USA: ట్రంప్ శాంతి మంత్రం..యుద్ధానికి ముగింపు పలకాలని పుతిన్ కు ఫోన్

రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలుకుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. దీనికి సంబంధించి పుతిన్ అంగీకారానికి వచ్చారని చెప్పారు. త్వరలోనే తాము కలిసి ఫైనల్ డెసిషన్ కు వస్తామని అన్నారు. 

New Update
russia

Donald Trump, Vladimir Putin

ట్రంప్ చొరవతో ఎట్టకేలకు ఉక్రెయిన్, రష్యా వార్ ముగిసే అవకాశం కనిపిస్తోంది. ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు దిశగా చర్చలు జరిపేందుకు తాను, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అంగీకారానికి వచ్చామని డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పారు. అదే విధంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తో కూడా ట్రంప్ మాట్లాడారు. అందరం కలిసి పని చేయాలని...యుద్ధం ఆపేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. రష్యాలో బందీగా ఉన్న అమెరికా టీచరు మార్క్‌ ఫోగెల్‌ విడుదల అయిన తర్వాత తాను పుతిన్‌తో ఫోన్ లో మాట్లాడానని ట్రంప్ చెప్పారు. మరోవైపు ఫోగెల్‌ విడుదలకు ప్రతిగా రష్యాకు చెందిన నేరగాడు అలెగ్జాండర్‌ విన్నిక్‌ను అమెరికా విడుదల చేసింది.  ఫోగెల్‌కు రష్యా కోర్టు 2021 ఆగస్టులో 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ వారం జర్మనీలో మ్యూనిచ్ లో జరిగే భద్రతా సదస్సుకు  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా హాజరవనున్నారు. అక్కడ ఉక్రెయిన్ యుద్ధం గురించి  చర్చించనున్నారు. దాని తరువాత ఇరు దేశాల మధ్యనా శాంతి ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉందని ట్రంప్ చెప్పారు.  

Also Read: UN: బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు..1400 మంది మృతి-ఐక్యరాజ్యసమితి

ట్రంప్ కు థాంక్స్..జెలెన్ స్కీ..

శాంతిని నెలకొల్పడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో సుదీర్ఘ చర్చలు జరిపానని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ చెప్పారు. దౌత్య, ఆర్థిక, సైనిక అంశాలపై తాము మాట్లాడుకున్నామని తెలిపారు. అలాగే పుతిన్ తో జరిగిన చర్చల గురించి కూడా ట్రంప్ తనకు వివరించారని...శాంతి కోసం ఆయన కృషి చేస్తున్నందుకు అభినందనలు, అలాగే థాంక్స్ కూడా చెబుతున్నానని జెలెన్ స్కీ అన్నారు. యూఎస్ బలం, ఉక్రెయిన్, ఇతర దేశాల ఐకమత్యం రష్యాను శాంతివైపు నడిపిస్తాయని నమ్ముతున్నానని ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆశాభావం వ్యక్తం చేశారు. 

Also Read: NASA: మార్చిలో భూమి మీదకు సునీతా విలియమ్స్..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA-China: చైనాకు ట్రంప్ భారీ షాక్..ఏకంగా 104 శాతం..

తాను పట్టుకున్న కుందేలుకు మూడ కాళ్ళు అన్నట్టు వ్యవహరిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఎవరైనా తగ్గాల్సిందే కానీ తాను తగ్గేదే లే అంటున్నారు. తాజాగా చైనాపై ఏకంగా 104 శాతం సుంకాలను పెంచుతూ నిర్ణయం తీసుకుని..ఆ దేశానికి షాక్ ఇచ్చారు.  

New Update
tariffs

USA-China

అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరి పోయింది.  చైనా వెనక్కు తగ్గకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదని ట్రంప్ మూడు రోజుల నుంచి హెచ్చరిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇవాళ ఆ దేశంపై విధిస్తున్న సుంకాలను 104 శాతం పెంచి భారీ షాక్ ఇచ్చారు. ఇవి ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి వస్తాయని వైట్ హౌస్ కార్యదర్శి ప్రకటించారు. 

ముందే హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు..

రీసెంట్ గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార సుంకాల్లో భాగంగా చైనాపై 54 శాతం సుంకాలను విధింారు. దీనికి ప్రతిగా ఆ దేశం కూడా అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువులపై 34శాతం అదనపు సుంకాలను విధిస్తున్నట్టు ప్రకటించింది. అయితే దీనిపై ట్రపం మండిపడ్డారు చైనా తప్పు చేస్తోందని హెచ్చరించారు. ఏప్రిల్ 8లోగా సుంకాలను తగ్గించకపోతే 50శాతం పెంచుతామని చెప్పారు. అన్నట్టుగానే ఇప్పుడు ఈరోజు చైనాపై ఏకంగా 104 శాతం మేర టారీఫ్ లను విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

today-latest-news-in-telugu | usa | china | trump tariffs

Also Read: PBKS VS CSK: పంజాబ్ విజయం..ఇక చెన్నై ఇంటికే..

 

Advertisment
Advertisment
Advertisment