Cannibals: ఆకలి తట్టుకోలేక ఒకరినొకరు పీక్కు తింటున్న మనుషులు.. 1300 మందికి పైగా!

దక్షిణాఫ్రికా బంగారు గనుల్లో అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న వారి ఆకలి కేకలు మానవాళిని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. 1కి.మీ లోతు భూగర్భంలోకి వెళ్లిన వారిని బయటకు రప్పించేందుకు పోలీసులు ఆహారం, నీటి సరాఫరాను ఆపేశారు. దీంతో తొటివారినే పీక్కుతింటున్నారట.

New Update
south africa

south africa Photograph: (south africa)

Cannibals: దక్షిణాఫ్రికాలోని బంగారు గనుల అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న వారి ఆకలి కేకలు మానవాళిని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. గనుల్లోకి వెళ్లిన కొంతమంది వ్యక్తులు అక్కడ ఆకలి తట్టుకోలేక వారితో వెళ్లిన వారిని చంపి తింటున్నట్లు వెలుగులోకి రావడం భయాందోళనకు గురిచేస్తోంది. గనుల్లోకి వెళ్తున్న వారిని బయటకు రప్పించేందుకు ఆహారం, నీటి సరఫరాను నిలిపివేశారు పోలీసులు. దీంతో మనుషులు మనుషులను తినే పరిస్థితి ఏర్పడింది. ఒక కిలోమీటర్ భూగర్భంలోకి వెళ్లిన వారిని బయటకు రప్పించేదుకు పోలీసులు చర్యలు చేపట్టగా లోపల ఆకలికి తట్టుకోలేక తోటి వారి శరీర భాగాలను తింటున్నారని గని నుండి బయటకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు చెప్పారు. గనిలో సహచరుల కాళ్లు, చేతులు, పక్కటెముకలను ముక్కలుగా చేసి తిన్నారు. బతకాలంటే ఇది మాకు మిగిలి ఉన్న ఏకైక మార్గమని వారు తెలిపారు.  

Also Read: జూ.ఎన్టీఆర్ను మళ్లీ అవమానించిన బాలయ్య.. ఫొటోలు వైరల్!

క్రిమినల్ ముఠాల హస్తం..

గత వారం రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు చేపట్టగా ఒక లోతైన గనిలోనుంచి 78 మృతదేహాలను బయటకు తీశారు. 246 మంది ప్రాణాలతో బయటపడ్డట్లు పోలీసులు తెలిపారు. ఇక అక్రమదారులకు, ప్రభుత్వానికి మధ్య చాలా కాలంగా వాగ్వాదం జరుగుతోంది. బంగారు గనుల్లోకి ప్రవేశించి బంగారాన్ని వెలికితీసే ప్రమాదకరమైన పనిని కూడా చేస్తున్నారు. ఆగస్ట్‌లో నార్త్ వెస్ట్ ప్రావిన్స్‌లోని బఫెల్‌ఫాంటైన్ బంగారు గని నుంచి వందలాది మంది అక్రమ మైనర్‌లను తిరిగి రప్పించేందుకు ఆహార సరఫరాలను అడ్డుకున్నాం. బంగారం కోసం అక్రమ మైనింగ్ సర్వసాధారణం. అయితే క్రూరమైన క్రిమినల్ ముఠాలు దీని వెనుక ఉన్నాయి. నేరస్తుల కారణంగా గనులు ప్రమాదకరంగా మారుతున్నాయి. దీని కారణంగా లోపలికి వెళ్లలేకపోతున్నాం. అందుకే ఆకలితో అలమటించేలా చేసి ప్రజలను అందులోనుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

పోలీసుల మారణహోమం..

మైనర్లు పెద్ద సంఖ్యలో గనుల్లో చిక్కుకుపోయారని, వారిని బయటకు రాలేని విధంగా బలహీనులుగా మార్చి పోలీసులే చావుకు కారణమయ్యారని స్థానిక ప్రజలు, పలు సంఘాలు ఆరోపించాయి. దీంతో అధికారులు కోర్టు ఆదేశాలతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. రెస్క్యూ సమయంలో గని నుంచి మృతదేహాలను బయటకు తీయడానికి సుదీర్ఘ ప్రక్రియ జరిగింది. అయితే మృతదేహాలు బయటపడటంతో పోలీసుల మారణహోమం అని మండిపడుతున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. అక్రమ మైనర్ల ప్రధాన నాయకుడు జేమ్స్ నియో తోలీ.. అవినీతి అధికారుల సహాయంతో పోలీసు కస్టడీ నుంచి తప్పించుకున్నాడని ఆరోపణల నేపథ్యంలో పోలీసులపై ఒత్తిడి మరింత పెరిగింది. మొత్తంగా ఇప్పటి వరకు 1300 మందికి పైగా మైనర్లు గని నుంచి బయటకు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.

Also Read: Amabati: అవును మాకు దిమాక్ లేదు.. కక్కిన కూటికోసమే కక్కుర్తి: అంబటి సంచలన కామెంట్స్!

గనులు ఖాళీగానే ఉన్నాయి..

దక్షిణాఫ్రికా మైనింగ్ మంత్రి గ్వేడే మాంటాషే మాట్లాడుతూ.. 'ప్రజలు ప్రమాదకరమైన ప్రదేశానికి వెళ్లి మూడు నెలలు ఆకలితో చనిపోతే అది ప్రభుత్వ బాధ్యత ఎలా అవుతుంది?. దక్షిణాఫ్రికా భూమి బంగారం, ప్లాటినం, మాంగనీస్ ఇతర లోహాలతో నిండి ఉంది. దేశంలో 6000 గనులు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. దేశంలో పెద్ద ఎత్తున నిరుద్యోగం ఉంది. దీని కారణంగా ఇక్కడి ప్రజలు ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు' అని గ్వేడే అన్నారు. 

Also Read: Suryapet Murder: చంపింది నాన్నమ్మనే.. ప్రైవేట్‌ పార్ట్స్‌ను కసితీరా తొక్కి.. భార్గవి సంచలన నిజాలు!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

America: వెంటనే వెళ్లిపోండి.. లేదంటే రోజుకు రూ.86 వేలు కట్టండి..!

ట్రంప్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇన్నాళ్లూ వారందరినీ పట్టుకుని.. తిరిగి వారి దేశాలకు యూఎస్‌ పంపిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవేళ వెళ్లకుండా పట్టుబడితో.. రోజుకు రూ.86 వేల జరిమానా విధిస్తామని డీహెచ్‌ఎస్‌ చెప్పింది.

New Update
America migrants

America migrants

అగ్రరాజ్యం అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న వలసదారులపై ట్రంప్ యంత్రాంగం మరింత కఠినమైన చర్యలకు సిద్ధమైంది. ఇప్పటికే వారిపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ సర్కారు.. ఇప్పుడు మరింతగా వారిని వారి దేశాలకు పంపేందుకు సిద్ధమైంది. అక్రమ వలసదారులు తక్షణమే అమెరికా వీడి వెళ్లిపోవాలని లేకపోతే తీవ్రమైన చర్యలు తప్పవని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ నుంచి ఆదేశాలు వెలువడనున్నట్లు తెలుస్తోంది.

Also Read: Telangana: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!

వెళ్లకపోతే రోజుకు రూ.86 వేల జరిమానా విధిస్తామని, అది కూడా కట్టకపోతే వారు ఆస్తులను సైతం జప్తు చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.  అక్రమ మార్గాల్లో అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడే వారిని అమెరికా తిరిగి వారి దేశాలకు పంపిచేస్తున్నారు. చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్నదే అయినా.. ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత దీనిని చాలా కఠినంగా అమలు చేస్తున్నారు. అక్రమ వలసదారులపై చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. 

Also Read: Musk-Trump: ఆయనో మూర్ఖుడు..ట్రంప్‌ సలహాదారుడి పై మస్క్‌ సంచలన వ్యాఖ్యలు!

ట్రంప్ ఆదేశాలతో అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే సెల్ఫ్ డిపోర్టేషన్ యాప్‌ను కూడా తీసుకువచ్చింది అమెరికా. ఈ యాప్ ద్వారా పేరు నమోదు చేసుకుని ఎవరికివారు స్వయంగా దేశం వీడి వెళ్లిపోయే వెసులుబాటు ఉంటుంది.అలా కాకుండా అధికారులు గుర్తిస్తే తమ పద్ధతుల్లో అక్రమ వలదారులను వెనక్కి పంపించాల్సి ఉంటుందని, ఇతర చర్యలు తీసుకుంటామని డీహెచ్ఎస్ అధికార ప్రతినిధి ట్రిసియా మెక్‌లాలిన్ మీడియాతో పేర్కొన్నారు. తుది ఆదేశాలు అందుకున్న తర్వాత కూడా దేశం వీడిపోకుంటే భారీ జరిమానా తప్పదని హెచ్చరించారు. 

ముఖ్యంగా సెల్ఫ్ డిపోర్టేషన్‌కు సంబంధించి హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం మార్చి 31న సోషల్ మీడియా వేదికగా కీలక సమాచారాన్ని పంచుకుంది. తమ తనిఖీల్లో పట్టుబడితే క్రమబద్ధీకరణకు ఎటువంటి అవకాశం ఉండబోదని, సంపాదించుకున్న డబ్బును కూడా నష్టపోవాల్సి వస్తుందని అధికారులు ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

బహిష్కరణ ఆదేశాలు అందుకున్న తర్వాత వెళ్లిపోకపోతే రోజుకు 998 డాలర్లు జరిమానా, సెల్ఫ్ డిపోర్ట్ యాప్‌లో నమోదు చేసుకున్న తర్వాత వెళ్లపోకపోతే రోజూ 1000- 5 వేల డాలర్లు జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. భవిష్యత్తులో అమెరికాకు తిరిగి వచ్చే అవకాశం కూడా కోల్పోతారని పేర్కొంది.

డొనాల్డ్ ట్రంప్ గతంలో అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఈ జరిమానాలకు సంబంధించి 1996లో తీసుకువచ్చిన చట్టాన్ని అప్పుడు తొలిసారి అమలు చేస్తున్నారు. 9 మంది అక్రమ వలసదారులపై జరిమానా విధించినప్పటికీ, అందులో కొందరిపై ఉపసంహరించుకున్నారు. ట్రంప్ తర్వాత బైడెన్ వచ్చాక జరిమానాలు విధించడాన్ని నిలిపివేశారు. అక్రమ వలసదారుల్లో భయాన్ని కలిగించేందుకు ఈ జరిమానాలను తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు.

Also Read: Ap weather Report: బంగాళాఖాతంలో అల్పపీడనం...ఏపీలో వర్షాలు..

Also Read: Canada: కెనడా రాజకీయాల్లో కొత్త ట్రెండ్

america | migrants | illeagal-migrants | illegal immigrants america | Indian illegal immigrants | america illegal immigrants news | Immigrants | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment