UK: ఇజ్రాయెల్‌లో బ్రిటన్ ఎంపీలు నిర్బంధం..

ఇజ్రాయెల్‌కు వెళ్లిన ఇద్దరు బ్రిటన్‌ ఎంపీలకు బిగ్ షాక్ తగిలింది. అక్కడి అధికారులు వాళ్లిద్దరినీ అడ్డుకొని నిర్బంధించారు. ఇజ్రాయెల్ తీరుపై బ్రిటన్ ప్రభుత్వం మండిపడింది. ఇలా చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ధ్వజమెత్తింది.

New Update
Two UK MPs denied entry to Israel

Two UK MPs denied entry to Israel

ఇజ్రాయెల్-, హమాస్‌ యుద్ధం ఇంకా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇజ్రాయెల్‌కు వెళ్లిన ఇద్దరు బ్రిటన్‌ ఎంపీలకు బిగ్ షాక్ తగిలింది. అక్కడి అధికారులు వాళ్లిద్దరినీ అడ్డుకొని నిర్బంధించారు. ఇజ్రాయెల్ తీరుపై బ్రిటన్ ప్రభుత్వం మండిపడింది. ఇలా చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ ధ్వజమెత్తారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. బ్రిటన్ అధికార లేబర్ పార్టీకి చెందిన యువాన్ యాంగ్, అబ్తిసామ్ మొహమ్మద్ ఇద్దరూ కూడా శనివారం ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లారు. 

Also Read: అమ్మో బాబోయ్.. చీతాలకు నీళ్లు తాగించిన యువకుడు.. చివరికీ ఊహించని షాక్

అక్కడికి చేరుకున్నాక అధికారులు వాళ్లని అడ్డుకొని నిర్బంధించారు. ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత విడిచిపెట్టారు. అయితే భద్రతా దళాల కార్యకలాపాలను డాక్యుమెంట్ చేయడంతో పాటు తమపై వ్యతిరేకతను పెంచడం కోసమే ఆ ఎంపీలు వచ్చారని ఇజ్రాయెల్ ఆరోపణలు చేసింది. అందుకే వాళ్ల రాకను అధికారులు అడ్డుకున్నారని చెప్పింది. సమాచారం లేకుండానే ఇక్కడికి ఎలా వచ్చారని ప్రశ్నించింది. అయితే ఇజ్రాయెల్ చర్యలపై యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్‌ లామీ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

Also Read: శ్రీలంకలో ప్రధాని మోదీ.. 11 మంది భారత జాలర్లు విడుదల

డేవిడ్ లామీ మాట్లాడుతూ '' ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లిన ఇద్దరు యూకే ఎంపీలను అక్కడి అధికారులు నిర్బంధించారు. ఇది సరైంది కాదు. వాళ్ల చర్య ఆందోళన కలిగిస్తోంది. మా ఎంపీలతో వాళ్లు ఇలా వ్యవహరించడం కరెక్ట్ కాదు. ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వంలోని నా సహచరులకు చెప్పాను. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ, గాజాలో శాంతి నెలకొల్పడం వంటి చర్చలపైనే మా ప్రభుత్వం దృష్టి సారిస్తోందని'' అన్నారు. 

Also Read: పంబన్ బ్రిడ్జ్ ప్రారంభించిన మోదీ.. భారత్‌లో ఇలాంటి వంతెన ఇదే ఫస్ట్ టైం

telugu-news | rtv-news | britain | israel | hamas-israel | hamas-israel-war

 

#telugu-news #rtv-news #britain #israel #hamas-israel #hamas-israel-war
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించిన పాక్.. ఉ...

BIG BREAKING: అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించిన పాక్.. ఉద్యోగుల సెలవులు రద్దు!

పాకిస్తాన్ లో ప్రస్తుతం పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. భారత్ యుద్ధానికి రెడీ అవుతుండడంతో పాక్ జాగ్రత్తలు పడుతోంది. పీవోకేలో అత్యవసర ఆంక్షలు విధించింది. ఉద్యోగుల సెలవులు, ట్రాన్సఫర్లను నిలిపేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 

New Update
పాక్ ఉగ్రవాదులకు చైనా ఆయుధాలను అందిస్తున్న ఐఎస్ఐ

పైకి బీరాలు పోతున్నా పాకిస్తాన్ లోపల భయపడుతోందని స్పష్టంగా తెలుస్తోంది. పాక్ పీవోకేలో జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం. ఒకవైపు బోర్డర్ లో భారత్ చర్యలు, యుద్ధం తప్పదన్న హెచ్చరికలతో పాకిస్తాన్ అత్యవసర నిర్ణయాలను తీసుకుంటోంది. పాక్ పీవోకేలో అత్యవసర ఆంక్షులు విధించింది అక్కడి ప్రభుత్వం. దాంతో పాటూ ఆరోగ్య కార్యకర్తల సెలవులు, ట్రాన్సఫర్లను నిలిపేసింది. దీనికి సంబంధించి ఏప్రిల్ 25న జీలం వ్యాలీ హెల్త్ డైరెక్టరేట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆసుపత్రులు, ఆరోగ్య విభాగాలలోని వైద్య సిబ్బందిని వారి వారి డ్యూటీ పాయింట్ల వద్దనే ఉంచాలని ఆదేశించింది. ఇప్పటికే సెలవు మీద ఉన్నవారు కూడా వెంటనే డ్యూటీల్లో జాయిన్ అవ్వాలని చెప్పింది. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, అంబులెన్స్ డ్రైవర్లను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచాలని ఆదేశించింది. 

అప్రమత్తమైన భారత బలగాలు..

పాక్ హెల్త్ డైరెక్టరీ ఉత్తర్వులను భారత భద్రతా సంస్థలు కూడా తీవ్రంగా పరిగణించాయి. పాకిస్తాన్ తీసుకుంటున్న ఈ చర్యలు ఎల్వోసీ దగ్గర సైనిక లేదా ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నాయి. దక్షిణ కాశ్మీర్‌లోని పహల్గామ్, పరిసర ప్రాంతాలలో ఇవి ఎక్కువగా జరగొచ్చని ఊహిస్తున్నారు. దీంతో భారత భద్రతా దళాలు పహల్గామ్, అనంతనాగ్ జిల్లాల్లో పెట్రోలింగ్, నిఘాను ముమ్మరం చేశాయి.  ఇక నియంత్రణ రేఖ దగ్గర భారత సైన్యం ప్రత్యేక నిఘాను కూడా ఏర్పాటు చేసింది. భారత సైన్యం ఎటువంటి ముప్పునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు. 

today-latest-news-in-telugu | pakistan | loc | emergency 

Also Read:   J&K: మరో ఉగ్రవాది ఇంటిని పేల్చేసిన బలగాలు

Advertisment
Advertisment
Advertisment