశ్రమం కలిపి స్నానం చేస్తే రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. బకెట్ వాటర్‌లో ఈ మిశ్రమాన్ని కలపాలి. అవసరం అయితే ఇందులో కొన్ని గులాబీ రేకులను అయినా వేయవచ్చు. ఇలా స్నానం చేస్తే రోజంతా తాజాదనంతో ఉండటంతో పాటు ప్రకాశవంతంగా మెరిసిపోతారు. చర్మంపై ఉండే మృత కణాలను కూడా తొలగిస్తుంది.

ఇది కూడా చూడండి:  UPI: నిలిచిపోయిన యూపీఐ సేవలు...ఇబ్బందుల్లో వినియోగదారులు

బేకింగ్ సోడా
స్నానం చేసే నీటిలో బేకింగ సోడా వేసి చేస్తే చర్మం తాజాగా ఉంటుంది. ఇందులోని పోషకాలు చర్మంపై ఉండే ట్యాన్‌ను తొలగిస్తుంది. బేకింగ్ సోడా ఎక్స్‌ఫోలియేటర్‌గా బాగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చూడండి: Digital arrest: రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్‌ని కూడా వదలని కేటుగాళ్లు.. రూ.3.4 కోట్లు మోసం

కీరదోస తొక్క
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కీరదోస తొక్క రసాన్ని బకెట్ వాటర్‌లో వేసి స్నానం చేయాలి. ఇలా చేస్తే చర్మం ఆరోగ్యంగా ఉండటంతో పాటు మీరు కూడా రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. వీటిని వాడితే మీ చర్మంపై ఉండే ముడతలు, మచ్చలు అన్ని కూడా తొలగిపోతాయని నిపుణులు అంటున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చూడండి: Maoist: వారికి శిక్ష తప్పదు.. రేణుక ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టుల సంచలన లేఖ!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Colon Cancer: పెరుగు తింటే పెద్ద పేగు క్యాన్సర్ రాదా.. నిజమెంత?

పెరుగును తింటే జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇది మధుమేహం, పెద్ద పేగు కుడి వైపున క్యాన్సర్‌ను నివారిస్తుందని చెబుతారు. పెరుగులో బైఫిడో బాక్టీరియం ఉంటుంది. పెరుగు తినే వ్యక్తులకు ప్రాక్సిమల్ కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంది.

New Update

Colon Cancer: చాలా మందికి భోజనం చివరిలో కొద్దిగా పెరుగు తినే అలవాటు ఉంటుంది. రోజువారీ ఆహారంలో పెరుగును చేర్చుకోవడం వల్ల ప్రమాదకరమైన క్యాన్సర్‌లను నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మొత్తం జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కొన్ని అధ్యయనాలు కూడా ఇది మధుమేహ ప్రమాదాన్ని తగ్గిస్తుందని వెల్లడించాయి. వారానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ కప్పుల పెరుగు తినేవారికి పెద్దపేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని ఇటీవలి అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా పెద్ద పేగు కుడి వైపున క్యాన్సర్‌ను నివారిస్తుందని చెబుతారు. 

క్యాన్సర్ వచ్చే ప్రమాదం:

పెద్ద పేగు కుడి వైపు క్యాన్సర్ ఎడమ వైపు క్యాన్సర్ కంటే తీవ్రమైనది, ప్రమాదకరమైనది. పెరుగులోని బ్యాక్టీరియా పేగులోని బ్యాక్టీరియా సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. దీనివల్ల క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. దాదాపు 3 దశాబ్దాలుగా  లక్షా 50 వేల మందికి పైగా వ్యక్తుల నుండి డేటాను పరిశోధకులు విశ్లేషించారు. పెరుగులో బైఫిడోబాక్టీరియం ఉంటుంది. అందువల్ల క్రమం తప్పకుండా పెరుగు తినే వ్యక్తులకు ప్రాక్సిమల్ కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని పరిశోధనలో తేలింది. పెరుగు ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా సమతుల్యతను ప్రోత్సహిస్తుంది. ఇది పేగులను బలంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. పెరుగులోని కాల్షియం ఎముకల బలాన్ని,  సాంద్రతను పెంచడానికి సహాయపడుతుంది. 

ఇది కూడా చదవండి: శ్రీరామ నవమి రోజు ఈ తప్పులు చేయకండి

పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. పెరుగు శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. పెరుగులోని ప్రోబయోటిక్స్ మలబద్ధకం, విరేచనాలు వంటి జీర్ణ సమస్యలను నివారిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పెరుగులో కొవ్వు తక్కువగా ఉంటుంది. ఇది మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడానికి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి చాలా మంచిది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రోజూ పెరుగు తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. రోజుకు 50 గ్రాముల పెరుగు తినేవారికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం 20 శాతం తక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: మధుమేహం ఉన్నవారు అల్సర్లను నిర్లక్ష్యం చేస్తే కాలి వేలికి ప్రమాదం

( colon-cancer | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు