/rtv/media/media_files/2025/01/22/wIQhHEdfF3QlAyMRBxQZ.jpg)
Cancer and AI Technology
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. ఇలాంటి ప్రాణాంతకర వ్యాధిని నయం చేసే ఓ కృత్రిమ మేధ ప్రాజెక్టును అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఒరాకిల్ సీటీఓ ల్యారీ ఎల్లిసన్, ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్, సాఫ్ట్బ్యాంక్ సీఈఓ మసయోషి సన్ తదితరులు పాల్గొన్నారు. క్యాన్సర్ను గుర్తించిన 48 గంటల్లోనే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI) సాయంతో వ్యాక్సిన్ను తయారుచేసి ఇవ్వొచ్చని ఈ కంపెనీలు చెబుతున్నాయి.
Also Read: జన్మతః పౌరసత్వం రద్దు.. కోర్టుల్లో సవాలు చేసిన 22 రాష్ట్రాలు
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఒరాకిల్,సాఫ్ట్ బ్యాంక్, ఓపెన్ ఏఐ కంపెనీల భాగస్వామ్యంతో స్టార్గేట్ అనే వెంచర్ ప్రారంభమైంది. అయితే ఈ కొత్త కంపెనీ ద్వారా ఏఐ మౌళిక సదుపాయాల్లో 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతామని ట్రంప్ ప్రకటించారు. మరోవైపు ఈ ప్రాజెక్టు కింద టెక్సాస్లో డేటా సెంటర్ల సాయంతో ఏఐలో కొత్త ఆవిష్కరణలు చేసేందుకు ఈ కంపెనీలు సిద్ధమవుతున్నాయి దీనికోసం టెక్సాస్లో 10 డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. త్వరలో వీటి సంఖ్య 20కి పెరగనుంది.
ఈ నేపథ్యంలో ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్మన్ మాట్లాడారు. ఈ ప్రాజెక్టు వల్ల అమెరికాలో లక్షలాది ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. ఈ ఏఐ సాయంతో క్యాన్సర్ను వేగంగా గుర్తించడంతో పాటు దాన్ని నయం చేసే అవకాశం లభించనుందని పేర్కొన్నారు. మరోవైపు అమెరికా స్వర్ణ యుగానికి ఈ ప్రాజెక్టు ఒక ఆరంభమని సాఫ్ట్ బ్యాంక్ సీఈవో మసయోషి తెలిపారు.
Also Read: అమెరికా నుంచి అక్రమ వలసదారులు ఔట్.. సాధ్యమవ్వడం కష్టమే!
ఆ తర్వాత ఒరాకిల్ సీఈవో ల్యారీ ఎల్లిసన్ మాట్లాడారు. '' క్యాన్సర్కు చెందిన చిన్న చిన్న ట్యూమర్స్ మానవ రక్తంలో తెలుతూ ఉంటాయి. ఏఐ సాయంతో వాటిని మనం ముందుగానే గుర్తించవచ్చు. దీంతో వెంటనే బ్లడ్ టెస్ట్ చేయించుకొని క్యాన్సర్ను తొందరగానే నిర్ధారించుకోవచ్చు. ఆ కణాలకు గుర్తించిన తర్వాత ఆ వ్యక్తకి వ్యాక్సిన్ ఇవ్వాలి. వ్యాధి తీవ్రత ప్రకారం ఒక్కో వ్యక్తికి ప్రత్యేకంగా టీకాను అభివృద్ధి చేయాలి. అయితే MRNA వ్యాక్సిన్లను ఏఐ సాయంతో రోబోటిక్ సాంకేతికతను వినియోగించి 48 గంటల్లోనే తయారుచేసే వీలు ఉంటుందని'' తెలిపారు.