Nepal: నేపాల్‌లో మరోసారి ఘర్షణలు..హిందూ దేశం, రాచరిక పాలన కావాలని డిమాండ్

నేపాల్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. . రాచరిక పాలన, హిందూ దేశ హోదా కోసం అక్కడ మళ్లీ నిరసనలు జరిగాయి. ఉద్యమకారులు, భద్రత సిబ్బంది మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. నిరసనకారులపై భద్రతా సిబ్బంది టియర్ గ్యాస్ ప్రయోగించారు.

New Update
 Pro-monarchy protestors clash with police in Nepal

Pro-monarchy protestors clash with police in Nepal

Nepal: నేపాల్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాచరిక పాలన, హిందూ దేశ హోదా కోసం అక్కడ గత కాలంగా నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఉద్యమకారులు, భద్రత సిబ్బంది మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. భద్రతా సిబ్బందిపై ప్రజలు రాళ్లు విసిరారు. దీంతో సిబ్బంది వాళ్లపై టియర్ గ్యాస్‌ ప్రయోగించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

Also Read: ఎత్తైన భవనం కూలిన ఘటనలో 90మంది మిస్సింగ్ ..

ఇదిలాఉండగా

2008లో రాజు జ్ఞానేంద్ర రాచరిక పాలనను రద్దు చేశారు. అప్పటివరకు నేపాల్ హిందూ దేశంగా ఉండేది. అయితే మావోయిస్టు, కమ్యూనిస్టు ప్రభుత్వ విధానాలు అక్కడి ప్రజలకు నచ్చలేదు. దీంతో మళ్లీ తమకు రాచరిక పాలన కావాలని, నేపాల్ హిందూ దేశంగా ఉండాలని డిమాండ్ చేస్తూ ప్రజలు ఇటీవల రోడ్ల పైకి వచ్చి నిరసనలు తెలిపారు. రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ (RPP) రాచరిక పాలనను ప్రవేశపెట్టాలని కోరుతూ ర్యాలీలో డిమాండ్ చేశారు.   

Also Read: మందు బాబుల గుండెలు పిండేసే వార్త.. ఏమిటో తెలిస్తే తట్టుకోలేరు!

ఈ ర్యాలీలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫొటోలు కనిపించడం దుమారం రేపింది. దీనిపై ఆర్‌పీపీ పార్టీ స్పందించింది. ప్రధానమంత్రి ముఖ్య సలహాదారు బిష్ణు రిమాల్ సూచనల మేరకే యోగి ఫొటోలు ప్రదర్శించామని తెలిపింది. ప్రధాని కేపీ ఓలి వర్గం తమ ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు కుట్ర చేసిందని ఆరోపణలు చేసింది. మరోవైపు బిష్ణు రిమాల్ మాత్రం ఆర్‌పీపీ చేసిన ఆరోపణలు ఖండించారు. అయితే తాజాగా నేపాల్‌లో మరోసారి రాచరిక పునరుద్ధరణకై నిరసనలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Also Read: త్రిభాషా విధానం, డీలిమిటేషన్‌పై టీవీకే పార్టీ సంచలన నిర్ణయం

nepal | telugu-news | rtv-news | protest

Also Read: విమానంలో మహిళలతో యువకుడి అసభ్య ప్రవర్తన.. దిగగానే ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Fire Accident : టెస్లా షోరూంలో అగ్ని ప్రమాదం...17 కార్లు దగ్ధం.. వారి పనే అంటున్న మస్క్

ప్రంపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ప్రముఖ ఎలక్ర్టిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా షోరూంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఇటలీలోని రోమ్ శివార్లలో ఉన్న షోరూంలో ఈ ఘటన చోటు చేసుకుంది.. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో 17 కార్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.

New Update
Fire At Tesla Dealership

Fire At Tesla Dealership

Fire Accident: ప్రంపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ప్రముఖ ఎలక్ర్టిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా షోరూంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఇటలీలోని రోమ్ శివార్లలో ఉన్న షోరూంలో ఈ ఘటన చోటు చేసుకుంది.. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో 17 కార్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

ఇది కూడా చూడండి: ఈ రాశివారు నేడు వివాదాలకు దూరంగా ఉంటే బెటర్‌!

ఇటలీలోని రోమ్ నగర శివార్లలోని టెస్లా షోరూంలో సోమవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది.షార్ట్‌ సర్య్కూట్‌ లేదా ఇతర కారణాలతో  షోరూం అంతా కాలిపోయింది. ఫలితంగా అందులో ఉన్న 17 కార్లు పూర్తిగా కాలిపోయాయి. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. హుటాహుటిన రంగంలోకి దిగారు. ఫైర్ ఇంజిన్ల సాయంతో సిబ్బంది మంటలను ఆర్పారు. అయితే ఉదయం 4.30 గంటలకు మంటలు అంటుకున్నాయని.. అదృష్ట వశాత్తు షోరూంలో ఎవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పిందని అగ్నిమాపక సిబ్బంది ఓ ప్రకటనలో తెలిపింది.

ఇది కూడా చూడండి: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!

అయితే ఈ విషయం తెలుసుకున్న మస్క్ తాజాగా స్పందించారు. ఇది కావాలనే ఉగ్రవాదులు చేశారని ఆరోపించారు. తమ సంస్థ కేవలం ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే తయారు చేస్తోందని.. ఈ స్థాయిలో హింస చాలా పెద్ద తప్పని వ్యాఖ్యానించారు. మరోవైపు ఇటలీ ఉప ప్రధాని మాటియో సాల్విని సైతం దీనిపై స్పందించి మస్క్‌కు మద్దతు తెలిపారు. టెస్లా కంపెనీపై కావాలని దాడులు చేయడం దారుణం అన్నారు. ఇకనైనా ఈ దాడులు ఆపాలని కోరుతున్నట్లు చెప్పారు. అలాగే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌..  రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ను డోజ్ అధినేతగా నియమించారు. ఇక అప్పటి నుంచి వీరిద్దరూ కలిసి.. అనేక షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు.. దీంతో వారికి అనేక మంది శత్రువులవుతున్నారు. ఈక్రమంలోనే స్థానిక ప్రజల నుంచి ఉగ్రవాదుల వరకు వీరిపై కోపంగా ఉన్నారు. అందుకే పగ తీర్చుకోవాలని ఎలాన్ మస్క్ కంపెనీపై దాడులు చేస్తున్నారు. అమెరికాతో పాటు అనేక దేశాల్లో ఈ దాడులు సాగుతున్నాయి. ఇటీవలే ట్రంప్ సైతం దీనిపై స్పందించి.. టెస్లా కార్లపై దాడికి పాల్పడితే 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తామని హెచ్చరించారు.

ఇది కూడా చూడండి: బోణీ కొట్టిన ముంబై..ఐపీఎల్ లో మరో రికార్డ్

Advertisment
Advertisment
Advertisment