USA: హమ్మ ట్రంప్ మామూలోడివి కాదు..ఇన్ సైడర్ ట్రేడింగ్ తో వివాదం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చుట్టూ ఇప్పుడు కొత్త వివాదం నెలకొంది. అదే ఇన్ సైడర్ ట్రేడింగ్. 90 రోజుల టారీఫ్ విరామాన్ని ప్రకటించే ముందు ఆయన తన ట్రూత్ సోషల్ మీడియాలో కొనగోళ్ళకు ఇది గొప్ప సమయం..డీజేటీ అని చేసిన పోస్టే దీనికి కారణం.

New Update
trump

US President Trump

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చాలా తెలివితేటలు ఉపయోగించారు. కొనుగోళ్లకు ఇది గొప్ప సమయం..డీజేటీ అంటూ  ట్రంప్‌ బుధవారం ఉదయాన్నే 9:37కు తన సోషల్ మీడియా ట్రత్ లో పోస్ట్ చేశారు. సరిగ్గా నాలుగు గంటల తర్వాత చైనా మినహా మిగతా దేశాల మీద టారీఫ్ లకు 90 రోజులు బ్రేక్ ఇచ్చారు.  దాంతో వాల్ స్ట్రీట్ లో ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 4 లక్షల కోట్ల డాలర్ల లాభాన్ని పొందింది. అంతకు ముందు ఇదే సూచీ నాలుగు రోజుల్లో చాలా పోగొట్టుకుంది. 

డీజేటీ అంటే..

డీజేటీ అనేది డొనాల్డ్‌ ట్రంప్‌ మీడియా అండ్‌ టెక్నాలజీ గ్రూప్‌ కార్పొరేషన్‌. ట్రూత్ సోషల్ మీడియాకు ఇది మెయిన్ సంస్థ. ట్రంప్ ప్రతీకార సుంకాలకు 90 రోజులు విరామం ప్రకటించడంతో ఈ కంపెనీ షేర్ 22.67 శాతం లాభపడింది. ఇందులో అమెరికా అధ్యక్షుడికి 53 శాతం వాటా ఉంది. దీంతో ఆయన సంపద ఒక్కరోజులోనే 415 మిలియన్ డాలర్లు పెరిగింది. ట్రంప్ పోస్ట్ చూసి ఆ కంపెనీపై డబ్బులు పెట్టిన వారికి కూడా బాగా లాభాలొచ్చాయి. అయితే ఇప్పుడు దీని వల్లనే ట్రంప్ కు తలనొప్పులు మొదలయ్యాయి. ఆయన కావాలనే ఆ పోస్ట్ పెట్టారని...దాని వలన డీజేటీకి బాగా లాభాలొచ్చాయని డెమోక్రాట్లు మండిపడుతున్నారు. ట్రంప ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. దీనిపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.  దీనికి తోడు తన మాట విని షేర్లు కొన్న ఒక సన్నిహితుడికి 2.5 బిలియన్‌ డాలర్లు , మరొకరికి 900 మిలియన్‌ డాలర్లు వచ్చాయని ట్రంప్‌ చెబుతున్న వీడియో ఒకటి వైరల్‌ అయింది. ఇన్‌సైడర్‌ ఇన్‌ఫర్మేషన్‌ చెప్పడం లేదా ఆ సమాచారంతో ఇతరులకు సహాయం చేయడంపై అమెరికా సెక్యూరిటీస్‌ చట్టంలో నిషేధం ఉందని వైట్ హౌస్ మాజీ లాయర్ ఒకరు అంటున్నారు. ఆయన తొందరపడి ప్రకటన చేశారని, జాగ్రత్తగా ఉండడం మంచిదని చెబుతున్నారు.

వెనకేసుకొచ్చిన వైట్ హౌస్..

అయితే ఈ విషయంపై వైట్ హౌస్ మాత్రం ట్రంప్ ను వెనకేసుకొస్తున్నట్టు మాట్లాడింది. ఆయన ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడలేదని...అమెరికా ప్రజలకు , మార్కెట్లకు దేశ ఆర్థిక భద్రత మీద నమ్మకం కల్పించడం కోసమే అలా చేశారని వైట్‌హౌస్‌ ప్రతినిధి కుష్‌ దేశాయ్‌ అన్నారు. 

 today-latest-news-in-telugu | usa | donald-trump | trump tariffs 

Also Read: Stock Market: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

నౌకాశ్రయంలో భారీ పేలుడు.. 400 మందికి పైగా?

ఇరాన్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించింది. బందర్‌ అబ్బాస్‌ సమీపంలోని రజేయీ నౌకాశ్రయంలో పేలుడు సంభవించగా.. 400 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ పేలుడు ఎలా సంభవించిందని విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

New Update
Iran Harbor

Iran Harbor

ఇరాన్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించిన ఘటన చోటుచేసుకుంది. బందర్‌ అబ్బాస్‌ సమీపంలో రజేయీ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించగా.. 400 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ భారీ పేలుడు ఎలా సంభవించిందని విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

చమురు, పెట్రోకెమికల్స్ కారణంగా..

నౌకాశ్రయంలోని కంటెయినర్ల నుంచి పేలుడు సంభవించిందని భావిస్తున్నారు. ఇక్కడ ఎగుమతి, దిగుమతి కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే ఈ కంటైయినర్లలో చమురు, పెట్రోకెమికల్స్ ఉన్నాయి. వీటి కారణంగా పేలుడు సంభవించి ఉంటుందని భావిస్తున్నారు.

ఇది కూడా చూడండి: BIG BREAKING: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

Advertisment
Advertisment
Advertisment