PM Modi: స్వతంత్ర పోరాటంలో ఫ్రాన్స్ జ్ఞాపకాలను గుర్తు చేసిన మోదీ

మోదీ ఫ్రాన్స్ పర్యటనలో బుధవారం ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో కలిసి మార్సెయిల్‌లోని మజార్గ్స్ స్మశానవాటికను సందర్శించారు. ప్రపంచ యుద్ధంలో చనిపోయిన భారతీయ సైనికులకు నివాళులు అర్పించారు. మార్సెయిల్‌లో ఇండియా రాయబార కార్యాలయాన్ని ప్రారంభించారు.

author-image
By K Mohan
New Update
modi in france

modi in france Photograph: (modi in france)

ప్రధాని మోదీ (PM Modi) ఫ్రాన్స్ పర్యటన (France Tour) లో మూడవ రోజు బుధవారం చివరిది. ఆయన ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో కలిసి మార్సెయిల్‌లోని మజార్గ్స్ స్మశానవాటికను సందర్శించారు. ప్రపంచ యుద్ధంలో పోరాడి ప్రాణాలర్పించిన భారతీయ సైనికులకు అక్కడే దహన సంస్కారాలు చేశారు. మార్సెయిల్‌లోని మజార్గ్స్ స్మశానవాటికలో భారతీయ సైనికులకు నివాళులర్పించారు. స్వాతంత్య్ర సమరయోధుడు వీర్ సావర్కర్ మార్సెయిల్‌లోనే బ్రిటిష్ వారికి పట్టుపడ్డారని మోదీ గుర్తు చేశారు.

Modi Recalled The Memories Of France 

ఇది కూడా చదవండి: Lavanya: షాకింగ్ న్యూస్.. పోలీస్ బాస్‌తో లావణ్య రాసలీలలు.. వీడియో వైరల్!

మోదీ తన ఎక్స్ అకౌంట్‌లో ఫ్రాన్స్ గొప్పతనం గురించి పేర్కొన్నారు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ఈ నగరం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. వీర్ సావర్కర్ ఇక్కడే తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఆయనను బ్రిటిష్ కస్టడీకి అప్పగించవద్దని డిమాండ్ చేసిన మార్సెయిల్ ప్రజలకు, ఆనాటి ఫ్రెంచ్ కార్యకర్తలకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వీర్ సావర్కర్ ధైర్యం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉందని నరేంద్ర మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. 

ఇది కూడా చదవండి: ఆరోగ్యం సహకరించకున్నా ఆలయాల సందర్శన.. కారణం అదే.. పవన్ కీలక ప్రకటన!

Also Read :  106 కి.మీ.. ఉరి వేసుకోబోతున్న యువకుడిని ఏపీ పోలీసులు ఎలా కాపాడారంటే!

మార్సెయిల్‌లోని ఒక హోటల్‌లో భారత ప్రవాసుల నుండి ప్రధాన మంత్రి మోడీకి ఘన స్వాగతం పలికారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్‌తో కలిసి మోదీ మార్సెయిల్‌లో భారత కాన్సులేట్‌ను ప్రారంభించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింతగా పెంచుతామని ఆయన అన్నారు. మార్సెయిల్‌‌లో మోదీకి ఇండియన్స్ ఘనంగా స్వాగతం పలికారు. అమెరికాలో మోదీ రెండు రోజులు పర్యటించనున్నారు. భారత్ ప్రధాని ఫ్రాన్స్ పర్యటనలో ఇరు దేశాల మధ్య అనేక ఒప్పందాలు జరిగాయి. అంతర్జాతీయ థర్మోన్యూక్లియర్ ఎక్స్‌పెరిమెంటల్ రియాక్టర్ (ITER) ప్రాజెక్టులో 10 శాతం వాటా భారత్‌కు కేటాయించింది. అందుకుగాను ఫ్రాన్స్‌కు  ఇండియా రూ.17,500 కోట్లు చెల్లించడానికి సిద్ధంగా ఉంది. ఫ్రాన్స్ నుంచి మోదీ బుధవారం సాయంత్రం నేరుగా అమెరికా బయలుదేరనున్నారు. రెండు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ కానున్నారు.

Also Read :  రాత్రి పూట మటన్ తింటే డేంజర్! ఈ విషయాలు తెలుసుకోండి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

నౌకాశ్రయంలో భారీ పేలుడు.. 400 మందికి పైగా?

ఇరాన్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించింది. బందర్‌ అబ్బాస్‌ సమీపంలోని రజేయీ నౌకాశ్రయంలో పేలుడు సంభవించగా.. 400 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ పేలుడు ఎలా సంభవించిందని విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

New Update
Iran Harbor

Iran Harbor

ఇరాన్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించిన ఘటన చోటుచేసుకుంది. బందర్‌ అబ్బాస్‌ సమీపంలో రజేయీ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించగా.. 400 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ భారీ పేలుడు ఎలా సంభవించిందని విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

చమురు, పెట్రోకెమికల్స్ కారణంగా..

నౌకాశ్రయంలోని కంటెయినర్ల నుంచి పేలుడు సంభవించిందని భావిస్తున్నారు. ఇక్కడ ఎగుమతి, దిగుమతి కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే ఈ కంటైయినర్లలో చమురు, పెట్రోకెమికల్స్ ఉన్నాయి. వీటి కారణంగా పేలుడు సంభవించి ఉంటుందని భావిస్తున్నారు.

ఇది కూడా చూడండి: BIG BREAKING: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

Advertisment
Advertisment
Advertisment