Colon Cancer: పెరుగు తింటే పెద్ద పేగు క్యాన్సర్ రాదా.. నిజమెంత?

పెరుగును తింటే జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇది మధుమేహం, పెద్ద పేగు కుడి వైపున క్యాన్సర్‌ను నివారిస్తుందని చెబుతారు. పెరుగులో బైఫిడో బాక్టీరియం ఉంటుంది. పెరుగు తినే వ్యక్తులకు ప్రాక్సిమల్ కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంది.

New Update

Colon Cancer: చాలా మందికి భోజనం చివరిలో కొద్దిగా పెరుగు తినే అలవాటు ఉంటుంది. రోజువారీ ఆహారంలో పెరుగును చేర్చుకోవడం వల్ల ప్రమాదకరమైన క్యాన్సర్‌లను నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మొత్తం జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కొన్ని అధ్యయనాలు కూడా ఇది మధుమేహ ప్రమాదాన్ని తగ్గిస్తుందని వెల్లడించాయి. వారానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ కప్పుల పెరుగు తినేవారికి పెద్దపేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని ఇటీవలి అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా పెద్ద పేగు కుడి వైపున క్యాన్సర్‌ను నివారిస్తుందని చెబుతారు. 

క్యాన్సర్ వచ్చే ప్రమాదం:

పెద్ద పేగు కుడి వైపు క్యాన్సర్ ఎడమ వైపు క్యాన్సర్ కంటే తీవ్రమైనది, ప్రమాదకరమైనది. పెరుగులోని బ్యాక్టీరియా పేగులోని బ్యాక్టీరియా సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. దీనివల్ల క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. దాదాపు 3 దశాబ్దాలుగా  లక్షా 50 వేల మందికి పైగా వ్యక్తుల నుండి డేటాను పరిశోధకులు విశ్లేషించారు. పెరుగులో బైఫిడోబాక్టీరియం ఉంటుంది. అందువల్ల క్రమం తప్పకుండా పెరుగు తినే వ్యక్తులకు ప్రాక్సిమల్ కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని పరిశోధనలో తేలింది. పెరుగు ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా సమతుల్యతను ప్రోత్సహిస్తుంది. ఇది పేగులను బలంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. పెరుగులోని కాల్షియం ఎముకల బలాన్ని,  సాంద్రతను పెంచడానికి సహాయపడుతుంది. 

ఇది కూడా చదవండి: శ్రీరామ నవమి రోజు ఈ తప్పులు చేయకండి

పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. పెరుగు శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. పెరుగులోని ప్రోబయోటిక్స్ మలబద్ధకం, విరేచనాలు వంటి జీర్ణ సమస్యలను నివారిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పెరుగులో కొవ్వు తక్కువగా ఉంటుంది. ఇది మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడానికి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి చాలా మంచిది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రోజూ పెరుగు తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. రోజుకు 50 గ్రాముల పెరుగు తినేవారికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం 20 శాతం తక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: మధుమేహం ఉన్నవారు అల్సర్లను నిర్లక్ష్యం చేస్తే కాలి వేలికి ప్రమాదం

( colon-cancer | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news)

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Plants: షాంపూతో మొక్కలకు పట్టిన పురుగులు పరార్‌.. ఏం చేయాలంటే!!

కీటకాల నుంచి మొక్కలను కాపాడేందుకు క్రిమిసంహారక మందులు అవసరం లేదు. లీటరు నీటిలో రెండు మిల్లీ లీటర్ల షాంపూను కలిపి ఈ స్ప్రే బాటిల్‌లో మొక్కలపై చల్లితే మీలీబగ్స్ తగ్గుతాయి. వారానికి మూడుసార్లు పిచికారీ చేస్తే మెరుగైన ఫలితం ఉంటుంది.

New Update
Plants

Plants

Plants: ఇంటిలో చిన్న తోటను సృష్టించడం వలన అందం పెరగడమే కాదు మనకు మనశ్శాంతి, ఆరోగ్యకరమైన వాతావరణం కూడా లభిస్తుంది. అయితే మొక్కలు నాటడమే కాకుండా వాటిని కాపాడుకోవడంలోనూ మన బాధ్యత ఉంటుంది. మొక్కలకు హాని కలిగించే తెగుళ్లలో మీలీబగ్స్ చాలా ముఖ్యమైనవి. ఇవి చిన్న తెల్లటి పిండిలా కనిపించే పురుగులు. మొక్కల కాండం, ఆకులపై కనిపిస్తూ వాటి జీవరసాన్ని పీలుస్తూ ఉంటాయి. దీనివల్ల మొక్కలు బలహీనమవుతాయి. 

మందులు అవసరం లేదు:

ఆకులు పసుపు రంగులోకి మారి, ఎండిపోతూ చివరికి మొక్క నశిస్తుంది. ఇలాంటి కీటకాల నుంచి మొక్కలను కాపాడేందుకు ఖరీదైన క్రిమిసంహారక మందులు అవసరం లేదు. కేవలం రూపాయి విలువైన షాంపూ పౌచ్‌తోనే దీన్ని సమర్థవంతంగా నివారించవచ్చు. ఒక లీటరు నీటిలో రెండు మిల్లీ లీటర్ల షాంపూను కలిపి తయారు చేసే ఈ ద్రావణాన్ని స్ప్రే బాటిల్‌లో పెట్టి మొక్కలపై చల్లితే మీలీబగ్స్ తగ్గుతాయి. కానీ దీన్ని సూర్యరశ్మి ఉన్న సమయంలో కాకుండా సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలి. మొదటిసారి చేయగానే ఫలితం రాకపోవచ్చు. వారానికి మూడుసార్లు పిచికారీ చేస్తే మెరుగైన ఫలితాన్ని పొందవచ్చు.

ఇది కూడా చదవండి: పండ్లను చూసే తియ్యగా ఉన్నాయో లేదో చెప్పొచ్చు

దీంతో పాటు వేపనూనె కూడా ఒక మంచి సహజ పరిష్కారం. వేప నూనెను నీటిలో కలిపి పిచికారీ చేస్తే మీలీబగ్స్ నివారణకు తోడ్పడుతుంది. అంతేకాకుండా సేఫర్ సబ్బు లేదా సాదా వాషింగ్ సొప్పుతో తయారైన ద్రావణాలను ఉపయోగించవచ్చు. కొన్ని సందర్భాల్లో మీలీబగ్ తీవ్రత అధికంగా ఉంటే ప్రభావిత ఆకులను తొలగించడం ఉత్తమమైన చర్య. ఇలా ఇంట్లో చిన్న ప్రయత్నాలతోనే మొక్కలను కాపాడుకోవచ్చు. సహజ పద్ధతుల్లో క్రిమిసంహారక చర్యలు తీసుకోవడం వల్ల మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.  

ఇది కూడా చదవండి: క్యాన్సర్‌ను తరిమికొట్టే అద్భుతమైన ఆహారాలు

( home-tips | home tips in telugu | latest-news | bedroom-plants | coconut-plants | Green Power Plants | houseplants)

Advertisment
Advertisment
Advertisment