అమెరికాలో కెనడా విలీనం.. సాధ్యమేనా..?

కెనడా అమెరికాలో విలీనం చేస్తామని అన్న ట్రంప్ మాటలు సాధ్యంకావని నిపుణులు చెబుతున్నారు. యూఎస్ లో 51వ స్టేట్‌గా కెనడా కలిసిపోతుందని ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా దుమారం రేపుతున్నాయి. కెనడా ఓ బలమైన ప్రజాస్వామ్యం దేశమని దాన్ని ఆక్రమణ సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు.

New Update
trump

Donald Trump, Justin Trudeau

నేను ప్రెసిండెంట్‌గా బాధ్యతలు చేపట్టగానే.. కెనడా అమెరికాలో 51వ స్టేట్‌గా కలిసిపోతుందంటూ ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఇటీవల కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించడం.. తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఈ కామెంట్స్, కెనడా అమెరికాలో కలిసిపోయినట్లు ఉన్న మ్యాప్ సోషల్ మీడియాలో ట్రంప్ షేర్ చేయడం చూస్తుంటే.. కెనడా దేశాన్ని అమెరికా ఆక్రమించుకుంటుందా అని అనుమానాలు కలుగుతున్నాయి. జనవరి 20న అమెరికా 47వ అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఫ్లోరిడాలోని తన నివాసంలో ట్రంప్ మంగళవారం ప్రెస్‌మీట్‌లో చేసిన కామెంట్స్ అంతర్జాతీయంగా చర్చనీయాంశమైయ్యాయి. జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని కెనడాను విలీనం చేసుకోవాలని భావిస్తోన్నానని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ట్రంప్ దగ్గర ఉన్నాయని ఆయన అన్నారు. కెనడా భద్రత దృష్ట్యా అమెరికాలో విలీనం కావడమే మంచిదని అమెరికాకు కాబోయే అధ్యక్షుడు పేర్కొన్నారు. సైనిక చర్యతో కెనడాని అమెరికాలో విలీనం చేస్తుకుంటారని అని ఓ జర్నలిస్ట్ అడిగి ప్రశ్నకు ట్రంప్ నో అని చెప్పాడు. ఎకనమిక్ ఫోర్స్‌తో కెనడాను అమెరికాలో కలుపుకుంటామని ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. అసలు ఈ ఎకనమిక్ ఫోర్స్ అంటే..? ట్రంప్ అన్నది నిజంగా చేస్తాడా..? లేక అది పొలిటికల్ సెటైరా..? ట్రంప్ ప్లాన్ ఏంటో చూద్దాం..

ట్రంప్, ట్రూడో ల మధ్య చర్చలు

ఇటీవల కెనడా, మెక్సికోలపై 25 శాతం సుంకం విధించనున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. ఆ తర్వాత, కెనడా ప్రధాని ట్రూడో.. ట్రంప్‌తో భేటీ అయ్యారు. వలసలు, డ్రగ్స్‌ అక్రమరవాణాను సరిహద్దుల్లోనే కట్టడి చేయాలని, లేనిపక్షంలో సుంకాలు పెంచుతానని ట్రంప్‌ హెచ్చరించారు. అంతేకాక, ఇందులో విఫలమైతే అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాలని ట్రూడోకు వార్నింగ్ సైన్ ఇచ్చాడు. దాని తర్వాత ట్రూడో తన ప్రధాని పదవికి త్వరలో రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా, లిబరల్‌ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి కూడా వైదొలుగుతున్నట్లు కూడా తెలిపారు. తన తర్వాత అభ్యర్థిని పార్టీ ప్రకటించే వరకూ ప్రధానిగా ఉంటానని ట్రూడో అన్నాడు. కెనడా రాజకీయ సంక్షోభాన్ని ఆసరాగా చేసుకొని ట్రంప్ కెనడాని అమెరికాలో విలీనం చేసుకోవాలనుకుంటుంన్నారని అంతర్జాతీయంగా విమర్శలు వచ్చాయి. ఈక్రమంలో అమెరికా కెనడాలో విలీనం అవ్వడం సాధ్యమేనా.. అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ట్రంప్ మాటలు రాజకీయంగా కౌంటరా లేక, కెనడా దేశ పరిస్థితిని చూసి సెటైర్ వేశాడాని ఎవరికీ అర్థం కావడం లేదు.

అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో విమర్శలు గుప్పించారు. కెనడాను అమెరికాలో విలీనమయ్యే అవకాశమే లేదని ఆయన స్పష్టంచేశారు. ఈమేరకు ఆయన ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. ‘కెనడా అమెరికాలో భాగమయ్యే అవకాశమే లేదు. రెండు దేశాలలోని కార్మికులు, ప్రజలు వాణిజ్యం, భద్రతా భాగస్వామ్యం ద్వారా లాభపడుతున్నారు’ అని ట్రూడో రాసుకొచ్చారు. కాగా.. ట్రూడో వ్యాఖ్యలకు కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ కూడా మద్దతు తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు కెనడా ఎప్పటికీ వెనక్కి తగ్గదని అన్నారు. కెనడా ఆర్థిక వ్యవస్థపై ట్రంప్ అవగాహన లేకుండా మాట్లాడారని మండిపడ్డారు కెనడా విదేశాంగ శాఖమంత్రి. మా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. మా ప్రజలే మా బలం. ఈ బెదిరింపులకు మేం ఎప్పటికీ వెనక్కి తగ్గమని మెలానీ జోలీ సోషల్ మీడియా ఎక్స్ లో పేర్కొన్నారు. 

నిపుణులు ఏమంటున్నారంటే..

కెనడా ఓ బలమైన ప్రజాస్వామ్యం దేశం అమెరికా దాన్ని ఆక్రమించుకోవడం సాధ్యం కాదని అంతర్జాతీయ సంబంధాల నిపుణులు చెబుతున్నారు. కెనడా అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న స్వతంత్ర దేశమని.. అంత ఈసీగా కెనడా స్వార్వభౌమాధికారాన్ని వదులుకోదని భావిస్తున్నారు. అంతేకాదు.. అమెరికాలో ఉన్న సమైక్య వ్యవస్థ చట్టాల ప్రకారం.. మరో దేశం చేరడం రాజకీయంగా, చట్టంపరంగా చాలాకష్టమని అంటున్నారు నిపుణులు. ఇలాంటి మాటలు ట్రంప్‌కు అలవాటు అని.. ఇంటర్నేషనల్ మీడియా, అనేది దేశాలను ఇలాంటి కామెంట్స్‌తో ట్రంప్ పై అటెన్ష్ పెంచుకుంటారు. ట్రంప్ ఈ వ్యాఖ్యలు పొలిటికల్ సెటైర్ అని చాలామంది అనుకుంటున్నారు. ట్రూడో, ట్రంప్ మధ్య ఎన్ని వివాదాలున్నా అమెరికా, కెనడా దేశాల మధ్య భవిష్యత్ పరస్పర సహకారంపైనే ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Taliban Government : పహల్గాంలో ఉగ్రదాడి.. తాలిబన్ల సంచలన ప్రకటన!

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి సంఘటనపై దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు కూడా ఖండించారు. తాలిబన్ నేతృత్వంలోని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం కూడా ఖండించింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేసింది.

New Update
Taliban's

Taliban's

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడిలో ఇప్పటివరకు 28 మంది మరణించారు. ఈ సంఘటనను దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు కూడా ఖండించారు. తాలిబన్ నేతృత్వంలోని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం కూడా ఈ భయంకరమైన సంఘటనపై స్పందించి ఖండించింది.


'జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన దాడిని IEA విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండిస్తోంది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తోంది. ఇటువంటి చర్యలు దేశభద్రతను దెబ్బతీస్తాయి' అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్ ఖహర్ బాల్ఖీ బుధవారం ఎక్స్ వేదికగా ఒక ప్రకటనలో తెలిపారు. అటు పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని బంగ్లాదేశ్ తీవ్రంగా ఖండించింది అని దాడి జరిగిన దాదాపు 24 గంటల తర్వాత ఒక ప్రకటన విడుదల చేసింది.

Also Read :  Vinay Narwal : ఈమెకు ఏం చెప్పి ఓదార్చుదాం..  కన్నీళ్లు పెట్టిస్తున్న హిమాన్షి వీడియో!

ప్రపంచం ఆశ్చర్యపోయేలా జవాబు ఇస్తాం

భారత్ ను ఎవరూ భయపెట్టలేరని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు.  త్రివిధ దళాధిపతులతో భేటీ అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  ప్రపంచం ఆశ్చర్యపోయేలా జవాబు ఇస్తామని అన్నారు.  పహల్గాం దాడికి అతి త్వరలో ప్రతీకారం  తీర్చుకుంటామని.. ఒక్క దోషిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదన్నారు. ఎక్కడ నక్కిన కూడా పట్టుకుంటామని హామీ ఇచ్చారు.  ఉగ్రవాదాన్ని తుదముట్టించాలనేదే భారత్ నినాదమని తెలిపారు.  ఉగ్రవాదులు పిరికిపంద చర్యకు పాల్పడ్డారన్న రాజ్ నాథ్ సింగ్...  ఈ చర్యకు పాల్పడిన వారిని మాత్రమే కాకుండా, తెరవెనుక ఉన్న వారిని కూడా వదిలిపెట్టబోమన్నారు.  తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేశారు రాజ్ నాథ్ సింగ్.

Also Read :  BCCI సంచలన నిర్ణయం..ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్లు ఇక ఉండవు?

Advertisment
Advertisment
Advertisment