Pak-Ind: మీరు చెబితే వినే స్టేజ్ లో మేము లేము..పాక్ కి గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్‌!

పాక్ నాయకుల తీరును జెనీవా వేదికగా జరిగిన ఐరాస మానవహక్కుల కౌన్సిల్ 58వ సమావేశంలో భారత్ ఏకిపారేసింది.ఐరాస సాయంతో ఉగ్రవాదులకు ధైర్యంగా ఆశ్రయం ఇచ్చే దేశం ఎవరికీ ఉపన్యాసాలు ఇచ్చే స్థితిలో లేదు’ అని భారత్‌ అధికారులు తూర్పారబట్టారు.

New Update
bharat

bharat

Pak-Ind: ఐక్యరాజ్యసమితిలో దాయాది దేశం పాకిస్థాన్‌కు భారత్ మరోసారి గట్టిగా తలస్నానం పోసేసింది. భారత్‌పై పదే పదే ఆరోపణలు చేస్తోన్న పాక్ నాయకుల తీరును జెనీవా వేదికగా జరిగి ఐరాస మానవహక్కుల కౌన్సిల్ 58వ సమావేశంలో ఏకిపారేసింది. మనుగడ కోసం అంతర్జాతీయ సహాయంపై ఆధారపడే ఓ విఫల దేశంగా పాకిస్థాన్‌ను అభివర్ణించింది. పాకిస్థాన్ నాయకత్వం దాని సైన్యం నిర్దేశించిన అబద్ధాలను కొనసాగిస్తోందని ఐరాసలో భారత శాశ్వత మిషన్ ప్రతినిధి క్షితిజ్ త్యాగి ఆరోపించారు.

Also Read:  Actress Priyamani: ఛీ మీరు మనుషులేనా అసలు..పుట్టే పిల్లల గురించి కూడా అలాంటి కామెంట్లా!

 జమ్మూ కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని పాక్ న్యాయ మంత్రి అజామ్ నజీర్ తరార్ చేసిన ఆరోపణలపై త్యాగి కౌంటర్ ఇచ్చారు. ‘‘పాకిస్తాన్ నాయకులు, ప్రతినిధులు వారి సైనిక ఉగ్రవాద సమూహం నిర్దేశించిన అబద్ధాలను ప్రచారం చేయడం విచారకరం..ఇస్లామిక్ దేశాల కూటమిని తన వాణిగా మార్చుకుని దుర్వినియోగానికి పాల్పడి అపహాస్యం చేస్తోంది.. అభివృద్ధిలో అస్థిరత, అంతర్జాతీయ కరపత్రాలపై మనుగడ సాగించే విఫల దేశం ఈ కౌన్సిల్ సమయాన్ని వృధా చేస్తూనే ఉండటం దురదృష్టకరం.

Also Read: SLBC Tunnel: 8మంది ప్రాణాలు డౌటే..ప్రమాదస్థలానికి అరకిలోమీటర్ దూరంలో రెస్క్యూటీమ్..

అప్పటికీ ఎప్పటికీ భారత్‌లో....

దాని మాటల్లో కపటత్వం, అమానవీయ చర్యలతో అసమర్థ పాలనను కొనసాగిస్తోంది.. ప్రజాస్వామ్యం, పురోగతి, మా ప్రజలకు గౌరవాన్ని నిర్ధారించడంపై భారత్ దృష్టి సారించింది. మా నుంచి పాకిస్థాన్ ఈ విలువలు నేర్చుకోవాలి’’ అని త్యాగి చురకలంటించారు.నిరంతరం భారత్‌ వ్యతిరేక ప్రచారాలతో అంతర్జాతీయ వేదికలను దుర్వినియోగం చేస్తోందని ధ్వజమెత్తారు. కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్, లడఖ్‌లు అప్పటికీ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగాలేనని ఆయన పునరుద్ఘాటించారు. ఇటీవలి సంవత్సరాలలో ఈ ప్రాంతాలలో సాధించిన గణనీయమైన అభివృద్ధి, స్థిరత్వాన్ని ఆయన ఎత్తి చూపారు.

‘జమ్మూ కశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు ఎల్లప్పుడూ భారత్లో అంతర్భాగం.. గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ అపూర్వమైన రాజకీయ, సామాజిక, ఆర్థిక పురోగతికి ఇది సాక్ష్యంగా నిలుస్తుంది. దశాబ్దాలుగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంతో బాధపడుతున్న ఈ ప్రాంతంలో సాధారణ స్థితిని తీసుకురావడానికి ప్రభుత్వం నిబద్ధతపై ప్రజలకు ఉన్న నమ్మకానికి ఈ విజయాలు నిదర్శనం. మానవ హక్కుల ఉల్లంఘన, మైనారిటీలపై హింస, ప్రజాస్వామ్య విలువలను నాశనం చేయడమే విధానాలుగా పెట్టుకున్న ఉన్న దేశం.. ఐరాస సాయంతో ఉగ్రవాదులకు ధైర్యంగా ఆశ్రయం ఇచ్చే దేశం ఎవరికీ ఉపన్యాసాలు ఇచ్చే స్థితిలో లేదు’ అని ఆయన తూర్పారబట్టారు.

తన దేశంలోని మైనార్టీలపై వేధింపులు, రాజకీయ అస్థిరత, అంతర్జాతీయంగా నిషేధం ఉన్న ఉగ్రవాదులకు స్వర్గధామైన పాకిస్థాన్‌కు మానవహక్కులు లేదా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత లేదని దుయ్యబట్టారు. గతవారం కూడా ఐరాస భద్రతా మండలిలో కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన పాకిస్థాన్‌కు భారత్ శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ దిమ్మదిరిగేలా సమాధానం ఇచ్చారు.

Also Read: Weather updates: ఢిల్లీలో వర్షం.. ఈ రాష్ట్రాల్లో నేటి మార్చి 1 వరకు ఉరుములు, మెరుపులతో!

Also Read: Musk: అందుకే వాళ్లు నన్ను చంపాలని చూస్తున్నారు..: మస్క్‌ సంచలన వ్యాఖ్యలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Earthquake in Japan : జపాన్ ను వణికించిన భూకంపం...రిక్టర్‌ స్కేల్‌పై ఎంతంటే...

బుధవారం (ఏప్రిల్ 2) జపాన్‎లోని క్యుషులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.2గా నమోదైంది. జపాన్‌లోని క్యూషు కేంద్రంగా  భూమి కంపించింది. గత జనవరిలో కూడా జపాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.9గా నమోదైంది.

New Update
Earthquake in Japan

Earthquake in Japan

Earthquake in Japan : వరుస భూకంపాలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. ఇటీవల మయన్మార్, థాయ్‎లాండ్ దేశాలను భారీ భూకంపం గడగడలాడించిన విషయం తెలిసిందే. ఈ భూకంపం ధాటికి మయన్మార్ శ్మశాన వాటికను తలపిస్తోంది. దాదాపు 3 వేల మంది మరణించారు. ఇంకా వేల మంది శిథిలాల కింద చిక్కుకుని ఉండగా.. వారి కోసం సహకయ చర్యలు  కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగానే.. బుధవారం (ఏప్రిల్ 2) జపాన్‎లోని క్యుషులో భారీ భూకంపం సంభవించింది.

Also Read:  Ap-Telangana: ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు అలర్ట్.. 32 రైళ్లు రద్దు, మరో 11 దారి మళ్లింపు..!

రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.2గా నమోదైంది. జపాన్‌లోని క్యూషు కేంద్రంగా  భూమి కంపించింది. గత జనవరిలో కూడా జపాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.9గా నమోదైంది. భూకంపం ప్రభావంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా, ఆస్తి నష్టం జరిగింది. కాగా, భూకంపాల పరంగా జపాన్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జోన్‌లో ఉంది. ఇక్కడి సముద్ర తీరప్రాంతంలో భూకంపం వచ్చే అవకాశం 80 శాతం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి.

ఇది కూడా చదవండి: తినడం, తాగడం వల్ల కూడా గొంతు నొప్పి వస్తుందా?

ఏఎఫ్‌పీ (Agence France-Presse) తెలిపిన వివరాల ప్రకారం జపాన్ ప్రభుత్వ సంస్థ భవిష్యత్‌లో మెగా భూకంపం రానున్నదని అంచనా వేసిన సంగతి తెలిసిందే. ఈ భారీ భూకంపం భూమిపై అపరిమిత వినాశనాన్ని కలిగిస్తుందని,  మూడు లక్షల మంది మరణానికి కారణమవుతుందని తెలిపింది. ఈ భారీ భూకంపం కారణంగా సునామీ సంభవిస్తుందని, ఇది అనేక నగరాలను సముద్రంలో కలిపేస్తుందని పేర్కొంది. ‘మెగా క్వేక్ అనేది చాలా శక్తివంతమైన భూకంపం. దీని తీవ్రత 8 లేదా అంతకన్నా అధిక తీవ్రతతో ఉంటుంది. ఇది భారీ విధ్వంసానికి కారణంగా నిలుస్తుంది. సునామీని కూడా సృష్టిస్తుందని పేర్కొంది.

Also Read: Minor boy accident: 15ఏళ్ల బాలుడు కారు డ్రైవింగ్.. 2ఏళ్ల చిన్నారి మృతి
 
కాగా, ఇటీవల మయన్మార్‌లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇది వేలాది మందిని పొట్టన పెట్టుకుంది. వేలాది మంది ప్రస్తుతం ఆస్పత్రులలో జీవన్మరణ సమస్యతో పోరాడుతున్నారు. లెక్క లేనంత మంది గల్లంతయ్యారు. పలు నగరాల్లో, ఎత్తైన భవనాలు, ఇళ్లు, దేవాలయాలు శిథిలమయ్యాయి. మయన్మార్‌లో సంభవించిన భూకంపం థాయిలాండ్‌లోనూ వినాశనాన్ని మిగిల్చింది. బ్యాంకాక్‌లో అత్యవసర పరిస్థితిని విధించాల్సి వచ్చింది.

Also Read :  చర్మం, జుట్టును రక్షించే అద్భుతమైన ఆయుర్వేద ఉత్పత్తులు

Advertisment
Advertisment
Advertisment