Pakistan: పాకిస్తాన్‌లో షహబాజ్‌ ప్రభుత్వంపై తిరుగుబాటు !

బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) పాక్ ప్రభుత్వాన్ని, సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతోంది. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌లో జరుగుతున్న దాడులకు ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని బలహీన పాలనగా అభివర్ణించారు.

New Update
Pakistan PM Shehbaz Sharif

Pakistan PM Shehbaz Sharif

పాకిస్తాన్‌లో ప్రస్తుతం అశాంతి నెలకొంది. పలుచోట్ల బాంబు దాడులు జరుగుతున్నాయి, మరికొన్ని చోట్ల గుర్తు తెలియని ముష్కరుల భయం ఉంది. పాకిస్తాన్ పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. ముఖ్యంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) పాక్ ప్రభుత్వానికి, సైన్యానికి ముప్పు తిప్పలు పెడుతోంది. ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్ , ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్  BLA కారణంగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.

Also Read: వలసదారులకు ట్రంప్ బిగ్‌ షాక్.. 5 లక్షల మందికి ఆ హోదా రద్దు

 పాకిస్తాన్‌లో భద్రతపై ఆందోళన నెలకొంది. అయితే పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ ఇప్పుడు ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్‌ను టార్గెట్ చేసుకున్నారు. పాకిస్తాన్‌లో ప్రతిరోజూ జరుగుతున్న సంఘటనలకు ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. BLA సాకుతో షాబాజ్ షరీఫ్‌ను, అతని ప్రభుత్వాన్ని బలహీనమైన పాలనగా అభివర్ణిస్తున్నారు. పాకిస్తాన్‌లో భద్రత క్షీణించడానికి రాజకీయ నాయకులే కారణమని ఆరోపించారు. 

Also Read: నేడు వరల్డ్‌ ఎర్త్‌ అవర్‌ డే.. రాత్రి 8.30 నుంచి 9.30 మర్చిపోవద్దు

జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఇచ్చిన భద్రతా సమావేశంలో, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి మెరుగైన పాలన అవసరమని  స్పష్టం చేశారు. బలహీనమైన పాలన కారణంగా పాకిస్తాన్ ప్రజలు ఎంతకాలం ప్రాణత్యాగం చేస్తారని ప్రశ్నించారు. మునీర్ చేసిన ఈ వ్యా్ఖ్యలు.. షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం బలహీన పాలనను సూచిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్ మునీర్.. బలూచ్‌లతో యుద్ధం, పాకిస్తాన్‌లో దాడులపై షాబాజ్ షరీఫ్‌ను నిందిస్తున్నట్లే, 25 సంవత్సరాల క్రితం పాక్ మాజీ ప్రెసిడెంట్ పర్వేజ్ ముషారఫ్ కూడా కార్గిల్ ఓటమికి షహబాద్ షరీఫ్ సోదరుడు నవాజ్ షరీఫ్‌ను నిందించారు. మొత్తానికి బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడుల వల్ల.. షహబాజ్ షరీఫ్‌ ప్రభుత్వంపై సైన్యం నుంచి తిరుగుబాటు మొదలైనట్లు కనిపిస్తోంది. 

Also Read: సునీతా విలియమ్స్‌కు ఓవర్‌టైమ్‌ జీతం చెల్లిస్తా : ట్రంప్

Also Read: లడక్ లో చైనా కౌంటీలు..ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్

telugu-news | pakistan | balochistan | shehbaz-sharif | pakistan-army 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

India-China: ట్రంప్‌ టారిఫ్‌ దెబ్బకి మెరుగుపడుతున్న భారత్-చైనా సంబంధాలు

ట్రంప్ టారిఫ్‌ల వల్ల స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నాయి. కానీ భారత్, చైనా మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. గతంతో పోలిస్తే ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడ్డాయని విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ వెల్లడించారు.

New Update
Jai shankar

Jai shankar

ట్రంప్ టారిఫ్‌ల వల్ల స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నాయి. కానీ భారత్-చైనా సంబంధాలు మాత్రం బలపడే దిశగా వెళ్తున్నాయి. తాజాగా ఇరుదేశాల సంబంధాలపై విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ స్పందించారు. ఆ సంబంధాలు సానుకూల దిశ వైపు పయనిస్తున్నాయన్నారు. గతంతో పోలిస్తే ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడ్డాయని.. వీటిని సాధారణ స్థితికి తెచ్చేందుకు ఎంతో కృషి చేయాల్సి ఉందని అన్నారు. 

Also Read: ట్రంప్ టారిఫ్‌లు వేస్తే మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు.. రాహుల్‌గాంధీ ఫైర్

ఇదిలాఉండగా 202-0 లో తూర్పు లడఖ్‌లోని గల్వాన్‌ లోయలో ఇరు దేశాల జవాన్ల మధ్య ఘర్షణలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో భారత్-చైనా మధ్య సంబంధాలు దిగజారిపోయాయి. అనంతరం సైనిక, దౌత్యపరంగా చర్చలు జరగడం, గస్తీ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం ప్రకారం 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్ పాయింట్లకు ఇరుదేశాలకు స్వేచ్ఛగా వెళ్లొచ్చు .  

Also Read: రేవ్ పార్టీలో అడ్డంగా బుక్కైన ఆర్మీ, రాజకీయ నేతల కూతుర్లు.. వీడియో వైరల్ 

ఇటీవల చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 108 శాతం టారిఫ్‌లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో తాజాగా చైనా కూడా అమెరికాపై 84 శాతం సుంకాలు విధించింది. దీంతో ట్రేడ్ వార్‌ మరింత ముదిరింది. ఇదిలాఉండగా.. న్యూఢిల్లీలోని చైనా ఎంబసీ అధికార ప్రతినిధి యూ జింగ్ టారిఫ్‌ల స్పందించారు. అమెరికా టారిఫ్‌ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్, చైనా జత కట్టాలన్నారు. పరస్పర సహకారం, ప్రయోజనాలపై ఇరు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్యం సంబంధాలు ఆధాపడి ఉన్నాయన్నారు. అమెరికా విధించిన టారిఫ్‌ల వల్ల అనేక దేశాలు, ముఖ్యంగా పేద దేశాలు అభివృద్ధి పొందే హక్కును కోల్పోతున్నాయని చెప్పారు. ఇలాంటి కఠిన పరిస్థితుల నుంచి బయటపడేందుకు మన ఇరు దేశాలు కలిసి ఎదుర్కోవాలన్నారు. 

Also read: Viral video: రన్నింగ్ ట్రైన్‌ కిటికీలో ఇరుక్కున్న దొంగ.. కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన ప్యాసింజర్

telugu-news | rtv-news 

Advertisment
Advertisment
Advertisment