Earthquake in Bangkok: బ్యాంకాక్‌లో భూకంపం ఎఫెక్ట్.. ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం

బ్యాంకాక్‌లో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. రిక్టర్ స్కేల్‌పై 7.3 తీవ్రత నమోదైంది. దీంతో థాయ్‌లాండ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకాక్‌లో అత్యవసర పరిస్థితి (Emergency)ని ప్రకటించింది.

New Update
Emergency in bangkok

Emergency in bangkok

Earthquake in Bangkok: బ్యాంకాక్‌లో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. రిక్టర్ స్కేల్‌పై 7.3 తీవ్రత నమోదైంది. దీంతో థాయ్‌లాండ్‌ ప్రభుత్వం(Thailand Government) కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకాక్‌లో అత్యవసర పరిస్థితి (Emergency)ని ప్రకటించింది. ఈ భూకంపం ధాటికి పలు బిల్డింగ్స్ ఊగిపోయాయి. ఓ బహుళ అంతస్తుల భవనం నేలమట్టమైంది. చుట్టుపక్కల జనం భయంతో రోడ్లమీదికి పరుగులు తీశారు. జర్మనీకి చెందిన GFZ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ శుక్రవారం మధ్యాహ్నం భూకంపం సంభవించిదని ప్రకటన చేసింది.

Also Read: విమానంలో మహిళలతో యువకుడి అసభ్య ప్రవర్తన.. దిగగానే ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!

రిక్టర్‌ స్కేల్‌పై 7.7గా

సెంట్రల్ మయన్మార్‌లోని మోనివా సిటీకి తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. 12 నిమిషాల వ్యవధిలోని మయన్మార్‌లో రెండు సార్లు భారీ భూకంపాలు సంభవించాయి. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 7.7గా నమోదైంది. దీని ప్రభావంతోనే థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో రెండుసార్లు తీవ్ర ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంపం ధాటికి మయన్మార్‌లో ఇప్పటిదాకా 20మంది మృతిచెందినట్లు అక్కడి లోకల్ మీడియా తెలిపింది. అనేకమంది గాయాలపాలైనట్లు చెప్పింది. మృతుల సంఖ్య ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: అమెరికాతో ఆ బంధం ముగిసింది.. ఇక ప్రతి చర్య తప్పదు: కెనడా!

ఈ భూకంప ప్రభావం ఆగ్నేసియా దేశాలపై కూడా కనిపించింది. భారత్‌లోని ఢిల్లీ ఎన్సీర్, కోల్‌కతా, ఇంఫాల్, మేఘాలయాలో స్వల్పంగా ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు.మేఘాలయ ఈస్ట్‌గారో హిల్స్‌ రిక్టర్ స్కేల్‌పై 4 తీవ్రతతో ప్రకంపనలు సంభవించాయి. బంగ్లాదేశ్‌లో 7.3 తీవ్రతతో భూమి కంపించినట్లు సమాచారం.  

Also Read: విమానంలో మహిళలతో యువకుడి అసభ్య ప్రవర్తన.. దిగగానే ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!

Also Read: బ్రెయిన్‌లో ప్లాస్టిక్ చెంచా.. డేంజర్ జోన్‌లో చూయింగ్‌గమ్ తినేవాళ్లు!

telugu-news | rtv-news | earthquake

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Fire Accident : టెస్లా షోరూంలో అగ్ని ప్రమాదం...17 కార్లు దగ్ధం.. వారి పనే అంటున్న మస్క్

ప్రంపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ప్రముఖ ఎలక్ర్టిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా షోరూంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఇటలీలోని రోమ్ శివార్లలో ఉన్న షోరూంలో ఈ ఘటన చోటు చేసుకుంది.. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో 17 కార్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.

New Update
Fire At Tesla Dealership

Fire At Tesla Dealership

Fire Accident: ప్రంపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ప్రముఖ ఎలక్ర్టిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా షోరూంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఇటలీలోని రోమ్ శివార్లలో ఉన్న షోరూంలో ఈ ఘటన చోటు చేసుకుంది.. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో 17 కార్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

ఇది కూడా చూడండి: ఈ రాశివారు నేడు వివాదాలకు దూరంగా ఉంటే బెటర్‌!

ఇటలీలోని రోమ్ నగర శివార్లలోని టెస్లా షోరూంలో సోమవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది.షార్ట్‌ సర్య్కూట్‌ లేదా ఇతర కారణాలతో  షోరూం అంతా కాలిపోయింది. ఫలితంగా అందులో ఉన్న 17 కార్లు పూర్తిగా కాలిపోయాయి. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. హుటాహుటిన రంగంలోకి దిగారు. ఫైర్ ఇంజిన్ల సాయంతో సిబ్బంది మంటలను ఆర్పారు. అయితే ఉదయం 4.30 గంటలకు మంటలు అంటుకున్నాయని.. అదృష్ట వశాత్తు షోరూంలో ఎవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పిందని అగ్నిమాపక సిబ్బంది ఓ ప్రకటనలో తెలిపింది.

ఇది కూడా చూడండి: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!

అయితే ఈ విషయం తెలుసుకున్న మస్క్ తాజాగా స్పందించారు. ఇది కావాలనే ఉగ్రవాదులు చేశారని ఆరోపించారు. తమ సంస్థ కేవలం ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే తయారు చేస్తోందని.. ఈ స్థాయిలో హింస చాలా పెద్ద తప్పని వ్యాఖ్యానించారు. మరోవైపు ఇటలీ ఉప ప్రధాని మాటియో సాల్విని సైతం దీనిపై స్పందించి మస్క్‌కు మద్దతు తెలిపారు. టెస్లా కంపెనీపై కావాలని దాడులు చేయడం దారుణం అన్నారు. ఇకనైనా ఈ దాడులు ఆపాలని కోరుతున్నట్లు చెప్పారు. అలాగే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌..  రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ను డోజ్ అధినేతగా నియమించారు. ఇక అప్పటి నుంచి వీరిద్దరూ కలిసి.. అనేక షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు.. దీంతో వారికి అనేక మంది శత్రువులవుతున్నారు. ఈక్రమంలోనే స్థానిక ప్రజల నుంచి ఉగ్రవాదుల వరకు వీరిపై కోపంగా ఉన్నారు. అందుకే పగ తీర్చుకోవాలని ఎలాన్ మస్క్ కంపెనీపై దాడులు చేస్తున్నారు. అమెరికాతో పాటు అనేక దేశాల్లో ఈ దాడులు సాగుతున్నాయి. ఇటీవలే ట్రంప్ సైతం దీనిపై స్పందించి.. టెస్లా కార్లపై దాడికి పాల్పడితే 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తామని హెచ్చరించారు.

ఇది కూడా చూడండి: బోణీ కొట్టిన ముంబై..ఐపీఎల్ లో మరో రికార్డ్

Advertisment
Advertisment
Advertisment