Russia: రష్యాలో మరో భారతీయుడు మృతి

రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో చాలా మంది భారతీయులు చిక్కుకున్నారు. వీరిని ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈలోపునే కొందరి ప్రాణాలు పోతున్నాయి. తాజాగా రష్యా సైన్యంలో పని చేస్తున్న కేరళ యువకుడు మరణించాడు. 

New Update
Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ వార్‌లో భారత యువకుడి మృతి

Russia-UkraineWar

రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో కేరళ యువకుడు మరణించినట్లు తెలుస్తోంది. ఇతను రష్యా సైన్యంలో పని చేస్తున్నాడు. కేరళ కు చెందిన టిబీ బినిల్ గా అతనిని గుర్తించారు. బినీల్ వయసు 32 ఏళ్ళు. ఇతని సమీప బంధువు కూడా యుద్ధంలో తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. టీకే జైన్ అతని పేరు అని చెబుతున్నారు. బనీ మరణించినట్లు అని బంధువులకు సమాచారం అందించారు. మాస్కోలోని రాయబార కార్యాలయం తమకు  ఈ విషయం తెలిపిందని చెప్పారు. 

Also Read: Delhi: ఢిల్లీలో అంబరాన్నింటిన సంక్రాంతి వేడుకలు

ఎలక్ట్రిషియన్, ప్లంబర్లుగా...

బినిల్‌కు పెళ్ళయింది. అతని భార్య కేరళలోనే ఉంటారు. అతను చనిపోయిన విషయం తెలిసి బినీల్ భార్య షాక్‌కు గురయ్యింది. ఆయన్ను రష్యా నుంచి సురక్షితంగా తీసుకురావాలని అధికారులకు విజ్ఞప్తులు చేస్తున్న సమయంలోనే ఈ విషాద వార్త వినాల్సి వచ్చిందని వాపోయారు.  త్రిశ్శూరుకు చెందిన బినీల్, జైన్‌లు ఐటీఐ మెకానికల్ డిప్లొమా పూర్తి చేశారు. ఎలక్ట్రిషయన్లు, ప్లంబర్లుగా పనిచేయడానికి వారిద్దరూ ప్రైవేటు వీసాతో గతేడాది 4న రషయాకు వెళ్ళరు. కానీ అక్కడకు వెళ్ళగానే వారి పాస్‌పోర్టు రద్దు చేసింది రష్యా. దాని తరువాత మిలటరీ సపోర్టు సర్వీస్‌లో భాగంగా యుద్ధంలోకి దింపింది. తమను తమ దేశానికి తీసుకెళ్ళాలని బినీల్, జైన్లు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. వారిని భారతదేశానికి తీసుకురావడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఆలోపునే బినీల్ చనిపోయారు. 

Also Read: Khargpur: ఐఐటీ ఖరగ్‌పూర్‌‌లో థర్డ్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్య

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: యాపిల్ కు అండగా ట్రంప్..సుంకాల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు మినహాయింపు

సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతీకార సుంకాల నుంచి స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, సెమీ కండక్టర్లను మినహాయించారు.  దీనికి సంబంధించి అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది.

New Update
iPHONE 16 Trump Tariffs

iPHONE 16 Trump Tariffs Photograph: (iPHONE 16 Trump Tariffs)

గత పది రోజులుగా ప్రపంచం మొత్తం టారీఫ్ ల వార్ తో దడదడలాడిపోతోంది. టారీఫ్ లతో దాదాపు అన్ని దేశాలనూ బెంబేలెత్తించారు. అయితే రెండు రోజు క్రితం ఈ సుంకాలకు 90 రోజుల బ్రేక్ ను కల్పిస్తూ అనౌన్స్ చేశారు. మళ్ళీ ఇందులో చైనాను మాత్రం కలపలేదు. దీంతో మిగతా దేశాలన్నీ కాస్త ఊపిరి పీల్చుకున్నా చైనాతో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే తాజాగా సుంకాల విషయంలో మరో కీలక నిర్ణయం ప్రకటించింది అమెరికా. 

ఫోన్లు, కంప్యూటర్ల మీద..

అమెరికా మీద చైనా 125 శాతం, అమెరికా 145 శాతం సుంకాలను విధించుకుంటున్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తుల మీద 145 ఉంటాయి కానీ స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల మీద కాదంటూ ఒక కీలక ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, హార్డ్‌ డ్రైవ్‌లు, కంప్యూటర్‌ ప్రాసెసర్లు, మెమొరీ చిప్‌లు, సెమీ కండక్టర్లు, సోలార్‌ సెల్స్‌, ఫ్లాట్‌ టీవీ డిస్‌ప్లేలు వంటి వాటిని ఈ ప్రతీకార సుంకాల నుంచి మినహాయింపు పొందుతాయి. అమెరికాకు చెందిన యాపిల్ సంస్థకు సంబంధించి ప్రోడక్ట్స్ ఎక్కువ శాతం చైనా నుంచే వస్తాయి. 

యాపిల్ కంపెనీకి ఊరట..

సుంకాల పెంచడంతో స్మార్ట్ ఫోన్లు, యాపిల్ ఫోన్లు ధరలు పెరుగుతాయని వినియోగదారుల్లో ఆందోళన పెరిగింది. దీంతో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కోసం అమెరికా వాసులు స్టోర్లకు కూడా పరుగెత్తారు. కానీ ఇప్పుడు అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. నిజానికి ప్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల ఉత్పత్తుల మీద ప్రతీకార సుంకాలను పెంచాలంటే అవన్నీ అమెరికాలోనే తయారు చేయాలి. కానీ అక్కడ ఇవి చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నట్టుండి తయారీ కంపెనీలను పెట్టడం కూడా  కుదరదు.  దీనికి కొన్నేళ్ళు సమయం పడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అమెరికా సుంకాల నిర్ణయంతో అత్యధికంగా నష్టపోయిన యాపిల్ కంపెనీ...ఇప్పుడు తాజా నిర్ణయంతో హమ్మయ్య అనుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

 today-latest-news-in-telugu | usa | china | trump tariffs | apple | i-phone

Also Read: SRH VS PBKS: ఉప్పల్‌లో కొడితే తుప్పల్లో పడింది భయ్యా.. సన్‌రైజర్స్ ముందు భారీ టార్గెట్

 

Advertisment
Advertisment
Advertisment