Yogi Adityanath: నేపాల్‌లో ట్రెండ్‌ అవుతున్న యోగీ ఆదిత్యనాథ్

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఒక్కసారిగా నెపాల్‌లో ట్రెండ్ అయ్యారు. రాచరిక పాలనకు మద్దతుగా అక్కడ జరుగుతున్న ర్యాలీల్లో యోగీ ఆదిత్యనాథ్‌ ఫొటో కూడా కనిపిస్తోంది. ఎందుకో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Yogi Adityanth trending in Nepal

Yogi Adityanth trending in Nepal

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఒక్కసారిగా నెపాల్‌లో ట్రెండ్ అయ్యారు. రాచరిక పాలనకు మద్దతుగా అక్కడ జరుగుతున్న ర్యాలీల్లో యోగీ ఆదిత్యనాథ్‌ ఫొటో కూడా కనిపిస్తోంది. ఈయన ఫొటో ర్యాలీలో ప్రదర్శించేందుకు ఓ కారణం కూడా ఉంది. నేపాల్‌లో రాచరికానికి యోగి ఆదిత్యనాథ్‌ బలమైన మద్దతుదారుగా ఉన్నారు. మాజీ రాజు జ్ఞానేంద్ర షాతో యోగికి మంచి సంబంధాలున్నాయి. 

Also Read: కుక్క కరిచిందని గొంతు కోసుకున్న వ్యక్తి.. ఆపరేషన్ థియేటర్‌లో ఏరులై పారిన నెత్తురు!

ఈ ఏడాది జనవరిలో జ్ఞానేంద్ర షా.. భారత్‌లో పర్యటించారు. అప్పుడు ఆయన యోగి ఆదిత్యనాథ్‌తో కూడా భేటీ అయ్యారు. ఇదిలాఉండగా.. నేపాల్‌లో రాచరికానికి మద్దతు తెలిపే రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ వాళ్లు ఈ ర్యాలీ నిర్వహించారు. నేపాల్‌లో రాజు పాలనను మళ్లీ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ తరుణంలోనే మాజీ రాజు జ్ఞానేంద్ర షా ఫొటోలతో పాటు యోగి ఆదిత్యనాథ్ చిత్రాలను కూడా ప్రదర్శించారు.    

Also Read: ఆన్‌లైన్ గేమ్ మోసానికి 17 ఏళ్ల బాలుడు బలి.. ఫోన్‌కు ఫోరెన్సిక్ పరీక్ష!

అయితే ఈ ర్యాలీలో ఇతర దేశ నాయకులు ఫొటోలు ప్రదర్శించడంపై పలువురు విమర్శలు కూడా చేశారు. దీనిపై ఆర్‌పీపీ పార్టీ ప్రతినిధి మాట్లాడారు. తాము చేస్తున్న ఉద్యమానికి చెడ్డపేరు తెచ్చేందుకే ప్రధానమంత్రి కేపీ ఓలీ వర్గం ఇలాంటి చర్యలకు కుట్రకు పాల్పడిందని అన్నారు. ప్రధాని ముఖ్య సలహాదారు అయిన బిష్ణు రిమాల్‌ సూచనల మేరకే ఈ ర్యాలీలో యోగి చిత్రాన్ని ప్రదర్శించారని ఆర్‌పీపీ ప్రతినిధి సోషల్ మీడియాలో తెలిపారు. ఇదిలాఉండగా.. ఇటీవల కాఠ్‌మాండూ, పోఖార సహా దేశవ్యాప్తంగా రాచరికాన్ని పునరుద్ధరించాలనే ర్యాలీలు కూడా జరిగాయి. 2008లో జరిగిన తీవ్రమైన ప్రజా ఉద్యమం వల్ల అక్కడ రాజుల పాలన అంతమైంది. ఈ క్రమంలోనే మళ్లీ ఇప్పుడు రాజుల పాలనను పునరుద్ధరించాలని నిరసనలు చేస్తున్నారు.     
 

Also Read: మరోసారి విషం చిమ్మిన పాకిస్థాన్.. ట్రైన్‌ హైజాక్‌కు భారత్‌ సాయం చేసిందని ఆరోపణలు

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Trump: ఆ దేశం అస్సలు వెళ్లకండి.. అమెరికన్లకు ట్రంప్‌ హెచ్చరిక

ట్రంప్ సర్కార్‌ కీలక ప్రకటన చేసింది. పర్యాటక రంగంలో ప్రసిద్ధి చెందిన బహమాస్‌కు వెళ్లే అమెరికన్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. అక్కడ నేరాలు, షార్క్‌ దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వీలైతే ఆ దేశం వెళ్లకూడదని కోరింది.

New Update
Do not travel to Bahamas, there are sharks:,Trump admin advises Americans

Do not travel to Bahamas, there are sharks:,Trump admin advises Americans

ట్రంప్ సర్కార్‌ కీలక ప్రకటన చేసింది. పర్యాటక రంగంలో ప్రసిద్ధి చెందిన బహమాస్‌కు వెళ్లే అమెరికన్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. అక్కడ నేరాలు, షార్క్‌ దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వీలైతే ఆ దేశం వెళ్లకూడదని కోరింది. బహమాస్ అనేది కామన్వెల్త్ దేశాల్లో ఒక స్వతంత్ర దేశం. పర్యాటక పరంగా దీనికి మంచి గుర్తింపు ఉంది. అయితే ఈ మధ్య అక్కడికి వెళ్లే పర్యటకులపై కొందరు దుండగులు దోపిడీలకు పాల్పడుతున్నారు. 

Also Read: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు

అంతేకాదు మహిళలను లైంగికంగా వేధిస్తున్నారు. ఆఖరికీ హత్యలకు కూడా చేయడానికి వెకాడటం లేదు. అలాగే బహమాస్ సముద్ర జలాల్లో షార్క్‌ దాడుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే ఆ దేశానికి వెళ్లకూడదని ట్రంప్ సర్కార్ ప్రజలకు సూచనలు చేసింది.అక్కడ అద్దె గదుల్లో కూడా ఉండటం సురక్షితం కాదని చెపింది. ప్రైవేట్ సెక్యూరిటీ లేని ప్రాంతంలో బస చేయడం మంచిది కాదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మార్చి 31న ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

పర్యాటకులు మార్గదర్శకాలను నిర్లక్ష్యం చేసి ఆయుధాలు, తుపాకులు తీసుకెళ్లడం చట్టారీత్యా నేరమంటూ హెచ్చరించింది. రూల్స్‌ ఉల్లంఘిస్తే ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు కఠినంగా చర్యలు తీసుకుంటారని తెలిపింది. అరెస్టులు, జైలుశిక్ష, జరిమానా విధిస్తారని మార్గదర్శకాల్లో పేర్కొంది. 

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

trump | telugu-news | rtv-news | usa

Advertisment
Advertisment
Advertisment