USA: ట్రంప్ ను చంపేందుకు కుట్ర..డబ్బు కోసం ఏకంగా తల్లిదండ్రులనే హత్య

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను హత్య చేసేందుకు ఏకంగా తన తల్లిదండ్రులనే హతమార్చాడు నికితా కాసాప్ అనే యువకుడు. పేరెంట్స్ చంపి డబ్బుతో ఇంట్లో నుంచి పారిపోయిన ఇతనిని రీసెంట్ గా పోలీసులు అరెస్ట్ చేశారు.

New Update
USA

Nikitha Kasap

నికితా కాసాప్...17 ఏళ్ళ టీనేజీ కుర్రాడు. ట్రంప్ అన్నా, అతని ప్రభుత్వం అన్నా చాలా కోపం. అందుకే అధ్యక్షుడిని చంపాలనుకున్నాడు. అలా చేస్తే రిపబ్లికన్ ప్రభుత్వం కూడా కూలిపోతుందని భావించాడు. దీని కోసం ఒక రష్యన్ తో ప్రణాళికలు కూడా వేశాడు. అయితే ఇదంతా చేయాలంటే డబ్బులు కావాలి. ట్రంప్ ను డైరెక్ట్ గా చంపలేడు. దాని కోసం ఆయుధాలు కావాలి. అవి సమకూర్చుకోవాలంటే బోలెడంత డబ్బు కావాలి. ఎలా అని ఆలోచించాడు. అతనికి ఒకటే ఒక్క మార్గం తట్టింది. అదే తల్లిదండ్రులను చంపేయడం. అంతే ఇంకేం ఆలోచించకుండా తన పేరెంట్స్ ను క్రూరంగా చంపేశాడు. ఇదీ అమెరికాలోని టీనేజర్ నికితా కథ.

తీవ్రవాద భావజాలం..

నికితా తన పేరెంట్స్ ను గన్ తో కాల్చి చంపేశాడు. ఆ తరువాత కొన్ని రోజుల పాటూ ఆ శవాలతోనే ఇంట్లోనే ఉన్నాడు. తరువాత వారి దగ్గర నుంచి 14 వేల డాలర్లను, పాస్ పోర్ట్, తన పెంపుడు కుక్కతో వేరే చోటికి పారిపోయాడు. ఈ విషయం ఎవరికీ వెంటనే తెలియలేదు. ఫిబ్రవరి 28న అధికారులు టిటాయానా, మేయర్ మృతదేహాలను కనుగొన్నారు. అంతకు ముందు నికితా ఇంట్లో నుంచి శవాలు కుళ్ళిపోయి వాసన వస్తుంటే...పక్కన ఉన్నవాళ్లు పోలీసులకు కంప్లైంట్ చేశారు. దానికి తోడు మేయర్ గత రెండు వారాలుగా పనికి రాకపోవడం, నికితా కాసాప్ స్కూలుకు రాకపోవడంతో ఈ హత్యలు వెలుగులోకి వచ్చాయి. దాంతో మొత్తం విషయం అంతా బయటపడింది.  ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిన నికితా కాన్సాస్ లో తలదాచుకున్నాడు. ట్రంప్ ను చంపేందుకు డ్రోన్, పేలుడు పదార్థాలను కొన్నాడు. కానీ చివరకు పోలీసులకు దొరికిపోయాడు. అతని దగ్గర హిట్లర్‌ని ప్రశంసిస్తూ మూడు పేజీల యాంటిసెమిటిక్ మ్యానిఫెస్టోని కూడా పోలీసులు కనుగొన్నారు.

నికితా కాసాప్ మీద అమెరికా పోలీసులు మొత్తం 9 కేసులను నమోదు చేశారు. రెండు హత్యలు, శవాలను దాచిపెట్టడం, ఆస్తి దొంగతనం, అధ్యక్షుడి హత్యకు కుట్ర, సామూహిక విధ్వంసం, ఆయుధాలను ఉపయోగించడం వంటి నేరాలతో కేస్ ఫైల్ చేశారు. ఈ కుర్రాడికి చాలా రోజుల నుంచి తీవ్రవాద భావజాలం ఉంది. ఈ విషయాన్ని నికితా చాలా మందితో షేర్ కూడా చేసుకున్నాడని చెబుతున్నారు. 

 today-latest-news-in-telugu | usa | america president donald trump | murder 

Also Read: Ukraine: ఉక్రెయిన్ పై రష్యా మరో భారీ దాడి.. 34 మంది మృతి

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

Pak: భారత్ పై మరోసారి అక్కసు వెళ్లగక్కిన పాక్‌ సైన్యాధిపతి!

పాక్‌ నేతలు భారత్‌ పై విషం చిమ్ముతూనే ఉన్నారు.పాక్‌ సైన్యాధిపతి ఆసిం మునీర్‌ మరోసారి భారత్‌ పై అక్కసు వెళ్లగక్కారు.రెండు దేశాల సిద్ధాంతాన్ని ప్రస్తావించిన ఆయన..అన్ని అంశాల్లో హిందూ,ముస్లింలు వేర్వేరు అని వ్యాఖ్యానించారు.

New Update
 Pakistan army chief Asim Munir

Pakistan army chief Asim Munir

పహల్గాం ఉగ్రదాడిలో పాకిస్థాన్‌ పాత్ర ఉందని పేర్కొన్న భారత్‌..దాయాది దేశం పై చర్యలకు ఉపక్రమించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో పాక్‌ నేతలు భారత్‌ పై విషం చిమ్ముతూనే ఉన్నారు.పాక్‌ సైన్యాధిపతి ఆసిం మునీర్‌ మరోసారి భారత్‌ పై అక్కసు వెళ్లగక్కారు.

Also Read: Russia-Ukrain-Putin: ఉక్రెయిన్‌ తో చర్చల పునరుద్దరణకు రెడీ..!

రెండు దేశాల సిద్ధాంతాన్ని ప్రస్తావించిన ఆయన..అన్ని అంశాల్లో హిందూ,ముస్లింలు వేర్వేరు అని వ్యాఖ్యానించారు.మతంఆచారాలు,సంప్రదాయాలు, ఆలోచనలు,ఆకాంక్షల్లో హిందూ ,ముస్లింలు వేర్వేరు.వీటి ఆధారంగానే రెండు దేశాలు ఉండాలనే భావన ఏర్పడింది.పాకిస్తాన్‌ ఏర్పాటుకు పూర్వీకులు ఎన్నో త్యాగాలు చేశారు.

Also Read: BIG BREAKING: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్‌ ఫిక్స్‌..! పాక్ మాజీ హైకమిషనర్‌ సంచలన కామెంట్స్‌

వాటిని ఎలా కాపాడుకోవాలో మనకు తెలుసు అని పాక్‌ ఆర్మీ చీఫ్‌ ఆసిం మునీర్‌ పేర్కొన్నారు. ఖైబర్‌ పఖ్తుంఖ్వాలోని పాక్‌ మిలిటరీ అకాడమీ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.అంతకు ముందు ప్రవాస పాకిస్థానీల తొలి సదస్సులోనూ మునీర్‌ ఇదే విధంగా మాట్లాడారు.

మనది ఒక దేశం కాదని,రెండు దేశాలన్నారు.కశ్మీర్‌ తమ జీవనాడి లాంటిదని వ్యాఖ్యానిచారు.ఇలా మాట్లాడిన కొన్ని రోజుల్లోనే పహల్గాంలో ముష్కరులు పాశవిక దాడులకు పాల్పడ్డారు.


జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన హిందువుల ఊచకోత తర్వాత, భారత్ .. పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకుంది. సింధూ జల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేయడం, పాకిస్తాన్ హైకమిషన్‌లో దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించడం, అట్టారి-వాఘా సరిహద్దును మూసివేయడం వంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. ఇవి పాకిస్తాన్‌లో భయాందోళనలను సృష్టించింది. ఏ క్షణమైనా భారత్ తో యుద్దం సంభవించవచ్చనని భావించిన పాక్.. భయపడిపోయి చైనాను ఆశ్రయించి సహాయం కోసం విజ్ఞప్తి చేసింది.

పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి మహ్మద్ ఇషాక్ దార్ ఇస్లామాబాద్‌లో చైనా రాయబారి జియాంగ్ జెతో సమావేశమయ్యారు. తాజా పరిస్థితులను ఆయనకు వివరించారు.  ఒకవేళ భారత్ తో యుద్దం సంభవిస్తే సహాయం చేయాలని కోరారు.  అందుకు చైనా కూడా హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 

మరోవైపు పాకిస్తాన్ యుద్ధానికి సిద్ధంగా ఉందని ఇప్పటికే ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ వెల్లడించారు.  భారత్ తమపై ఎటువంటి ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తోందని అన్నారు. ఉగ్రవాద దాడిపై నిష్పాక్షిక దర్యాప్తుకు సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. 

పహల్గాం ఘటనతో మా దేశానికి ఎలాంటి సంబంధం లేదు. అయినా భారత్‌ మమ్మల్ని నిందిస్తోంది.ఈ దాడి పై ఇప్పటి వరకు ఎలాంటి దర్యాప్తు జరిగినట్లు కనిపించడం లేదు. ఒక వేళ దర్యాప్తు జరిగితే సహకరించేందుకు పాక్‌ సిద్ధంగా ఉంటుంది. అయితే అంతర్జాతీయంగా విచారణ జరగాలని మేం కోరుకుంటున్నాం అని ఆయన పేర్కొన్నారు. కాగా ఏప్రిల్ 22న జరిగిన ఈ ఊచకోతలో, 25 మంది భారతీయులు, ఒక నేపాలీ పౌరుడిని ఉగ్రవాదులు చంపేశారు.

Also Read:Mohan Bhagwat: 'పాకిస్తాన్ తప్పు చేసింది'.. ఉగ్రదాడిపై RSS చీఫ్ సంచలన వ్యాఖ్యలు

Also Read: BIG BREAKING: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్‌ ఫిక్స్‌..! పాక్ మాజీ హైకమిషనర్‌ సంచలన కామెంట్స్‌

pak | army | chief | Asim Munir | bharat | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు