TESLA: దారుణంగా టెస్లా అమ్మకాలు...మూడేళ్ల కనిష్టానికి..

ట్రంప్ కు మేలు చేయాలని అనుకుని తనకు తానే కన్నం పెట్టుకుంటున్నాడు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. DOGE ద్వారా తీసుకున్న నిర్ణయాలతో ప్రజల వైపు నుంచి వ్యతిరేకత మూటగట్టుకున్నాడు. ఇప్పుడు అది టెస్లా మీద ప్రభావం చూపిస్తోంది. అమ్మకాలు బాగా తగ్గిపోయాయి.

New Update
Tesla Seeks Certification For Model Y And Model 3 To Enter Indian Market

Tesla Seeks Certification For Model Y And Model 3 To Enter Indian Market

అమెరికాలో టెస్లా మీద వ్యతిరేకత చాలా ఎక్కువైంది. ఎలాన్ మస్క్ ట్రంప్ ప్రభుత్వంలోకి వచ్చాక ఆయన తీసుకున్న నిర్ణయాల మీద యూఎస్ ప్రజలు గుర్రుగా ఉన్నారు. ఫెడరల్ ఉద్యోగాలు తగ్గించేయడం, పెద్ద పెద్ద సంస్థలను మూసేయడం లాంటివి ఆయన మీద వ్యతిరేకత పెరిగేలా చేశాయి. దాని ప్రభావం మస్క్ వ్యాపారాల మీద కూడా పడింది. ఎలాన్ మస్క్ మీద వ్యతిరేకతను చాలా మంది టెస్లా మీద చూపిస్తున్నారు. కొత్తగా కొనుక్కోవాలనుకున్నవాళ్ళు మానేస్తున్నారు. ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు కూడా అమ్మేస్తున్నారు. మరోవైపు కొత్తగా వస్తున్న మోడళ్ళ వైపు కూడా మొగ్గు చూపుతున్నారు. ఇవన్నీ కలిపి టెస్లా విక్రయాలు పడిపోవడానికి కారణమయ్యాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. 

అస్సలు అందుకోలేకపోయింది..

జనవరి నుంచి మార్చి వరకు టెస్లా విక్రయాలు 13 శాతం మేర క్షీణించి మూడేళ్ల కనిష్ఠానికి చేరాయి. దీని ప్రభావం వల్ల స్టాక్ మార్కెట్లో కూడా టెస్లా షేర్లు 6 శాతం పతనం అయ్యాయి. గతేడాది జనవరి- మార్చి త్రైమాసికంలో టెస్లా 3,86,810 యూనిట్లను విక్రయించింది. గతేడాదితో పోలిస్తే విక్రయాలు తగ్గినా 3.72 లక్షల కార్లు అమ్ముడయ్యే అవకాశం ఉందని అందరూ అంచనాలు చేశారు. కానీ ఈ మూడు నెల్లో కేవలం 3,36,681 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.  లాస్ట్ ఇయర్ కంటే ఈ ఏడాది 20 నుంచి 30 శాతం వృద్ధిని నమోదు చేస్తామని మస్క్ మాటిచ్చారు. కానీ ఆ అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయారు. దీంతో కంపెనీ షేర్లు కూడా పతనం అయ్యాయి. 

మరోవైపు ఎలక్ట్రానిక్ కార్లలో చైనాకు చెందిన బీవైడీ, యూరప్‌కు చెందిన ఫోక్స్‌వ్యాగన్‌, బీఎండబ్ల్యూ లు కొత్తవి మార్కెట్లోకి దూసుకొస్తున్నాయి. ఇవి టెస్లాకు గట్టి పోటీనిస్తున్నాయి. దీని వలన విదేశాల్లో టెస్లా కార్లను కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. విద్యుత్‌ కార్ల విక్రయాల్లో టెస్లాను బీవైడీ దాటేసినట్లు కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌  చెబుతోంది. 

 

today-latest-news-in-telugu | elon-musk | tesla | sales

Also Read: Cricket: ఈ ఏడాది టీమ్ ఇండియా షెడ్యూల్ విడుదల

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: అమెరికాకు ఎగుమతులను ఆపేస్తున్న బడా కంపెనీల కార్లు..జాగ్వార్, ల్యాండ్ రోవర్ బ్రేక్

ట్రంప్ సుంకాల దెబ్బ గట్టిగానే పడుతోంది. కార్ల మీద కూడా దీని ఎఫెక్స్ చూపిస్తోంది. పెద్ద కంపెనీలు తమ కార్ల ఎగుమతులపై ఆలోచిస్తున్నారు. తాజాగా జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్ బ్రిటిష్‌లో తయారయ్యే కార్లను అమెరికాకు ఎగుమతి చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేయనుంది.

New Update
usa

JLR cars

జాగ్వారా, ల్యాండ్ రోవర్ బిట్రన్ లో తయారయ్యే కార్లు. టాటా మోటార్స్ కు చెందిన లగ్జరీ కార్లు ఇవి. బ్రిటన్‌లో అతిపెద్ద కార్ల తయారీ సంస్థల్లో ఒకటైన జేఎల్‌ఆర్‌ సంస్థ..  బ్రిటన్‌లో సుమారు 38 వేలమందికి ఉపాధి కల్పిస్తోంది. ఇప్పుడు ఈ కంపెనీ తమ కార్లను అమెరికాకు ఎగుమతి చేయడాన్ని నెల పాటూ ఆపాలని నిర్ణయించుకుంది. రీసెంట్ గా అమెరికా అధ్యక్షుడు తమ దేశంలోకి దిగుమతయ్యే వాహనాలపై 25శాతం టారీఫ్ లను విధించారు. దీంతో టాటా జాగ్వార్ తమ కార్ల ఎగుమతులను నెలపాటూ ఆపేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ది టైమ్స్ చెబుతోంది. సుంకాలను ఎలా తగ్గించుకోవాలని ఆలోచించడానికే ఈ బ్రేక్ తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ఆలోచనలో పడ్డ అన్ని కంపెనీల కార్లు..

జెఎల్ ఆర్ ఒక్కటే కాదు..ఇతర దేశాల్లో తయారయ్యే అన్ని కార్ల కంపెనీలు ఇదే ఆలోచనలో పడ్డాయని చెబుతున్నారు. అయితే జే ఎల్ ఆర్ ఇప్పటికే మరో రెండు నెలలకు సరిపడా కార్లను అమెరికాకు ఎగుమతి చేసేసింది. అందుకే ఇప్పుడు నెల గ్యాప్ తీసుకున్నా పర్వాలేదని భావిస్తోంది. ఈ నెలలో సుంకాల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవచ్చని అనుకుంటోంది. 2024 మార్చి వరకు 12 నెలల వ్యవధిలో జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ 4.30 లక్షల వాహనాలను విక్రయించగా.. అందులో నాలుగో వంతు అమెరికాలో అమ్ముడయ్యాయి. మరోవైపు ట్రంప్ ప్రకటించిన టారీఫ్ లవలన టాటా మోటార్స్ షేర్లు బాగా పడిపోయాయి.   

 today-latest-news-in-telugu | cars | tata-motors

Also Read: USA: అమెరికాకు సుంకాల దెబ్బ..ధరల పెరుగుతాయని స్టోర్లకు పరుగెడుతున్న జనాలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు