TGPSC: రేవంత్ సార్ మా జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వండి.. గ్రూప్-4 అభ్యర్థుల వినతి!

గ్రూప్-4 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఇంకా జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి 45 రోజులు గడుస్తున్న విధుల్లోకి తీసుకోవట్లేదంటూ TMRIES శాఖకు చెందిన 191మంది ప్రజావాణికి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.  

New Update
tgpsc group 4

TGPSC Group 4 candidates complaint to Prajavani for joining orders

TGPSC: తెలంగాణ గ్రూప్-4 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు నియామక పత్రాలు ఇచ్చిన రేవంత్ సర్కార్ ఇంకా జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అపాయింట్మెంట్ ఆర్డర్లు తీస్కొని 45 రోజులు గడుస్తున్న తమను విధుల్లోకి తీసుకోవట్లేదని వాపోతున్నారు. తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషనల్ సోసైటీ (TMREIS) సంస్థ జాయినింగ్ ఆర్డర్లు వెంటనే ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రూప్-4లో 99 డిపార్ట్మెంట్స్ ఉండగా 98 శాఖలకు పోస్టింగ్స్ అండ్ ఆర్డర్లు ఇచ్చారు. కానీ TMRIES శాఖకు చెందిన అభ్యర్థులకు ఇంకా కౌన్సెలింగ్ నిర్వహించలేదు. దీంతో తమ పరిస్థితి ఏమిటని? ఇంకెప్పుడు ఉద్యోగాలు కేటాయిస్తారంటూ ప్రజాభవన్‌లో ప్రజావాణికి అభ్యర్థులు ఫిర్యాదు చేశారు.

Also Read: అవినీతిని ప్రశ్నించాడని సర్పంచ్‌ను చంపించిన మంత్రి.. అతను అరెస్ట్!

tgpsc group 4
tgpsc group 4 Photograph: (tgpsc group 4)

 

సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు..

ఈ మేరకు 2024 డిసెంబర్ 4న పెద్దపల్లిలో ప్రభాపాలన విజయోత్సవాల్లో భాగంగా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వీరందరికీ నియామక పత్రాలు అందించారు. కానీ ఇంతవరకు విధుల్లోకి తీసుకోకపోవడంతో శుక్రవారం ప్రజా భవన్‌కు తరలివచ్చిన 191 అభ్యర్థులు వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. తామంతా ఒక నెల జీతం కోల్పోవడం జరిగిందని, తమ కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని కారణాలు ఏమైనా తొందరగా క్లియర్ చేసి జూనియర్ అసిస్టెంట్స్‌ను విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు. 

TGPSC Notification
TGPSC Notification

 

ఇది కూడా చదవండి: ఏం చేద్దాం నాన్నా.. కేసీఆర్ తో కేటీఆర్ కీలక భేటీ!

TMRIES శాఖకు 191 మంది అర్హత..

అయితే దీనిపై సానుకూలంగా స్పందించిన అధికారులు సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమాచారాన్ని తెలుసుకోగా.. విధుల్లోకి ఎప్పుడు తీసుకుంటారనేది స్పష్టం చేయలేయకపోవడంపై అభ్యర్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఈ శాఖలో 191 మంది అర్హత సాధించిన అభ్యర్థులున్నామని, ఆయా జిల్లాల వారీగా త్వరగా కౌన్సెలింగ్ జరిపి పోస్టింగ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి: Viruska: మరోసారి ఆ సాధువును కలిసిన విరుష్క జోడీ.. మళ్లీ అదే కారణమట!

 

Also Read: యూపీలో దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్య

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్

ఏపీ సర్కార్ మైనరిటీల కోసం కొత్త పథకం తీసుకొచ్చింది. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు సబ్సిడీపై రుణాలను అందిస్తుంది. చిన్నతరహా యూనిట్ల ఏర్పాటుకు రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకూ సబ్సిడీపై రుణాలు పొందవచ్చు. ఈ నెల 25 నుంచి దరఖాస్తు ప్రారంభం అయ్యింది.

New Update
cm chandra babu

cm chandra babu

ఏపీ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. మైనారిటీల అభివృద్ధే ధ్యేయంగా వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు సబ్సిడీపై రుణాలను అందిస్తుంది. వ్యవసాయం, రవాణా, అనుబంధ రంగాలు, సేవా, వ్యాపార, పరిశ్రమ రంగాలలో స్వయం ఉపాధి పథకాల కోసం రుణాలు అందిస్తుంది. 

Also Read: ఏపీలో పాకిస్తాన్‌ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!

ఈ పథకం ద్వారా మైనారిటీ నిరుద్యోగ యువతకు రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకు రుణం ఇస్తారు. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను తాజాగా మైనారిటీ సంక్షమ శాఖ రిలీజ్ చేసింది. ఈవెంట్ మేనేజ్‌మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్, కార్పెంటరీ వంటి వాటిలో కూడా నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. కాగా ఇటీవల కూటమి ప్రభుత్వం ఈ పథకం కోసం బడ్జెట్‌లో రూ.173.57 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. 

Also Read: చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!

మైనారిటీ నిరుద్యోగ యువతకు చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఈ నిధులను అందించనున్నారు. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. ఏప్రిల్ 25 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం కాగా వచ్చే నెల అంటే మే 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

Also Read :  అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

అర్హతలు

ఆసక్తిగల దరఖాస్తు దారుడు మైనారిటీ వర్గానికి (ముస్లిం, క్రైస్తవులు, సిక్కు, బౌద్ధులు, జైనులు, పార్సీలు) చెందినవాడై ఉండాలి. 

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి అయి ఉండాలి.

21 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.

Also Read :  ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!

వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతంలో ఏడాదికి రూ.2,00,000, గ్రామీణ ప్రాంతాలలో రూ.1,50,000 ఉండాలి. 

ఎవరైతే ఈ పథకానికి అప్లై చేయాలనుకుంటున్నారో.. స్వయం ఉపాధి పథకాల రవాణా రంగానికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

జనరిక్ ఫార్మసీ పథకాలకు డి.ఫార్మసీ / బి.ఫార్మసీ / ఎం.ఫార్మసీ అర్హత కలిగి ఉండాలి.

https://apobmms.apcfss.in/  లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకోవాలి. https://apobmms.apcfss.in/RegistrationForm రిజిస్ట్రేషన్ ఫామ్‌లో డీటెయిల్స్ నింపాలి.

andhra-pradesh | cm-chandra-babu | ap-govt | ap-govt-schemes

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు