Sunita Williams: సునీతా విలియమ్స్‌ ల్యాండ్ అయ్యాక ఎక్కడికి తీసుకెళ్లారో తెలుసా ?

నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్‌తో పాటు బుచ్‌ విల్మోర్‌ భూమిపై ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. అనంతరం వీళ్లి్ద్దరిని ప్రత్యేక విమానంలో నాసా సెంటర్‌కు తీసుకెళ్లారు. టెక్సాస్‌లోని హోస్టన్‌లో ఉన్న నాసా సెంటర్‌లో వీళ్లిద్దరికీ వైద్య పరీక్షలు చేస్తున్నారు.

New Update
Sunita Williams

Sunita Williams

భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్‌తో పాటు బుచ్‌ విల్మోర్‌ భూమిపై ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే.  బుధవారం తెల్లవారుజామున (భారత కాలమాన ప్రకారం) 3.27 AM గంటలకు భూమిపైకి చేరుకున్నారు. ఫ్లోరిడా సముద్ర జలాల్లో వాళ్ల క్యాప్సుల్‌ ల్యాండ్ అయ్యింది. ఆ తర్వాత సునీతా విలియమ్స్‌తో పాటు మరో ముగ్గురు వ్యోమగాములను బయటికి తీసుకొచ్చారు. అనంతరం సునీతా విలియమ్స్‌, బుచ్‌ విల్మోర్‌ను ప్రత్యేక విమానంలో నాసా సెంటర్‌కు తీసుకెళ్లారు. 

టెక్సాస్‌లోని హోస్టన్‌లో ఉన్న నాసా సెంటర్‌లో వీళ్లిద్దరికీ వైద్య పరీక్షలు చేస్తున్నారు. వీళ్లను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ఏం చేయాలనేది వైద్య పరీక్షల అనంతరం ఓ నిర్ణయానికి వస్తారు. భూమి గ్రావిటీకి తగ్గట్లుగా ఈ ఆస్ట్రోనాట్స్‌ను మార్చేందుకు చర్యలు మొదలుపెడతారు.  తొమ్మిది నెలలుగా వారు అంతరిక్షంలో గడపడం వల్ల భూమిపై వెంటనే నడవలేని పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం సునీతా విలియమ్స్‌కు 59 ఏళ్లు. ఇప్పటికే ఆమె ఐదుసార్లు అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు. వయసు రీత్యా చూసుకుంటే మానసిక, శారీరక ఒత్తిడి ఉంటుంది. 

Also Read: భారత్‌కు రానున్న సునీతా విలియమ్స్‌.. గ్రామంలో సంబురాలు

ఎక్కువ రోజులు అంతరిక్షంలో ఉండటం వల్ల బుచ్‌ విల్మోర్ కంటే సునీతా విలియమ్స్‌ మానసికంగా, శారీరంగా చాలా ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. స్పేస్‌లో గురుత్వాకర్షణ శక్తి ఉండదు కాబట్టి వ్యోమగాములు గాల్లోనే తేలుతుంటారు. భూమిపైకి వచ్చాక సాధారణ పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్లకి ప్రత్యేక ట్రీట్‌మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా కొన్ని నెలల పాటు ఎక్సర్సైజ్‌లు చేయాల్సి ఉంటుంది. వాళ్లు సొంతంగా నడిచేవరకు వైద్యుల పర్యవేక్షణలోనే ఉంటారు.  

అంతరిక్షంలో తక్కువ గురుత్వాకర్షణ వాతావరణంలో జీవించడం వల్ల కండరాల క్షీణత, ఎముకల సాంద్రత తగ్గుతుంది. ఆస్ట్రోనాట్స్ భూమిపై ఉన్నప్పుడులా కండరాలు కదిలించలేరు. కాబట్టి, కాలక్రమేణా వారి బలం తగ్గుతుంది. అంతరిక్షంలో క్రమం తప్పకుండా వ్యాయామం చేసినప్పటికీ, వారు బలహీనంగానే ఉంటారు. మళ్లీ పూర్తి బలాన్ని తిరిగి పొందడానికి కొంత టైం పడుతుంది. రక్త ప్రసరణలో కూడా మార్పులు వస్తాయి. ఎముకల కదలికల్లో నొప్పి ఉండొచ్చు. కంటి చూపుతో పాటు గుండె సంబంధిత సమస్యలు కూడా ఎదురవుతాయి. అందుకే సునీతా విలిమమ్స్‌, బుచ్‌ విల్మోర్‌కు మళ్లీ సాధారణ పరిస్థికి వచ్చి, నడిచేవరకు వైద్యుల పర్యవేక్షణలోనే ఉంటారు. 

Also Read: దేశంలో అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా బీజేపీ నేత.. ఆస్తులెంతంటే ?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Trump: ఆ దేశం అస్సలు వెళ్లకండి.. అమెరికన్లకు ట్రంప్‌ హెచ్చరిక

ట్రంప్ సర్కార్‌ కీలక ప్రకటన చేసింది. పర్యాటక రంగంలో ప్రసిద్ధి చెందిన బహమాస్‌కు వెళ్లే అమెరికన్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. అక్కడ నేరాలు, షార్క్‌ దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వీలైతే ఆ దేశం వెళ్లకూడదని కోరింది.

New Update
Do not travel to Bahamas, there are sharks:,Trump admin advises Americans

Do not travel to Bahamas, there are sharks:,Trump admin advises Americans

ట్రంప్ సర్కార్‌ కీలక ప్రకటన చేసింది. పర్యాటక రంగంలో ప్రసిద్ధి చెందిన బహమాస్‌కు వెళ్లే అమెరికన్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. అక్కడ నేరాలు, షార్క్‌ దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వీలైతే ఆ దేశం వెళ్లకూడదని కోరింది. బహమాస్ అనేది కామన్వెల్త్ దేశాల్లో ఒక స్వతంత్ర దేశం. పర్యాటక పరంగా దీనికి మంచి గుర్తింపు ఉంది. అయితే ఈ మధ్య అక్కడికి వెళ్లే పర్యటకులపై కొందరు దుండగులు దోపిడీలకు పాల్పడుతున్నారు. 

Also Read: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు

అంతేకాదు మహిళలను లైంగికంగా వేధిస్తున్నారు. ఆఖరికీ హత్యలకు కూడా చేయడానికి వెకాడటం లేదు. అలాగే బహమాస్ సముద్ర జలాల్లో షార్క్‌ దాడుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే ఆ దేశానికి వెళ్లకూడదని ట్రంప్ సర్కార్ ప్రజలకు సూచనలు చేసింది.అక్కడ అద్దె గదుల్లో కూడా ఉండటం సురక్షితం కాదని చెపింది. ప్రైవేట్ సెక్యూరిటీ లేని ప్రాంతంలో బస చేయడం మంచిది కాదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మార్చి 31న ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

పర్యాటకులు మార్గదర్శకాలను నిర్లక్ష్యం చేసి ఆయుధాలు, తుపాకులు తీసుకెళ్లడం చట్టారీత్యా నేరమంటూ హెచ్చరించింది. రూల్స్‌ ఉల్లంఘిస్తే ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు కఠినంగా చర్యలు తీసుకుంటారని తెలిపింది. అరెస్టులు, జైలుశిక్ష, జరిమానా విధిస్తారని మార్గదర్శకాల్లో పేర్కొంది. 

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

trump | telugu-news | rtv-news | usa

Advertisment
Advertisment
Advertisment