Suicide in USA: 'అయ్యో బిడ్డా'.. అమెరికాలో తెలుగు స్టూడెంట్ సూసైడ్.. పంపించేస్తారన్న భయంతో..!

ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన ఓ తెలుగు విద్యార్థి అక్కడ సూసైడ్ చేసుకోవడం కలకలం రేపుతోంది. సాయి కుమార్ రెడ్డి అనే విద్యార్థి న్యూయార్క్‌లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. డిపోర్టేషన్ భయంతో అతడు ఈ అఘాయిత్యం చేసుకున్నట్లు తెలుస్తోంది.

New Update
death

death

ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన ఓ తెలుగు విద్యార్థి అక్కడ సూసైడ్ చేసుకోవడం కలకలం రేపుతోంది. సాయి కుమార్ రెడ్డి అనే విద్యార్థి న్యూయార్క్‌లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. సాయి కుమార్‌ న్యూయార్క్‌లోని పార్ట్‌టైమ్ జాబ్ చేస్తూ స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. అయితే ఇటీవల ఫెడరల్ అధికారులు తనిఖీలు చేయగా సాయుకమార్‌ పాస్‌పోర్టును సీజ్ చేశారు. దీంతో భయాందోళనకు గురైన ఆ యువకుడు తాను పనిచేస్తున్న చోటే ఆత్మహత్య చేసుకున్నాడు. 

Also Read: కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించిన పాకిస్థాన్ హిందువులు

అయితే సాయికుమార్ ఆత్మహత్య చేసుకున్న విషయం కుటుంబ సభ్యులకు కూడా తెలియలేదని తెలుస్తోంది. అతడి స్నేహితులు అమెరికా నుంచి తెలుగు టీవీ ఛానళ్లకు ఈ సమాచారం అందించగా.. ఓ మీడియా ఛానల్ ఈ ఘటన గురించి ప్రసారం చేసింది. సాయి కుమార్ కుటుంబ సభ్యుల వివరాలు తెలియకపోవడంతో ఈ సమాచారం వాళ్లకి అందించలేకపోయామని అతడి స్నేహితులు చెప్పారు. రెండు రోజుల క్రితం అమెరికా నుంచి భారతీయ అక్రమ వలసదారును పంజాబ్‌లోని అమృత్‌సర్‌ ఎయిర్‌పోర్టుకు తరలించిన సంగతి తెలిసిందే. 

అమెరికాలో మరో 18 వేల మంది భారతీ అక్రమ వలసదారులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సాయి కుమార్‌ రెడ్డి వద్ద పాస్‌పోర్టు లేకపోవడంతో బలవంతంగా భారత్‌కు పంపిస్తారనే భయంతో సూసైడ్ చేసుకున్నట్లు అతడి స్నేహితులు చెబుతున్నారు. రెండు రోజుల క్రితమే అమెరికా నుంచి అక్రమంగా వలస వెళ్లిన వారిని అమృత్‌సర్‌కు తిప్పి పంపారు. మరో 18వేల మందిని గుర్తించినట్టు కథనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో సాయికుమార్‌ రెడ్డి పాస్‌పోర్ట్‌ లేకపోవడం, బలవంతంగా భారత్‌కు తిప్పి పంపుతారనే ఆందోళనతో ఆత్మహత్యకు పాల్పడినట్టు స్నేహితులు చెబుతున్నారు. సాయి కుమార్ గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. అమెరికాలో డిపోర్టేషన్ వేటుపై అక్కడ ఉంటున్న భారతీయ వలసదారులు ఆందోళన చెందుతున్నారు. 

Also Read: కెనడాలో 20 వేల మంది ఇండియన్ స్టూడెంట్స్ మిస్సింగ్.. వారంతా ఎక్కడ?

 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pakistan-Bharat: భారత్‌ కోసమే 130 అణుబాంబులు..పాక్ రైల్వే మంత్రి సంచలన వ్యాఖ్యలు!

పాకిస్థాన్ రైల్వే మంత్రి హనీఫ్ అబ్బాసి భారతదేశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 130 అణు బాంబులను భారతదేశం కోసమే ఉంచుకున్నామని రెచ్చగొట్టేలా మీడియా ముందు మాట్లాడారు.భారత్‌ తీసుకునే నిర్ణయాలకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు.

New Update
pak railway min

pak railway min

పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్‌ నిలిపివేయడం వల్ల పాకిస్థాన్ తీవ్ర కలత చెందింది. ప్రతిరోజు ఆ దేశానికి చెందిన నాయకులు ఏదో ఒక ప్రకటన విడుదల చేస్తూనే ఉన్నారు. భారతదేశం ప్రతీకార చర్యకు పాకిస్థాన్ భయపడుతుందని అర్థమవుతోంది. తాజాగా పాకిస్థాన్ రైల్వే మంత్రి హనీఫ్ అబ్బాసి భారత్‌ ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read:  Karreguttalu: బాంబులు, కాల్పుల మోతతో దద్దరిల్లుతున్న కర్రెగుట్టలు!

రావల్పిండిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారతదేశం పాకిస్థాన్‌కు నీటిని నిలిపివేస్తే, దానికి తగిన సమాధానం ఇస్తామని అన్నాడు.“మా క్షిపణులన్నీ భారతదేశం వైపునకు సిద్ధంగా ఉన్నాయని హనీఫ్ అబ్బాసి అన్నాడు. భారతదేశం ఏదైనా సాహసోపేతమైన చర్య తీసుకోవాలని నిర్ణయించుకుంటే.. దానికి మూల్యం చెల్లించాల్సి ఉంటుందని. తమ దగ్గర ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అణు బాంబులు ఉన్నాయని హెచ్చరించాడు.

Also Read: TTD: వేసవి సెలవుల్లో వీఐపీ, సిఫార్సు లేఖలతో తిరుమల వెళ్తున్నారా.. అయితే మీకో చేదువార్త!

తాము గోరీ, షాహీన్, ఘజ్నవి వంటి క్షిపణులను, 130 అణు బాంబులను భారతదేశం కోసమే ఉంచుకున్నామని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. దౌత్యపరమైన ప్రయత్నాలతో పాటు, తమ సరిహద్దులను రక్షించుకోవడానికి తాము పూర్తి సన్నాహాలు చేస్తున్నామన్నాడు. పహల్గాం దాడి కేవలం ఒక సాకు మాత్రమే అని.. సింధు జల ఒప్పందాన్ని రద్దు చేయాలని భారత్ ఎప్పటినుంచో ప్లాన్ చేస్తుందని ఆరోపించాడు.

పాకిస్థాన్ సైన్యం అవసరం అనిపించినప్పుడల్లా రైల్వేను ఉపయోగించుకోవచ్చని హనీఫ్ ప్రకటించాడు. పాకిస్థాన్ రైల్వేలు సైన్యానికి సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయని పేర్కొన్నాడు. 

Also Read: Pak-India: మాటమార్చిన పాక్ ప్రధాని...దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చిన కశ్మీర్‌ సీఎం!

Also Read: India-Pakistan: మేం ఆయుధాలు లేని సైనికులం..పోరాడేందుకు ఎప్పుడూ సిద్ధమే!

pakistan | bharat | nuclear-bomb | pak | railway | minister | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment