Ukraine: పేరుకే అగ్రరాజ్యం..చేసేవన్నీ బలహీనమైన పనులే..అమెరికాపై జెలెన్ స్కీ విమర్శలు

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అమెరికాపై మరోసారి విరుచుకుపడ్డారు. తన నగరంపై రష్యా చేసిన దాడిపై అమెరికా ప్రతిస్పందన పట్ల ఆయన నిరాశను వ్యక్తం చేశారు. యూఎస్ మరోసారి ఫెయిల్ అయిందని ఆరోపించారు. 

New Update
Zelenskyy

Zelenskyy

తాజాగా ఉక్రెయిన్‌పై మరోసారి రష్యా దాడులకు పాల్పడింది. అధ్యక్షుడు జెలెన్‌స్కీ సొంత నగరమై క్రీవీ రిపై శుక్రవారం రష్యా మిసైల్‌తో దాడి చేసినట్లు కీవ్ అధికారులు తెలిపారు. పిల్లలు ఆడుకునే సమీపంలో ఈ దాడి జరగడంతో 18 మృతి చెందారు. వీళ్లలో 9 మంది చిన్నారులే ఉన్నారు. మరో 60 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఐదు అపార్ట్‌మెంట్‌  భవనాలు కూడా దెబ్బతిన్నాయి.  

ఈ దాడులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ తీవ్రంగా స్పందించారు. ఇవి ప్రమాదవశాత్తు జరగలేదని రష్యా పక్కా ప్లాన్ ప్రకారమే చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా ఉద్దేశపూర్వకంగానే క్రీవీరిలో ఇంధన సౌకర్యాలు ఉండే ప్రాంతంపై మిసైల్‌ను ప్రయోగించింది. దీంతో రష్యా అమెరికాతో చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని విస్మరించింది. ఉక్రెయిన్‌లో శాంతి కోసం కృషి చేస్తామని రష్యన్లు చేసిన వాగ్దానాలు ఈ దాడులతో ముగిసిపోయాయి. దౌత్యం అంటే ఏంటో వాళ్లకి తెలియదు. యుద్ధాన్ని ముగించే ఉద్దేశం రష్యాకు లేదనే విషయం మరోసారి తేలిపోయిందని'' జెలెన్‌స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అమెరికాపై మండిపాటు..

దాంతో పాటూ ఇప్పుడు అమెరికా మీదనా విరుచుకుపడుతున్నారు జెలెన్ స్కీ. రష్యా దాడులపై అమెరికా వెంటనే స్పందించింది. అయితే ఎక్కడా రష్యా పేరును చెప్పకుండా మాట్లాడింది. దీనిపై జెలన్ మండిపడుతున్నారు. రష్యా పేరును నేరుగా చెప్పడానికి అమెరికా భయపడుతోందని ఆరోపించారు. పేరుకే అగ్రరాజ్యం కానీ చాలా బహీనమైన దేశంగా ప్రవర్తిస్తోందని అన్నారు. రష్యా చర్యలను అమెరికా మరింత తీవ్రంగా ఖండించాలని డిమాండ్ చేశారు. పిల్లలను చంపిన క్షిపణి గురించి మాట్లాడేటప్పుడు వారు "రష్యన్" అనే పదాన్ని చెప్పడానికి కూడా భయపడుతున్నారు అని జెలెన్ స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యాపై విమర్శలలో అమెరికా మరింత ప్రత్యక్షంగా ఉండాలని వాదించారు.

 

today-latest-news-in-telugu | ukraine | zelensky | russia

Also Read: USA: అసలు మామూలు డీల్ కాదిది..సుంకాలు తగ్గించేందుకు ట్రంప్ చైనాకు ఆఫర్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Sheikh Hasina: షేక్ హసీనాకు బిగ్ షాక్.. మరోసారి అరెస్టు వారెట్ జారీ

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అక్కడి న్యాయస్థానం ఇటీవల అరెస్టు వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోసారి అరెస్టు వారెంట్ జారీ చేసింది. అక్రమంగా భూమిని స్వాధీనం చేసుకున్నారని హసీనా, ఆమె కూతురు, మరికొందరిపై ఆరోపణలు ఉన్నాయి.

New Update
Sheikh Hasina

Sheikh Hasina

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అక్కడి న్యాయస్థానం ఇటీవల అరెస్టు వారెంట్ జారీ చేసిన సంగతి  తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోసారి అరెస్టు వారెంట్ జారీ చేసింది. అధికార దుర్వినియోగంతో అక్రమంగా భూమిని స్వాధీనం చేసుకున్నారని హసీనాతో పాటు 
ఆమె కూతురు సైమా వాజెద్‌ పుతుల్, మరికొందరపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆదివారం మరోసారి హసీనాపై అరెస్టు వారెంట్ జారీ చేసింది.  

Also Read: గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో తీసుకెళ్లిన ఘటనలో బిగ్ ట్విస్ట్.. స్పందించిన యూనివర్సిటీ

ఇక వివరాల్లోకి వెళ్తే.. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని షేక్ హసీనాతో పాటు ఆమె సోదరి రెహనా, బ్రిటీష్ ఎంపీ తులిప్‌ రిజ్వానా సిద్ధిక్‌, మరో 50 మందిపై అవినీతి నిరోధక కమిషన్ బంగ్లాదేశ్‌ కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై పరిశీలన చేసిన కోర్టు.. అరెస్టు వారెంట్లు జారీ చేసిందని పలు మీడియా కథనాలు తెలిపాయి. తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 27కు వాయిదా వేసినట్లు చెప్పాయి. మరోవైపు అక్రమంగా నివాస స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణలపై షేక్‌ హసీనా, ఆమె కూతురు సైమా వాజెద్‌ పుతుల్, మరో 17 మందిపై అరెస్టు వారెంట్ జారీ చేసింది.   

Also Read: జలియన్ వాలాబాగ్‌ మారణకాండకు నేటికి 106 ఏళ్లు.. బ్రిటిష్‌ వాళ్ల ఊచకోతకు కారణం ఏంటి ?

ఢాకా శివారులో ఉన్న పుర్బాచల్‌లో ప్రభుత్వ అధీనంలో ఉన్న భూమి లీజుకు సంబంధించిన అభియోగంపై ఏసీసీ తన దర్యాప్తు రిపోర్టును కోర్టుకు సమర్పించింది. షేక్ హసీనా, ఆమె కుటుంబ సభ్యులకు కూడా ఢాకాలో ఇళ్లు ఉన్నప్పటికీ.. నివాసం స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారని ఆరోపణలు చేసింది. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉండటం వల్ల ఇటీవల కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది.అయితే తాజాగా మరోసారి కోర్టు అరెస్టు వారెంట్ ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.  

Also read: ఈ ఆడోళ్లు మహా డేంజర్.. జుట్టు పట్టుకుని ఎలా కొడుతుందో చూశారా?

 telugu-news | rtv-news | sheik-hasina | international

 

Advertisment
Advertisment
Advertisment