Canada: అమెరికాకు కరెంట్ కోతలు తప్పవని కెనడా హెచ్చరిక

అమెరికా, కెనడాల మధ్య సుంకాల యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. ఒకరి మీద ఒకరు ప్రతీకారాలు తీర్చుకునే స్థాయికి వచ్చింది. అమెరికా విధించిన అధిక సుంకాలకు ప్రతీకారంగా కెనడా స్టార్ లింక్ తో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. 

New Update
tariff

USA, Canada Tariff War

అమెరికాకు రెంట్ కష్టాలు తప్పవని అంటోంది కెనడా. అమరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న సుంకాలు కెనడా, చైనా దేశాలతో వాణిజ్య పోరుకు దారి తీశాయి. ముఖ్యంగా కెనడా అమెరికాకు ధీటుగా స్పందిస్తోంది. అమెరికా విధించిని సుంకాలకు ప్రతిగా ఇప్పటికే కెనడా కూడా 25 శాతం సుంకాలను అమలు చేసింది. ఇప్పుడు దానికి తోడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌తో ఉన్న 100 మిలియన్‌ డాలర్ల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఒంటారియో ప్రీమియర్ డగ్‌ ఫోర్డ్‌ తెలిపారు. తాము అర్ధికంగా దెబ్బ తింటుంటే చూస్తూ ఊరుకోమని డగ్ ఫోర్డ్ తేల్చి చెప్పారు. ఇవే కాకుండా న్యూయార్క్, మిషిగాన్, మిన్నెసోటా రాష్ట్రాలకు కరెంట్‌ కోతలు విధిస్తానని చెప్పారు. ట్రప్ మా గురించి తక్కువ అంచనా వేస్తున్నారు. కానీ చిరునవ్వుతో మేము చేయాల్సినదంతా చేస్తామని చెప్పారు. తమ స్టోర్ల నుంచి అమెరికా మద్యాన్ని తొలగించే ఆలోచనలో కూడా తెలిపారు. 

25 శాతం సుంకం..

అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఆల్కహాల్, పండ్లు సహా 107 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులపై 25% సుంకం విధిస్తున్నట్లు ప్రధాని జస్టిన్‌ ట్రూడో (Justin Trudo) ప్రకటించారు. ఇవి వెంటనే అమల్లోకి వస్తాయని కూడా తెలిపారు. ఈ పెరిగిన సుంకాల కారణంగా అమెరికా ప్రజల నిత్యావసర గ్యాస్, కార్లపై అధిక ధరలను చెల్లించాల్సి వస్తుందని చెప్పారు. మరోవైపు మెక్సికో అధ్యక్షురాలు క్లౌడియా షీన్ బాయ్ కూడా ఈ సుంకాలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.  

 

Also Read: Karnataka: ఐపీఎస్ కూతురు స్మగ్లింగ్ ఎందుకు చేసింది? ఎలా పట్టుబడింది?

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Canada: కెనడా రాజకీయాల్లో కొత్త ట్రెండ్

ఏప్రిల్ 28న కెనడాలో 45వ సమాఖ్య ఎన్నికలు జరగనున్నాయి. పంజాబీ-కెనడియన్ రాజకీయ నాయకులు చాలా కాలంగా రాజకీయ ముఖచిత్రంగా ఉన్నారు. అయితే ఈసారి గుజరాతీ సంతతికి చెందిన నలుగురు అభ్యర్థులు పార్లమెంటు స్థానాలకు పోటీ చేస్తున్నారు.

New Update
canada

canada

కెనడాలో ఏప్రిల్ 28న 45వ ఫెడరల్ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో చాలా ఆసక్తికరమైన మార్పులు కనపడతున్నాయి. కెనడాలోని భారతీయుల్లో మార్పు చాలా స్పష్టంగా కనపడుతుంది. చాలా సంవత్సరాలుగా పంజాబీ-కెనడియన్ రాజకీయ నాయకులు కెనడా రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. మంత్రులుగా, నాయకులుగా, పార్టీ ప్రతినిధులుగా వారు రాణించారు. కానీ ఈసారి కొత్తగా గుజరాతీయులు కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు. బ్రాంప్టన్ నుంచి కాల్గరీ వరకు గుజరాత్ మూలాలు ఉన్న నలుగురు అభ్యర్థులు మొదటిసారిగా పార్లమెంటు స్థానాలకు పోటీ చేస్తున్నారు. 

Also Read: Ap weather Report: బంగాళాఖాతంలో అల్పపీడనం...ఏపీలో వర్షాలు..

వీరంతా మొదటి తరం కెనడా వలసదారులు. పంజాబీ రాజకీయ నాయకులు చాలా అనుభవం ఉన్నవారు. వారి గురించి అందరికీ తెలుసు. ఎన్నికల్లో గెలిచేందుకు వారి దగ్గర వ్యూహాలు కూడా ఉన్నాయి. కానీ గుజరాతీ అభ్యర్థులు కూడా తమకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంటున్నారు. వీరు చాలా కాలంగా వ్యాపారాల్లో, సామాజిక సేవలో ఉన్నారు. జయేష్ బ్రహ్మభట్ బ్రాంప్టన్ చింగుయాకూసి ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్లి ప్రజలను కలుస్తున్నారు. ఆయన చాలా నమ్మకంగా కనిపిస్తున్నారు. బ్రహ్మభట్ ఒకప్పుడు సివిల్ ఇంజనీర్. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించారు. 

Also Read: Musk-Trump: ఆయనో మూర్ఖుడు..ట్రంప్‌ సలహాదారుడి పై మస్క్‌ సంచలన వ్యాఖ్యలు!

2001లో గుజరాత్ నుంచి కెనడాకు వచ్చారు. చాలా మంది వలసదారుల జీవితం ఇలాగే ఉంటుంది. మొదట చిన్న దుకాణాలు నడుపుతారు. ఆ తర్వాత ఆస్తులు కొంటారు. చివరికి రియల్ ఎస్టేట్‌లో మంచి పేరు తెచ్చుకుంటారు. ఇప్పుడు ఆయన పీపుల్స్ పార్టీ టికెట్‌పై పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు. ఆయన కెనడా వచ్చి రెండు దశాబ్దాలు దాటింది. బ్రహ్మభట్ మాట్లాడుతూ, "మేము స్వేచ్ఛ, బాధ్యత, న్యాయం, అందరికీ గౌరవం కోసం నిలబడతాం. ఇది నాకు నచ్చింది. నేను చాలా మందితో మాట్లాడాను. ఈ ఎన్నికల్లో మార్పు కోరుకుంటున్నట్లు చెప్పారు" అని అన్నారు. 

బ్రహ్మభట్ లాంటి వారు రాజకీయాల్లోకి రావడానికి ఒక కారణం ఉంది. రాజకీయ పార్టీలు భారతీయులను ఒక ముఖ్యమైన ఓటు బ్యాంకుగా అనుకుంటున్నాయి. గుజరాతీలు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ సమస్యలను వినిపించాలని అనుకుంటున్నారు.ఈ ఎన్నికల్లో నలుగురు గుజరాతీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వారిలో సంజీవ్ రావల్ ఒకరు. ఆయన లిబరల్ పార్టీ టికెట్‌పై కాల్గరీ మిడ్‌నాపూర్ నుండి పోటీ చేస్తున్నారు. ఆయన టాంజానియాలో జన్మించారు. 20 ఏళ్లుగా కాల్గరీలో ఉంటున్నారు. డాన్ పటేల్ కూడా ఒకప్పుడు కన్జర్వేటివ్ పార్టీ తరపున ఎటోబికో నార్త్ నుండి పోటీ చేయనున్నారు. కానీ ఆయనతో పాటు మరో ముగ్గురు అభ్యర్థులను పార్టీ పక్కనపెట్టింది. 

అశోక్ పటేల్, మినేష్ పటేల్ ఇద్దరూ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. అశోక్ పటేల్ ఎడ్మంటన్ షెర్‌వుడ్ నుంచి పోటీ చేస్తుండగా.. మినేష్ పటేల్ కాల్గరీ స్కైవ్యూ నుండి పోటీ చేస్తున్నారు. వీరెవరికీ రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేదు. వీరందరిదీ ఒకే నేపథ్యం. మొదట వ్యాపారాలు ప్రారంభించి.. తర్వాత సమాజానికి సేవ చేశారు. ఇప్పుడు చట్టాలు రూపొందించడంలో తమ వంతు పాత్ర పోషించాలని అనుకుంటున్నారు.

ఒట్టావాలోని ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా కెనడా లో అంతర్జాతీయ వాణిజ్య డైరెక్టర్ అయిన హేమంత్ షా ఈ మార్పును గమనించారు. ఆయన విన్నిపెగ్‌లో చాలా కాలంగా ఉంటున్నారు. సమాజంలో ఆయనకు మంచి పేరు ఉంది. హేమంత్ షా మాట్లాడుతూ, "కెనడాలో లక్ష మందికిపైగా గుజరాతీలు ఉన్నారు. టొరంటో, మోంట్రియల్, ఒట్టావా, కాల్గరీ, వాంకోవర్ వంటి పెద్ద నగరాల్లో గుజరాతీలు ఎక్కువగా ఉన్నారు. చాలా మంది వలసదారులుగా వచ్చారు. 

మరికొందరు విద్యార్థులుగా వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. నేను కెనడాలో 40 ఏళ్లుగా ఉంటున్నాను. ఈ ఎన్నికల్లో గుజరాతీ అభ్యర్థులు ఎక్కువగా పోటీ చేస్తున్నారు. వారు గెలిచినా ఓడినా.. ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. పంజాబీల తర్వాత గుజరాతీలే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి వారికి ప్రాతినిధ్యం ఉండటం చాలా అవసరం" అని అన్నారు.

Also Read: TTD: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. 3 రోజులు ఆర్జిత సేవలు రద్దు

Also Read: Bank Merger: మే 1 నుంచి ఏపీలో ఆ బ్యాంకులు కనిపించవ్..

 canada | canada india | canada india news | canada-india-relations | elections | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment