USA: హెచ్ 1 బీ వీసాల రూల్స్ మళ్ళీ మార్పులు.. మరింత కఠినం !

యూఎస్ వీసాల్లో ఒకటైన హెచ్ 1 బీ వీసా నిబంధనలు మరింత కఠినతరం అవునన్నాయా అంటే అవుననే చెబుతున్నారు. ఇక మీదట నుంచి వీసాలు, ఇమ్మిగ్రేషన్ నిబంధనలు విదేశీ వ్యవహారాల కిందకు తీసుకువస్తామని అక్కడి విదేశాంగమంత్రి రూబియో ప్రకటించారు. దీంతో రూల్స్ మారతాయని చెప్పారు. 

New Update
usa

H 1B Visa

అమెరికా ప్రభుత్వం రిపబ్లికన్స్ చేతుల్లోకి వచ్చాక, అధ్యక్ష పదవి ట్రంప్ చేపట్టాక..ఇక్కడా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. అమెరికా మొత్తాన్ని మార్చాలని ట్రంప్ ప్రభుత్వం అనుకుంటోంది. ఇప్పటికే వలసవిధానాల్లో, సుంకాల్లో మార్పుల చేసింది. అక్రమ వలసదారులను ప్రత్యేక విమానాల్లో సైతం వారివారి దేశాలకు పంపేస్తున్నారు.

మళ్ళీ రూల్స్ మరతాయా?

ఈ క్రమంలో యూఎస్ విదేశాంగ మంత్రి రూబియో  వలస విధానానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. వీసాలు, ఇమ్మిగ్రేషన్ రూల్స్ ఇక మీదట మారతాయని ఆయన చెప్పారు. ఈ రెండింటినీ విదేశీ వ్యవహారాల కిందకు తీసుకురావాలనుకుంటున్నామని అన్నారు. అదే అయితే కనుక వీసా నిబంధనల్లో మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పారు. అమెరికాలో పనిచేయాలని, చదువుకోవాలని, ఇక్కడ పర్యటించాలని అనుకొనే భారతీయులు భారీ మార్పులను చవిచూసే అవకాశం ఉంది. వీసా ఆమోదాలు, పునరుద్ధరణ విషయంలో యాజమాన్యాలు, ఉద్యోగస్తులు అంతరాయం ఎదుర్కొనే అవకాశం ఉందని రూబియో చెప్పారు. దీని వలన హెచ్‌-1బీ నిబంధనలు, ఇమ్మిగ్రేషన్‌ ప్రక్రియపై అనిశ్చితిని పెంచుతుందన్నారు. 

Also Read: Podcost: ప్రధాని మోదీతో ఫ్రిడ్ మన్ ఎపిక్ పాడ్ కాస్ట్

వీసాల విషయంలో అగ్రరాజ్యం ఒక్కో రూల్ ను నెమ్మదిగా మార్చుకుంటూ వస్తోంది. మొత్తానికి ఇతర దేశాల వాళ్ళు అంత ఈజీగా రాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఈ మధ్యనే  డ్రాప్ బాక్స్ విధానంలో కూడా మార్పులు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. వీసా రెన్యువల్ కోసం డ్రాప్ బాక్స్ విధానం అమల్లో ఉంది. దీనిలో ఇంటర్వూలు లేకుండా వీసాలను రెన్యువల్ చేసుకోవచ్చును. దీనికి ఇప్పటివరకు 48 నెలల టైమ్ ఉండేది. అంటే వీసా అయిపోయాక 48 నెలల వరకు ఇంటర్వ్యూలకు అటెండ్ అవకుండా డ్రాప్ బాక్స్ ద్వారా పొందవచ్చును. ఇప్పుడు ఆ కాలాన్ని 12 నెలలకు తగ్గించారు. ఈ రూల్ ను తక్షణమే అమల్లోకి కూడా తీసుకువచ్చారు. 

Also Read: Bangladesh: అబ్బా దారుణం..8ఏళ్ళ బాలిక రేప్..మూడు సార్లు గుండెపోటుతో మృతి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Woman kills husband: భర్తకు ఛాయ్‌లో ఎలుకల మందు.. పింటూతో నలుగురు పిల్లల తల్లి లవ్ ట్రాక్

ప్రియుడి పింటూతో కలిసి భర్తకు టీలో ఎలుకల మందు కలిపి, గొంతు నులిమి రేఖ చంపేసింది. తర్వాత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించాలనుకున్నారు. పోస్టుమార్టం రిపోర్ట్‌లో అసలు నిజం బయటపడింది. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లా ఫతేగంజ్‌లో ఏప్రిల్ 13న ఇది జరిగింది.

New Update
Woman kills husband

భార్యల వివాహేత సంబంధాల కారణంగా బలవుతున్న భర్తల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మీరట్‌ సౌరవ్, అమిత్‌ల హత్య సంచలనంగా మరిన విషయం తెలిసిందే. కొన్నిరోజుల క్రితమే మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌లో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో తాజాగా మరో హత్య ఇలాగే జరిగింది. ఓ మహిళ ఛాయ్‌లో ఎలుకల మందు కలిపి భర్తకు ఇచ్చింది. తర్వాత ప్రియుడితో కలిసి భర్త కేహర్ సింగ్ గొంతునొక్కి హత్య చేసింది. మృతదేహాన్ని సీలింగ్‌కు వేలాడదీసి ఉరేసుకున్నట్లు నమ్మించాలని ప్లాన్ వేసింది. కానీ.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో అసలు విషయం బయటపడింది. దీంతో భార్య రేఖను, ఆమె ప్రియుడు పింటూను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఫతేగంజ్‌లో నివసిస్తున్న కేహర్ సింగ్‌ కాంట్రాక్ట్‌ పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. 16ఏళ్ల కింద అతనికి 25 ఏళ్ల రేఖతో వివాహం జరిగింది. వారికి నలుగురు పిల్లలున్నారు.

Also read: Azharuddin- HCA: అజారుద్దీన్‌కు బిగ్ షాక్.. ఉప్పల్ స్టేడియంలో ఆయన పేరు మాయం

ఆత్మహత్యగా చిత్రీకరించి..

రేఖకు పింటూతో వివాహేతర సంబంధం ఏర్పడింది. కేహర్ సింగ్‌కు ఇది తెలియడంతో ఏడాదిగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో పూర్తిగా భర్త అడ్డును తొలగించుకొని ప్రియుడితో సెట్టిల్ అవుదామని ప్లాన్ వేసి భర్తను మర్డర్ చేసింది. ఏప్రిల్‌ 13న ఆదివారం రాత్రి టీలో ఎలుకల మందు కలిపి భర్తకు ఇచ్చింది. ఆ తర్వాత ప్రియుడు పింటూను తన ఇంటికి పిలిచింది. వారిద్దరూ కలిసి గొంతు నొక్కి కేహర్‌ సింగ్‌ను హత్య చేశారు. అనంతరం భర్త మెడకు తాడు బిగించి సీలింగ్‌కు వేలాడదీశారు. ఏమి తెలియనట్లు సోమవారం తెల్లవారుజామున తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని రేఖ ఏడుస్తూ పెడబొబ్బలు పెట్టింది. పక్కింటివారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Also read: Hydra: TDP ఎమ్మెల్యేకు హైడ్రా షాక్.. 20 ఎకరాల్లో నిర్మాణాల కూల్చివేత

పోలీసులు అక్కడికి చేరుకొని కేహర్‌ సింగ్‌ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. గొంతు నొక్కి అతడ్ని చంపినట్లు పోస్టుమార్టం రిపోర్ట్‌లో బయటపడింది. దీంతో రేఖను అదుపులోకి పోలీసులు ప్రశ్నించారు. ప్రియుడు పింటూతో కలిసి భర్తను హత్య చేసినట్లు ఆమె ఒప్పుకున్నదని పోలీస్‌ ఆఫీసర్ తెలిపారు. దీంతో వారిని అరెస్ట్ చేశారు. 

(Tags : Woman kills husband | Woman kills husband with boyfriend | poison | uttara-pradesh | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment