USA: 90 రోజులు టారీఫ్ లకు బ్రేక్..అంతా ఒట్టిదే..వైట్ హౌస్

ట్రంప్ టారీఫ్ ల దెబ్బకు ప్రపంచ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. దీంతో అమెరికా అధ్యక్షుడు సుంకాలను ఆపేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే వాటిని వైట్ హౌస్ కొట్టిపడేసింది. టారీఫ్ లను ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. 

New Update
us

White House

 ప్రతీకార సుంకాలను ఆపేది లేదని తేల్చి చెప్పారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, వైట్ హౌస్. ఏది ఏమైనా టారీఫ్ లను కొనసాగిస్తామని చెప్పారు. మా విధానంలో ఎటువంటి మార్పూ ఉండదు అన్నారు. అయితే ఏ దేశమైనా టారీఫ్ ల మీద చర్చకు వస్తే తాము సుముఖంగా ఉన్నామని ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేయాలని ఆలోచిస్తున్నారనే వార్తలను వైట్ హౌస్ ఖండించింది. దానిపై వస్తున్న వార్తలన్నీ నకిలీవి అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు. 

 

ఒక్క పోస్ట్ తో అంతా తారుమారు..

నిన్న ఎక్స్ లో వాల్టర్ బ్లూమ్ బెర్గ్, నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డైరెక్టర్ కెవిన్ హాసెట్,  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా మినహా అన్ని దేశాలకు 90 రోజుల సస్పెన్షన్ గురించి ఆలోచిస్తున్నారని పోస్ట్ లు వచ్చాయి. దీంతో మార్కెట్లో గందరగోళం మొదలైంది.  ఈ ఒక్క పోస్ట్ తో స్టాక్ మార్కెట్ హెచ్ థగ్గులకు గురైంది. దీని గురించే ఈరోజు వైట్ హౌస్  మాట్లాడింది. హాసెట్ చెప్పినదాన్ని జనాలు తప్పుగా అర్ధం చేసుకున్నారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు. ట్రంప్ కు అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు. అయితే అసలు ఈ చర్చ అంతా బిలియనీర్ హెడ్జ్ ఫండ్ పెట్టుబడిదారుడు, ట్రంప్ మద్దతుదారుడు అయిన బిల్ అక్మాన్ ఆదివారం ట్రంప్ అసమాన సుంకాల ఏర్పాట్లను పరిష్కరించడానికి, దేశానికి గణనీయమైన పెట్టుబడులను ఆకర్షించడానికి "90 రోజుల గడువు" అమలు చేయాలని సూచించిన తర్వాత చర్చ ప్రారంభమైంది.

 today-latest-news-in-telugu | usa | donald trump tariffs | white-house

Also Read: RCB VS MI: ముంబయ్ గెలుస్తుంది అనుకుంటే...బెంగళూరు తన్నుకుపోయింది

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

పాకిస్తాన్‌లో 170 న్యూక్లియర్ బాంబులు.. వాటి రిమోట్ ఎవరి చేతిలో ఉందో తెలుసా..?

భారత్, పాక్ యుద్ధ పరిస్థితుల్లో పాకిస్తాన్‌ దగ్గర 170 న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయి. వాటిని ప్రయోగించాలంటే ఆ దేశ ప్రధాని, రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలి. వీటి రక్షణ, వినియోగం మాత్రం పాక్ ఆర్మీ చూసుకుంటోంది. ఇండియా దగ్గర 172 అణ్వాయుధాలు ఉన్నాయి.

New Update
nuclear weapons

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద సంఘటన తర్వాత, రెండు దేశాలపై యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అటువంటి పరిస్థితిలో పాకిస్తాన్ అణు బాంబులపై ఎవరి నియంత్రణ ఉందనేది చాలామందికి సందేహం వస్తోంది. ఇది ఒక దేశ గోప్యతకు సంబంధించిన విషయం అయినప్పటికీ, ఈ ఆయుధాల వినియోగంపై ఎవరు నిర్ణయం తీసుకుంటారనే ప్రశ్న తరచుగా తలెత్తుతుంది? పాకిస్తాన్‌ అణ్వాయుధాలు వాడాలంటే దేశ అధ్యక్షుడు, ప్రధాన మంత్రి పర్మిషన్ ఇవ్వాలి. న్యూక్లియర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ (NCCS) అనే రహస్య సంస్థ కూడా దానిపై నియంత్రణను కలిగి ఉంది. అణ్వాయుధాలను ఉపయోగించాలనే తుది నిర్ణయం రాష్ట్రపతి, ప్రధానమంత్రి కలిసి తీసుకుంటారు. ఒకవేళ వేరే దేశంతో పాకిస్తాన్‌కు యుద్ధం వస్తే.. అందులో న్యూక్లియర్ వెపన్స్ వాడాలా.. వద్దా అనే నిర్ణయం ప్రధాని, రాష్ట్రపతి కలిసి చర్చించుకొని నిర్ణయం తీసుకుంటారు. ఈ విషయంలో సైన్యం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అణ్వాయుధాల భద్రత, ప్రయోగానికి సైన్యం బాధ్యత వహిస్తుంది.

Also Read :  భారీ పేలుడు.. 25 మంది స్పాట్ డెడ్ -1,139 మందికి తీవ్ర గాయాలు

Also read :  Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్

పాకిస్తాన్ తన అణు కార్యక్రమాన్ని 1970లలో ప్రారంభించింది. భారతదేశ అణు సామర్థ్యాలకు ఏమాత్రం తగ్గొద్దనేదే పాక్ ప్రధాన లక్ష్యం. భారత్ తన మొదటి అణు పరీక్ష 1974లో నిర్వహించింది. దీని తర్వాత, పాకిస్తాన్ క్యూబా, చైనా నుండి సాంకేతిక సహాయం కోరింది. అణ్వాయుధాలను అభివృద్ధి చేయడానికి పాక్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. 1998లో అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని భారత ప్రభుత్వం మరోసారి అణు పరీక్షలు నిర్వహించింది. ఆ తరువాత పాకిస్తాన్ తన మొదటి అణు పరీక్షను చాగై-Iలో నిర్వహించడం ద్వారా తన బలాన్ని ప్రదర్శించింది. అప్పటి నుండి పాకిస్తాన్ అణ్వాయుధాల నిల్వ నిరంతరం పెరుగుతూనే ఉంది. స్వీడిష్ థింక్ ట్యాంక్ స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) నివేదిక ప్రకారం జనవరి 2024 నాటికి భారతదేశంలో అణ్వాయుధాల సంఖ్య పాకిస్తాన్ కంటే కొంచెం ఎక్కువగా ఉంది. భారతదేశం నిల్వ చేసిన అణ్వాయుధాల సంఖ్య 172 కాగా, పాకిస్తాన్ దగ్గర 170 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. రాబోయే కాలంలో భారతదేశ అణ్వాయుధాల సంఖ్య స్వల్పంగా పెరుగుతుందని నివేదిక పేర్కొంది. 

(due to pahalgam attack | nuclear-weapons | pakistan | india | attack in Pahalgam | pak-pm-shehbaz-sharif | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment