Bill Gates: కమలాహారిస్‌కు బిల్‌గేట్స్ భారీ విరాళం.. ఎందుకంటే?

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలాహారిస్‌కు భారీవిరాళం ఇచ్చినట్లు తెలుస్తోంది. కమలాహారిస్‌కి మద్దతు ఇచ్చే ఎన్జీవోకి 50 మిలియన్ల డాలర్లు అనగా రూ.420 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు సమాచారం.

New Update
Bilgates and kamalaharis

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు మరో రెండు వారాల్లో జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో కమలాహారిస్, ట్రంప్ పోటీపడుతున్నారు. మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ మద్దతు వీరిద్దరిలో ఎవరికనే చర్చ జోరుగా సాగింది. బిల్‌గేట్స్ కూడా తన మద్దతు ఎవరికి ఇస్తున్నారో బహిరంగంగా ప్రకటించలేదు.

ఇది కూడా చూడండి: ఐదేళ్లుగా నకిలీ కోర్టు.. గుట్టు రట్టు చేసిన పోలీసులు.. ఎక్కడంటే?

కోట్ల భారీ విరాళం..

ఇదిలా ఉండగా బిల్‌గేట్స్ కమలాహారిస్‌కు భారీ విరాళం ఇచ్చినట్లు తెలుస్తోంది. కమలాహారిస్‌కు మద్దతిస్తున్న ఫ్యూచర్ ఫార్వర్డ్ ఎన్జీవో సంస్థకు 50 మిలియన్ల డాలర్లు అనగా రూ.420 కోట్లు విరాళంగా ఇచ్చారని అక్కడి మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఎలాగైన కమలాహారిస్‌ ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: కళ్లు చెదిరే డ్రోన్ షో.. 5 గిన్నిస్ రికార్డులు సొంతం

రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమాలాహారిస్ ఈసారి బరిలో ఉన్నారు. అయితే బిల్‌గేట్స్ ఎవరికి మద్దతు ఇస్తారని ఇప్పటికీ బహిరంగంగా తెలపలేదు. ఈ భారీ విరాళంతో తన మద్దతు కమలాహారిస్‌కి అని అర్థం అవుతోంది. ఇంత పెద్ద మొత్తంలో విరాళం ప్రకటించడంతో బిల్‌గేట్స్ మద్దతు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలాహారిస్‌కి అని స్పష్టంగా తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: హ్యాపీ బర్త్‌డే డార్లింగ్.. నెట్టింట దుమ్ము లేపుతున్న ప్రభాస్ ఫ్యాన్స్

ఇటీవల బిల్‌గేట్స్ ఓ ఇంటర్వూలో ఎన్నికల కోసం మాట్లాడారు. ఆరోగ్య సంరక్షణను మెరుగుపరుస్తూ, పేదరికాన్ని తగ్గించేందుకు ప్రయత్నించిన వారికి మద్దతు ఇస్తానని తెలిపారు. ఎంతో మంది రాజకీయ నాయకులతో పనిచేసిన అనుభవం తనకి ఉందన్నారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ అధ్యక్ష రేసు నుంచి వైదొలగడంతోనే కమలాహారిస్‌కు మద్దతిస్తున్నట్లు తెలిపారు. ఇతని మాజీ భార్య మెలిండా ఫ్రెంచ్ గేట్స్ కమలాహారిస్‌కు మద్దతిస్తున్న సంగతి తెలిసిందే.        

ఇది కూడా చూడండి: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. లక్షల కోట్లు గోవిందా!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించిన పాక్.. ఉద్యోగుల సెలవులు రద్దు!

పాకిస్తాన్ లో ప్రస్తుతం పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. భారత్ యుద్ధానికి రెడీ అవుతుండడంతో పాక్ జాగ్రత్తలు పడుతోంది. పీవోకేలో అత్యవసర ఆంక్షలు విధించింది. ఉద్యోగుల సెలవులు, ట్రాన్సఫర్లను నిలిపేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 

New Update
పాక్ ఉగ్రవాదులకు చైనా ఆయుధాలను అందిస్తున్న ఐఎస్ఐ

పైకి బీరాలు పోతున్నా పాకిస్తాన్ లోపల భయపడుతోందని స్పష్టంగా తెలుస్తోంది. పాక్ పీవోకేలో జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం. ఒకవైపు బోర్డర్ లో భారత్ చర్యలు, యుద్ధం తప్పదన్న హెచ్చరికలతో పాకిస్తాన్ అత్యవసర నిర్ణయాలను తీసుకుంటోంది. పాక్ పీవోకేలో అత్యవసర ఆంక్షులు విధించింది అక్కడి ప్రభుత్వం. దాంతో పాటూ ఆరోగ్య కార్యకర్తల సెలవులు, ట్రాన్సఫర్లను నిలిపేసింది. దీనికి సంబంధించి ఏప్రిల్ 25న జీలం వ్యాలీ హెల్త్ డైరెక్టరేట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆసుపత్రులు, ఆరోగ్య విభాగాలలోని వైద్య సిబ్బందిని వారి వారి డ్యూటీ పాయింట్ల వద్దనే ఉంచాలని ఆదేశించింది. ఇప్పటికే సెలవు మీద ఉన్నవారు కూడా వెంటనే డ్యూటీల్లో జాయిన్ అవ్వాలని చెప్పింది. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, అంబులెన్స్ డ్రైవర్లను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచాలని ఆదేశించింది. 

అప్రమత్తమైన భారత బలగాలు..

పాక్ హెల్త్ డైరెక్టరీ ఉత్తర్వులను భారత భద్రతా సంస్థలు కూడా తీవ్రంగా పరిగణించాయి. పాకిస్తాన్ తీసుకుంటున్న ఈ చర్యలు ఎల్వోసీ దగ్గర సైనిక లేదా ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నాయి. దక్షిణ కాశ్మీర్‌లోని పహల్గామ్, పరిసర ప్రాంతాలలో ఇవి ఎక్కువగా జరగొచ్చని ఊహిస్తున్నారు. దీంతో భారత భద్రతా దళాలు పహల్గామ్, అనంతనాగ్ జిల్లాల్లో పెట్రోలింగ్, నిఘాను ముమ్మరం చేశాయి.  ఇక నియంత్రణ రేఖ దగ్గర భారత సైన్యం ప్రత్యేక నిఘాను కూడా ఏర్పాటు చేసింది. భారత సైన్యం ఎటువంటి ముప్పునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు. 

today-latest-news-in-telugu | pakistan | loc | emergency 

Also Read:   J&K: మరో ఉగ్రవాది ఇంటిని పేల్చేసిన బలగాలు

Advertisment
Advertisment
Advertisment