Taliban: అఫ్గాన్ మహిళలకు మరో షాక్.. తాలిబన్ల కొత్త రూల్

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు మరో కొత్త రూల్‌ను ప్రవేశపెట్టారు. ఇళ్లల్లో మహిళలు బయటివారికి కనిపించకుండా కీటికీలు కూడా ఏర్పాటుచేయొద్దని ఆదేశించారు. మహిళలు తిరిగే వంట గదుల్లో గానీ, బావుల వద్ద గానీ ఎలాంటి కిటికీలు కూడా ఉండొద్దని తేల్చిచెప్పారు.

New Update
Afghanisthan women

Afghanisthan women

2021 ఆగస్టులో అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు తమ ఆధినంలోకి తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అప్పటినుంచి తాలిబన్లు అఫ్గాన్‌ ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. ముఖ్యంగా మహిళలను దారుణంగా అణిచివేస్తున్నారు. వాళ్లకి కనీస స్వేచ్ఛ లేకుండా కూడా చేస్తు్న్నారు. మహిళలకు సంబంధించి తాజాగా మరో కొత్త రూల్‌ను ప్రవేశపెట్టారు. ఇళ్లల్లో మహిళలు బయటివారికి కనిపించకుండా కీటికీలు కూడా ఏర్పాటుచేయొద్దని తాలిబన్ పాలకులు ఆదేశించారు.    

Also Read: నాకూ తగ్గించాలనే ఉంది..పన్ను మినహాయింపుపై నిర్మలా సీతారామన్

ఇంటి లోపల మహిళలు తిరిగే వంట గదుల్లో గానీ, బావుల వద్ద గానీ ఎలాంటి కిటికీలు ఏర్పాటుచేయకూడదని తేల్చిచెప్పారు. మహిళలు కనిపించకుండా ఉండేందుకు గోడలు కట్టాలని చెప్పారు. కొత్తగా నిర్మించబోయే ఇళ్లల్లో ఈ రూల్‌ తప్పనిసరిగా అమలు చేయాలని తాలిబన్‌ సుప్రీం లీడర్‌ ఆదేశించారు. ఒకవేళ ఇప్పటికే మహిళలు బయటకు కనిపించేలా నిర్మాణాలు ఉంటే ఈ రూల్‌ ప్రకారం వాటిలో మార్పులు చేయాలన్నారు. ఇలాంటి చెత్త రూల్‌ వల్ల అఫ్గాన్‌ మహిళలను మరింత అణిచివేతకు గురిచేస్తున్నారని వివిధ దేశాల ప్రజలు తాలిబన్లపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.    

Also Read: అర్చకులకు నెలకు రూ.18 వేలు.. కేజ్రీవాల్ సంచలన ప్రకటన

ఇదిలా ఉండగా.. 2021లో అఫ్గానిస్థాన్‌ ఉన్న ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేసి తాలిబన్లు అధికారాన్ని స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వాళ్లు మహిళల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. మహిళలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటే పురుషుల తోడు లేకుండా వెళ్లకూడదు. బాలికల సెకండీ స్కూళ్లు కూడా మూసేయాలని, అసలు మహిళలు ఉద్యోగాలు చేయకూడదని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు మహిళలు ఉన్న చదువులు చదువుకోవడం, ఈద్ వేడుకల్లో పాల్గొనడం, జిమ్, పార్కుల్లోకి కూడా వెళ్లడంపై నిషేధం విధించారు. తాలిబన్లు పెట్టిన ఈ ఆంక్షలపై ఇప్పటికే ఐక్యరాజ్య సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది స్త్రీల పట్ల దారుణమైన వివక్ష అంటూ ధ్వజమెత్తింది. అయినప్పటికీ తాలిబన్ పాలకుల్లో ఎలాంటి మార్పులు రావడం లేదు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Canada: కెనడా రాజకీయాల్లో కొత్త ట్రెండ్

ఏప్రిల్ 28న కెనడాలో 45వ సమాఖ్య ఎన్నికలు జరగనున్నాయి. పంజాబీ-కెనడియన్ రాజకీయ నాయకులు చాలా కాలంగా రాజకీయ ముఖచిత్రంగా ఉన్నారు. అయితే ఈసారి గుజరాతీ సంతతికి చెందిన నలుగురు అభ్యర్థులు పార్లమెంటు స్థానాలకు పోటీ చేస్తున్నారు.

New Update
canada

canada

కెనడాలో ఏప్రిల్ 28న 45వ ఫెడరల్ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో చాలా ఆసక్తికరమైన మార్పులు కనపడతున్నాయి. కెనడాలోని భారతీయుల్లో మార్పు చాలా స్పష్టంగా కనపడుతుంది. చాలా సంవత్సరాలుగా పంజాబీ-కెనడియన్ రాజకీయ నాయకులు కెనడా రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. మంత్రులుగా, నాయకులుగా, పార్టీ ప్రతినిధులుగా వారు రాణించారు. కానీ ఈసారి కొత్తగా గుజరాతీయులు కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు. బ్రాంప్టన్ నుంచి కాల్గరీ వరకు గుజరాత్ మూలాలు ఉన్న నలుగురు అభ్యర్థులు మొదటిసారిగా పార్లమెంటు స్థానాలకు పోటీ చేస్తున్నారు. 

Also Read: Ap weather Report: బంగాళాఖాతంలో అల్పపీడనం...ఏపీలో వర్షాలు..

వీరంతా మొదటి తరం కెనడా వలసదారులు. పంజాబీ రాజకీయ నాయకులు చాలా అనుభవం ఉన్నవారు. వారి గురించి అందరికీ తెలుసు. ఎన్నికల్లో గెలిచేందుకు వారి దగ్గర వ్యూహాలు కూడా ఉన్నాయి. కానీ గుజరాతీ అభ్యర్థులు కూడా తమకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంటున్నారు. వీరు చాలా కాలంగా వ్యాపారాల్లో, సామాజిక సేవలో ఉన్నారు. జయేష్ బ్రహ్మభట్ బ్రాంప్టన్ చింగుయాకూసి ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్లి ప్రజలను కలుస్తున్నారు. ఆయన చాలా నమ్మకంగా కనిపిస్తున్నారు. బ్రహ్మభట్ ఒకప్పుడు సివిల్ ఇంజనీర్. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించారు. 

Also Read: Musk-Trump: ఆయనో మూర్ఖుడు..ట్రంప్‌ సలహాదారుడి పై మస్క్‌ సంచలన వ్యాఖ్యలు!

2001లో గుజరాత్ నుంచి కెనడాకు వచ్చారు. చాలా మంది వలసదారుల జీవితం ఇలాగే ఉంటుంది. మొదట చిన్న దుకాణాలు నడుపుతారు. ఆ తర్వాత ఆస్తులు కొంటారు. చివరికి రియల్ ఎస్టేట్‌లో మంచి పేరు తెచ్చుకుంటారు. ఇప్పుడు ఆయన పీపుల్స్ పార్టీ టికెట్‌పై పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు. ఆయన కెనడా వచ్చి రెండు దశాబ్దాలు దాటింది. బ్రహ్మభట్ మాట్లాడుతూ, "మేము స్వేచ్ఛ, బాధ్యత, న్యాయం, అందరికీ గౌరవం కోసం నిలబడతాం. ఇది నాకు నచ్చింది. నేను చాలా మందితో మాట్లాడాను. ఈ ఎన్నికల్లో మార్పు కోరుకుంటున్నట్లు చెప్పారు" అని అన్నారు. 

బ్రహ్మభట్ లాంటి వారు రాజకీయాల్లోకి రావడానికి ఒక కారణం ఉంది. రాజకీయ పార్టీలు భారతీయులను ఒక ముఖ్యమైన ఓటు బ్యాంకుగా అనుకుంటున్నాయి. గుజరాతీలు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ సమస్యలను వినిపించాలని అనుకుంటున్నారు.ఈ ఎన్నికల్లో నలుగురు గుజరాతీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వారిలో సంజీవ్ రావల్ ఒకరు. ఆయన లిబరల్ పార్టీ టికెట్‌పై కాల్గరీ మిడ్‌నాపూర్ నుండి పోటీ చేస్తున్నారు. ఆయన టాంజానియాలో జన్మించారు. 20 ఏళ్లుగా కాల్గరీలో ఉంటున్నారు. డాన్ పటేల్ కూడా ఒకప్పుడు కన్జర్వేటివ్ పార్టీ తరపున ఎటోబికో నార్త్ నుండి పోటీ చేయనున్నారు. కానీ ఆయనతో పాటు మరో ముగ్గురు అభ్యర్థులను పార్టీ పక్కనపెట్టింది. 

అశోక్ పటేల్, మినేష్ పటేల్ ఇద్దరూ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. అశోక్ పటేల్ ఎడ్మంటన్ షెర్‌వుడ్ నుంచి పోటీ చేస్తుండగా.. మినేష్ పటేల్ కాల్గరీ స్కైవ్యూ నుండి పోటీ చేస్తున్నారు. వీరెవరికీ రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేదు. వీరందరిదీ ఒకే నేపథ్యం. మొదట వ్యాపారాలు ప్రారంభించి.. తర్వాత సమాజానికి సేవ చేశారు. ఇప్పుడు చట్టాలు రూపొందించడంలో తమ వంతు పాత్ర పోషించాలని అనుకుంటున్నారు.

ఒట్టావాలోని ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా కెనడా లో అంతర్జాతీయ వాణిజ్య డైరెక్టర్ అయిన హేమంత్ షా ఈ మార్పును గమనించారు. ఆయన విన్నిపెగ్‌లో చాలా కాలంగా ఉంటున్నారు. సమాజంలో ఆయనకు మంచి పేరు ఉంది. హేమంత్ షా మాట్లాడుతూ, "కెనడాలో లక్ష మందికిపైగా గుజరాతీలు ఉన్నారు. టొరంటో, మోంట్రియల్, ఒట్టావా, కాల్గరీ, వాంకోవర్ వంటి పెద్ద నగరాల్లో గుజరాతీలు ఎక్కువగా ఉన్నారు. చాలా మంది వలసదారులుగా వచ్చారు. 

మరికొందరు విద్యార్థులుగా వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. నేను కెనడాలో 40 ఏళ్లుగా ఉంటున్నాను. ఈ ఎన్నికల్లో గుజరాతీ అభ్యర్థులు ఎక్కువగా పోటీ చేస్తున్నారు. వారు గెలిచినా ఓడినా.. ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. పంజాబీల తర్వాత గుజరాతీలే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి వారికి ప్రాతినిధ్యం ఉండటం చాలా అవసరం" అని అన్నారు.

Also Read: TTD: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. 3 రోజులు ఆర్జిత సేవలు రద్దు

Also Read: Bank Merger: మే 1 నుంచి ఏపీలో ఆ బ్యాంకులు కనిపించవ్..

 canada | canada india | canada india news | canada-india-relations | elections | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment