Trump tariffs: మనుషులులేని దీవులపై కూడా ట్రంప్ టారిఫ్ ఛార్జీల మోత.. ఎందుకంటే?

ట్రంప్ టారిఫ్ ఛార్జీల విషయంలో తగ్గేదేలే అంటున్నాడు. మనుషులు జీవించలేదని అంటార్కిటిక్ హిందూ మహాసముద్రంలోని హర్డ్ అండ్ మెక్‌డొనాల్డ్ దీవులపై 10 టారిఫ్ విధించాడు. వీటితోపాటు ఆస్ట్రేలియా కిందకి వచ్చే మరోకొన్ని దీవులపై కూడా ట్రంప్ భారీగా సుంకాలు విధించాడు.

New Update
tariffs on islands

tariffs on islands Photograph: (tariffs on islands )

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. ప్రపంచంలో అన్నీ దేశాలపై ఎగుమతి సుంకాలను భారీగా పెంచుతూ ఆయన ప్రకటించాడు. గురువారం ఏయే దేశంపై ఎంత సుంకాలు విధించాడో వైట్ హౌస్ నుంచి విడుదల అయ్యింది. ఈ క్రమంలో ట్రంప్ ఓ దీవిపై కూడా 10 శాతం టారిఫ్ ట్యాక్స్ విధించాడు. వింత ఏంటంటే.. అక్కడ మనుషులు ఉండరు. కేవలం పెంగ్విన్లు మాత్రమే నివసిస్తాయి.

Also read: Moon: చంద్రుడిపై నిర్మాణాలు.. బ్యాక్టీరియాతో ఇటుకల తయారీ!

ఇదే క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కేవలం 2వేల మంది మాత్రమే నివసించే మరో ఆస్ట్రేలియా భూభాగమైన నార్ఫోక్ ద్వీపంపై 29 శాతం సుంకాన్ని ప్రకటించటం గమనార్హం. అలాగే కేవలం 2వేల 500 మంది మాత్రమే నివసిస్తున్న మారుమూలన నార్వేజియన్ భూభాగాలైన జాన్ మోయెన్, స్వాల్బార్డ్ ప్రాంతాలను సైతం ట్రంప్ తన తాజా టారిఫ్స్ ప్రకటనలో విడిచిపెట్టలేదు.

ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సబ్ అంటార్కిటిక్ హిందూ మహాసముద్రంలోని హర్డ్ అండ్ మెక్‌డొనాల్డ్ దీవులపై పన్నులు ప్రకటించటమే. వాస్తవానికి ఈ దీవుల్లో మనుషులు నివసించరు. యునెస్కో వీటిని ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో కూడా చేర్చింది. ఈ ప్రాంతం దాదాపు 80 శాతం మంచుతో కప్పబడి ఉంటుంది. రాతితో కూడిన ఈ దీవులు చీకటిగా ప్రజలు నివాసం లేకుండా ఉన్నాయి. 

Also read: Emergency landing: టర్కీలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 200మంది భారతీయులు 16 గంటలుగా

ఈ దీవులు ఆస్ట్రేలియా భూభాగం కిందకు వస్తాయి కాబట్టి.. వాటిని టారిఫ్స్ జాబితాలో చేర్చినట్లు వైట్ హౌస్ అధికారిని ఆక్సియోస్ తెలిపింది. ప్రపంచ బ్యాంక్ డేటా ప్రకారం అమెరికా హెర్డ్ ఐలాండ్, మెక్ డొనాల్డ్ దీవుల నుంచి దాదాపు 1.4 మిలియన్ డాలర్లు విలువైన వస్తువులను దిగుమతి చేసుకున్నట్లు గార్డియన్ వార్తా సంస్థ నివేదించింది. కేవలం ఐస్, పెంగ్విన్లు మాత్రమే ఉండే ఈ ప్రాంతం నుంచి మెషినరీ, ఎలక్టికల్స్ దిగుమతి చేసుకోవటం పెద్ద మిస్టరీగా అనిపిస్తోందని నివేదికలో పేర్కొంది. అందుకేనేమో ట్రంప్ ఈ మారుమూల జనావాసం లేని దీవులను సైతం విడిచిపెట్టకుండా తన టారిఫ్స్ కిందకు తీసుకొచ్చారు.

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

రేవ్ పార్టీలో అడ్డంగా బుక్కైన ఆర్మీ, రాజకీయ నేతల కూతుర్లు.. వీడియో వైరల్

పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్‌పార్టీలో ఆర్మీ అధికారులు, రాజకీయ నేతల కొడుకులు, కూతుర్లు పట్టుబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

New Update
55 Held At Rave Party In Pakistan, But Cops Who Busted It Got Suspended

55 Held At Rave Party In Pakistan, But Cops Who Busted It Got Suspended

పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్‌పార్టీలో ఆర్మీ అధికారులు, రాజకీయ నేతల కొడుకులు, కూతుర్లు పట్టుబడ్డారు. ఆ పార్టీలో మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు సోదాలు చేశారు. దీంతో మొత్తం 55 మందిని అదుపులోకి తీసుకున్నారు. అందులో 30 మంది అబ్బాయిలు, 25 మంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్లలో చాలామంది ఆర్మీ, సెక్యూరిటీ, అధికార పార్టీ రాజకీయ నేతల కొడుకులు, కుమార్తెలే. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 అయితే ఈ రేవ్‌పార్టీలో సోదాలు నిర్వహించిన ఇద్దరు పోలీస్ అధికారులను సస్పెండ్ చేయడం గమనార్హం. ఈ వీడియో ఎలా లీక్ అయ్యిందనే దానిపై ఇప్పుడు విచారణ జరుగుతోంది. పంజాబ్‌లోని సంపన్నులు ఉండే ప్రాంతమైన కాసూర్‌ జిల్లాలో జరిగింది. ఈ పార్టీకి వచ్చిన యువతీ, యువకులు వద్ద మాదకద్రవ్యాలను పోలీసులు గుర్తించారు.  

Also Read: 3 రోజులపాటు ఆస్పత్రిలోనే పవన్‌ చిన్న కుమారుడు!

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరవ్వడంతో ఆర్మీ, సెక్యూరిటీ, రాజకీయ నేతలు ఫోన్ కాల్స్‌ ముస్తాఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌కు వరదల్లా వచ్చాయి. అయితే ఈ వీడియోను అధికారిక అనుమతి లేకుండా లీక్ చేశారని కాసూర్ జిల్లా పోలీస్ అధికారి (DPO) ఈ సోదాలు నిర్వహించిన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు.  రేవ్‌ పార్టీలో దొరికిన యువతీ, యువకులు కోర్టులో కూడా హాజరయ్యారు. సరైన ఆధారాలు లేకపోవడంతో వాళ్లని కోర్టు విడుదల చేసింది. 

అయితే రాజకీయ నాయకులు, ఆర్మీ అధికారులు ఈ విషయం బయటపడకుండా పోలీసులకు ఆదేశిస్తున్నారని తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఎలా లీక్ అయ్యిందనే దానిపై ఎస్పీ కూడా విచారణ చేపట్టారు. తాము అపార్థం చేసుకుని రేవ్ పార్టీపై సోదాలు చేశామని.. అదుపులోకి తీసుకున్న యువతీ, యువకుల తప్పేమీ లేదని ఇప్పుడు పోలీసులు చెప్పడం మరీ విడ్డూరం.

Also Read: 2040 నాటికి చంద్రుడిపైకి భారత వ్యోమగామి

 telugu-news | rtv-news | rave-party not

  

Advertisment
Advertisment
Advertisment