Bharat-America:అమెరికా నుంచి సాయం ఆగిపోతే కనుక ...10 లక్షల మరణాలు !

యూఎస్‌ఎయిడ్‌ సంస్థ ద్వారా అంతర్జాతీయంగా చేపడుతున్న వేలాది కార్యక్రమాలకు ముగింపు పలకనున్నట్లు అమెరికా పేర్కొంది.యూఎస్‌ నుంచి సాయం ఆగిపోతే దాదాపు 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని అంతర్జాతీయ వ్యాక్సిన్‌ కూటమి గావి ఆందోళన వ్యక్తం చేసింది.

New Update
usaid

usaid

యూఎస్‌ఎయిడ్‌ సంస్థ ద్వారా అంతర్జాతీయంగా చేపడుతున్న వేలాది కార్యక్రమాలకు ముగింపు పలకనున్నట్లు అమెరికా పేర్కొన్న సంగతి తెలిసిందే.దీంతో అమెరికా సాయం పై ఆధారపడి నడిచే అనేక సంస్థల పై దీని ప్రభావం పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అంతర్జాతీయ వ్యాక్సిన్‌ కూటమి గావి కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

Also Read: Ganja: గంజాయి బ్యాచ్‌కు బిగ్ షాక్.. తాగినా, అమ్మినా పదేళ్ల జైలు శిక్ష, లక్ష జరిమానా!

అమెరికా నుంచి సాయం ఆగిపోతే వినాశకరమే అవుతుందని ,దాదాపు 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపింది. గావికి అమెరికా నుంచి వచ్చే నిధులు ఆగిపోతే ప్రపంచ ఆరోగ్య భద్రత పై వినాశకర ప్రభావం చూపుతుంది. నిర్మూలించగలిగే వ్యాధులతో దాదాపు 10 లక్షల మరణాలు సంభవించవచ్చు. ప్రమాదకరవ్యాధుల వ్యాప్తి అనేక జీవితాల పై పడనుందని అంతర్జాతీయ వ్యాక్సిన్‌ కూటమి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సానియా నిష్టర్‌ పేర్కొన్నారు.

Also Read: Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్..ఇద్దరు ఉగ్రవాదులు హతం

అయితే నిధులు నిలిపివేస్తున్నట్లు అమెరికా నుంచి ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం రాలేదన్నారు. దీని పై వైట్‌ హౌస్‌ సహా కాంగ్రెస్‌ తోనూ సంప్రదింపులు జరుపుతున్నామన్నారు.ఈ ఏడాది కార్యక్రమాల కోసం అమెరికా పార్లమెంట్‌ ఆమోదించిన 300 మిలియన్‌ డాలర్లను పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అంతర్జాతీయంగా మానవతా దృక్పథంతో సహాయం చేయడానికీ , ఆయా దేశాల అభివృద్ధికీ,భద్రతకూ నిధులు సమకూర్చడానికీ అమెరికా అంతర్జాతీయ అభివృద్ది సంస్థ ఏర్పాటైంది.

దాదాపు 120 దేశాల్లో వివిధ కార్యక్రమాల కోసం ఏటా వందలకోట్ల డాలర్లను సాయంగా అందిస్తున్నారు. అయితే ఈ సంస్థను మూసివేస్తున్నట్లు ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇటీవల ప్రకటించడం సంచలనం రేపింది. మరో వైపు  అనేక వారాల సమీక్ష అనంతరం దాదాపు 5 వేలకు పైగా కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు అమెరికా అధికారులు ఇటీవల ప్రకటించారు.

విదేశాంగశాఖ కింద కేవలం కొన్ని కార్యక్రమాలకే ఆర్థికసాయాన్ని అందిస్తామన్నారు.అయితే ఈ రద్దకు సంబంధించి ఇటీవల లీకైన 281 పేజీల షీట్‌ లో అంతర్జాతీయ వ్యాక్సిన్‌ కూటమి గావి ఉండటం తాజా ఆందోళనకు కారణమైంది.బిల్‌ అండ్‌ మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ సహా ప్రపంచ ఆరోగ్య సంస్థ ,యునిసెఫ్‌, ప్రపంచబ్యాంకు ఇందులో భాగస్వామ్యంతో 2000 లో ఈ కూటమి ఏర్పాటైంది. 

పేద దేశాల్లోని చిన్నారులు ప్రమాదకర వ్యాధుల బారినపడకుండా నిరోధించే వ్యాక్సిన్‌ లను ఉచితంగా అందజేస్తుంది.

Also Read: Police Crime: పోలీసులు కాదు రాక్షసులు.. పసివాడిపై థర్డ్ డిగ్రీ.. ప్రాణం పోయేలా కొట్టి!

Also Read: TG Love case: ఒకరితో శృంగారం.. మరొకరితో సంసారం: యువకుడి పెళ్లి పెటాకులు చేసిన కాన్ఫరెన్స్ కాల్!

 USAID funding | us | america | india | bharat | latest-news | latest-telugu-news | latest telugu news updates 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: మరికాసేపట్లో ట్రంప్ ప్రతీకార సుంకాల దండయాత్ర

అమెరికా అధ్యక్షుడి ప్రతీకార సుంకాల దండయాత్ర మరి కాసేపట్లో మొదలవనుంది. ప్రపంచంలో అన్ని దేశాలపైనా టారీఫ్ లను విధిస్తున్నామని..ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని ట్రంప్ అంటున్నారు. 

author-image
By Manogna alamuru
New Update
usa

Trump Tariffs

భారత్ సహా చాలా దేశాలపై ప్రతీకార సుంకాలు విధించేందుకు అమెరికా సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో..వాషింగ్టన్ టైమ్ జోన్ ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ట్రంప్ వీటిని అనౌన్స్ చేయనున్నారు. వీటి వల్ల అమెరికా ఆదాయం భారీగా పెరుగుతుందని ట్రంప్ అంటున్నారు. వైట్‌హౌస్‌ వర్గాల ప్రకారం ఏటా 600 బిలియన్‌ల నుంచి 700 బిలియన్‌ డాలర్ల ఆదాయం సమకూరనున్నట్లు అంచనా వేస్తున్నారు. 

భారత్, చైనాలతో పాటూ ప్రపంచంలో అన్ని దేశాల మీద ప్రతీకార సుంకాల విధింపు ప్రారంభం అవుతుంది. రేపటి రోజును అమెరికా లిబరేషన్ డే అని ట్రంప్ ఒక పేరు కూడా పెట్టారు. ఇప్పటి వరకు వరల్డ్ లో అన్ని దేశాలకు తాము తక్కువ సుంకాలు విధిస్తున్నా...అవి మాత్రం అమెరికా దగ్గర నుంచి రెట్టింపు వసూలు చేస్తున్నాయని ట్రంప్ ఆరోపిస్తున్నారు. అందుకే ప్రతీకార సుంకాలను విధిస్తున్నామని..ఏ దేశం ఎంత టారీఫ్ విధిస్తే తామూ అంతే విధిస్తామని చెప్పారు. ఏప్రిల్ 2 నుంచి వీటిని స్ట్రిక్ట్ గా అమలు చేస్తామని ప్రకటించారు. ఏది ఏమైనా తగ్గేదే లేదని స్పష్టం చేశారు. ఇందులో నుంచి ఎవరికీ మినహాయింపు ఉండదని కూడా తేల్చి చెప్పేశారు. మిత్ర దేశాలైన భారత్ లాంటి వాటికి కూడా ఈ సుంకాల మోత తప్పదని ట్రంప్ కుండ బద్ధలు కొట్టినట్టు చెప్పారు. అమెరికాపై సుంకాలను ఎత్తివేసే దేశాల పట్ల సానుకూలంగా, మంచి వాడిగా ఉంటానని తెలిపారు. ఇన్నాళ్ళు తాము చాలా ఏళ్లుగా మేం ప్రపంచ దేశాలతో ఉదారంగా వ్యవహరించాం..కానీ ఇక మీదట అమెరికాను దోచుకోనివ్వమని మరోసారి చెప్పారు ట్రంప్. 

అమెరికాకు శత్రుదేశాల కంటే మిత్రదేశాలే ఎక్కువ ద్రోహం చేశాయని ట్రంప్ అంటున్నారు. దశాబ్దాలుగా అవి మిమ్మల్ని దోచుకున్నాయని ఆరోపిస్తున్నారు. ఇంతకు ముందు అన్ని దేశాలు అమెరికాను దోచుకున్న దానికంటే ఇప్పుడు తాము విధిస్తున్న సుంకాలు ఎంతో తక్కువని ట్రంప్ సమర్ధించుకున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా మాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్న ప్రపంచ దేశాలన్నిటిపైనా మా వాణిజ్య సుంకాలు అమలవుతాయని చెప్పారు. 

సుంకాల కోత..

టారీఫ్ లవిషయంలో మిగతా దేశాల మాట ఎలా ఉన్నా...భారత్ మాత్రం అమెరికాకు ఎదురు తిరగదల్చుకోలేదని తెలుస్తోంది. సుంకాల విషయం అనౌన్స్ చేసిన దగ్గర నుంచే భారత్ వాటిని సమర్థిస్తూ వచ్చింది. ప్రపంచంలో శక్తివంతమైన దేశాలన్నింటికీ సమాన అధికారాలు ఉండాలన్న ఆలోచనతోనే ట్రంప్ ఇదంతా చేస్తున్నారని వెనకేసుకొచ్చారు. ఇండియా కూడా సరిగ్గా ఇలానే ఆలోచిస్తుందని అన్నారు. క్వాడ్‌లో ప్రతి దేశం తమవంతు పాత్ర పోషిస్తోంది. అందులో ఫ్రీ రైడర్లు ఎవరూ లేరు అంటూ జైశంకర్..ట్రంప్ ను వెనకేసుకుని వచ్చారు. దాని తరువాత భారత ప్రభుత్వం అమెరికాతో  ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై చర్చింది కూడా. దాని బట్టి అమెరికా దిగుమతులపై సుంకాలను తగ్గించే దిశగా ఇండియా చర్యలు తీసుకోనుందని తెలుస్తోంది. 

భారత్ పై ప్రభావం..

విదేశాల నుంచి తమ దేశంలోకి దిగుమతి అయ్యే వస్తువులపై దాదాపు ప్రతి దేశమూ సుంకం  విధిస్తుంది. తమ దేశంలో తయారీకి ప్రోత్సాహం ఇవ్వడం...దాని ద్వారా ఉద్యోగాలను సృష్టించడానికే ప్రభుత్వాలు ఈ పని చేస్తాయి. దీని వలన దేశ ఖజానా కూడా నిండుతుంది.  అయితే దీని వలన ఒక్కోసారి వినియోగదారులపై కూడా భారం పడే అవకాశం ఉంది. అధిక సుంకాల వలన ముడిసరుకు, కొన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి. ఇప్పుడు మన దేశం అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఆహార వస్తువులు, కూరగాయలు, బట్టలు, ఎలక్ట్రిక్ మెషినరీ, జెమ్స్, జ్యూయలరీ, ఫార్మా, ఐరన్, స్టీల్‌‌‌‌‌‌‌‌పై ఎక్కువ టారిఫ్‌‌‌‌‌‌‌‌లు పడే అవకాశం ఉంది. దాన్ని బట్టి వాటి ధరలు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఇలా జరగకుండా ఉండడానికే భారత ప్రభుత్వం ఇప్పుడు యూఎస్ నుంచి దిగుమతి చేసుకుంటున్న 30 రకాల ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లపై టారిఫ్‌‌‌‌‌‌‌‌లు తగ్గించాలని చూస్తోంది. మనం తగ్గితే ఆటోమేటిక్ గా అమెరికా కూడా సుంకాలను తగ్గిస్తుంది.

today-latest-news-in-telugu | usa | trump tariffs | india | china

Also Read: NASA: మీడియా ముందుకు సునీతా విలియమ్స్..మళ్ళీ ఐఎస్ఎస్ కు వెళ్తా..

Advertisment
Advertisment
Advertisment