సడెన్‌గా విమానంలో చెలరేగిన మంటలు.. భయాందోళనలో ప్రయాణికులు

దక్షిణ కొరియాలో 176 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం మంటల్లో చిక్కుకుంది. బుసాన్ విమానాశ్రయం నుంచి విమానం టేకాఫ్ అవుతుండగా.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అధికారులు వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. అందరూ సురక్షితంగా బయటపడ్డారు.

New Update
South Korea flight

South Korea flight Photograph: (South Korea flight)

దక్షిణ కొరియాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల విమానం మంటల్లో చిక్కుకుంది. విమానం టేకాఫ్ చేయడానికి రెడీ అవుతుండగా విమానం వెనుక భాగంలో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ఈ సమయంలో విమానంలో దాదాపుగా 176 మంది ప్రయాణికులు ఉన్నారు. సిబ్బంది వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో పాటు సిబ్బంది అందరూ కూడా సురక్షితంగా బయటపడ్డారు. ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. 

ఇది కూడా చూడండి: Cinema: జానీ మాస్టర్ పై కేసు గెలిచాం..ఫిల్మ్ ఛాంబర్

ఇది కూడా చూడండి: Maha Kumbh Mela :  మహా కుంభమేళాలో తొక్కిసలాట.. అమృత స్నానాలపై అఖండ పరిషత్‌ కీలక నిర్ణయం

హాంకాంగ్‌కు వెళ్తున్న విమానం..

బుసాన్ నుంచి హాంకాంగ్‌కు A321 విమానం వెళ్లడానికి రెడీ అవుతోంది. రాత్రి 10:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే అగ్నిమాపక దళాలు మంటలను అదుపులోకి తీసుకోవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రయాణికులను గాలితో నిండిన స్లయిడ్ ఉపయోగించి ఖాళీ చేయించారు. అయితే ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించారు. అసలు ఒక్కసారిగా విమానంలో మంటలు ఎందుకు వచ్చాయి? దీనికి గల కారణాలు ఏంటనే విషయంపై దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చూడండి: Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి విదేశయాన ప్రయత్నాలు సులభం అవుతాయి..!

ఇదిలా ఉండగా.. గత నెల కూడా ఇలాంటి ప్రమాద ఘటనే దక్షిణ కొరియాలో  జరిగింది. దురదృష్టశాత్తు ఈ ప్రమాదంలో 179 మంది మరణించారు. విమానం ల్యాండింగ్ గేర్ పనిచేయకపోవడం వల్ల మంటలు చెలరేగి మృతి చెందారు.

ఇది కూడా చూడండి: Big Breaking: కుంభమేళాలో తొక్కిసలాట ..17 మంది మృతి!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Srilanka: శ్రీలంకలో ప్రధాని మోదీ.. 11 మంది భారత జాలర్లు విడుదల

శ్రీలంక పర్యటనలో భాగంగా శనివారం ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు కుమార దిసనాయకేతో సమావేశం అయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే తాజాగా భారత్‌కు చెందిన 11 మంది జాలర్లను శ్రీలంక విడుదల చేసింది.

New Update
Pm Modi and Sri Lanka Releases 11 Indian Fishermen As Special Gesture

Pm Modi and Sri Lanka Releases 11 Indian Fishermen As Special Gesture

భారత్, శ్రీలంక మధ్య మత్స్యకారుల విషయంలో తరచుగా గొడవలు జరుగుతుంటాయి. తమ జలాల్లోకి వచ్చారని భారత జాలర్లను శ్రీలంక నౌకదళ సిబ్బంది అరెస్టు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇటీవల ప్రధాని మోదీ తన శ్రీలంక పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య మత్స్యకారుల వివాదాలపై పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉందని చెప్పిన సంగతి తెలిసిందే.  ఈ పరిణామాల నేపథ్యంలోనే తాజాగా భారత్‌కు చెందిన 11 మంది జాలర్లను శ్రీలంక విడుదల చేసింది. 

Also Read: సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్!

శ్రీలంక పర్యటనలో భాగంగా శనివారం ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు కుమార దిసనాయకేతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా యూఏఈతో కలిసి ట్రింకోమలీని ఇంధన కేంద్రంగా అభివృద్ధి చేయడం, పవర్‌గ్రిడ్ ద్వారా అనుసంధానత వంటి ఒప్పందాలు చేసుకున్నారు. శ్రీలంక నిర్బంధంలో ఉన్న భారత మత్స్యకారుల్ని అలాగే వాళ్ల పడవలను విడుదల చేయాలని ప్రధాని మోదీ కోరారు.   

అలాగే శనివారం దిసనాయకేతో కలిసి అనురాధపురలో జయశ్రీ మహాబోధిని సందర్శించారు. ఆ తర్వాత మహో ఒమన్‌తాయ్‌ల మధ్య అప్‌గ్రేడ్‌ చేసినటువంటి రైల్వే్లైన్‌ను దిసనాయకేతో కలిసి ప్రారంభించారు. ఆ తర్వాత భారత్‌కు బయలుదేరారు. శ్రీలంక పర్యటన ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తోందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. 

Also Read: ఫస్ట్ నైట్‌లో వధువు వింత కండీషన్.. గజగజ వణికిపోయిన వరుడు!

ఇదిలాఉండగా శ్రీలంక నుంచి తిరుగు ప్రయాణంలో ప్రధాని మోదీ విమానంలో నుంచే రామసేతును సందర్శించారు. ఎక్స్‌లో దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. '' శ్రీలంక నుంచి వస్తుండగా రామసేతును దర్శించే భాగ్యం కలిగింది. అయోధ్యలో బాలరాముడికి సూర్య తిలకం జరిగినప్పుడే ఇది జరగడం విశేషం. ఈ రెండింటిని చూసే అదృష్టం నాకు దక్కిందని'' ప్రధాని మోదీ రాసుకొచ్చారు.

rtv-news | india | srilanka

Advertisment
Advertisment
Advertisment