Pakistan: పాకిస్తాన్ లో మరో దాడి..మసీదులో బాంబు

బలూచిస్తాన్ ట్రైన్ హైజాక్, తాలిబాన్ల వరుస దాడులతో దద్ధరిల్లుతోంది పాకిస్తాన్. నిన్ననే హైజాక్ భాగోతం పూర్తయింది అంటే...ఈరోజు అక్కడ మసీదు మరోసారి బాంబు పేలింది.  ఇందులో ఒక ఇస్లమిస్ట్ నాయకుడితో సహా ముగ్గురు పిల్లలు గాయపడ్డారు. 

New Update
pak

Bomb Attack In pakistan

పాకిస్తాన్ పరిస్థితి గందరగోళంగా తయారైంది. ఎప్పుడు, ఎక్కడ దాడులు జరుగుతాయో తెలియని పరిస్థితి. ట్రైన్ హైజాక్ అటాక్ నుంచి ఇంకా పూర్తిగా కోలుకోనే లేదు. ఈరోజు మళ్ళీ అక్కడ బాంబు దాడి జరిగింది. పాకిస్తాన్ గిరిజన ప్రాంతమైన వజీరిస్తాన్‌లో శుక్రవారం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో మసీదులో పేలుడు జరిగింది. ఈ ఘటనలో స్థానిక ఇస్లామిస్ట్ నాయకుడు, పిల్లలతో సహా ముగ్గురు గాయపడినట్లు తెలుస్తోంది. 

రాజకీయ నేతే లక్ష్యంగా..

పాకిస్తాన్ లోని ఖైబర్ పంఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని జామియత్ ఉలేమా ఇస్లాం ఫజల్ రాజకీయ పార్టీ నాయకుడు అబ్దుల్లా నదీమ్ లక్ష్యంగా బాంబ్ అటాక్ జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడిలో అతనితో పాటూ మరో ముగ్గురు పిల్లలు కూడా తీవ్రంగా గాయపడ్డారు. బాంబు దాడిలో తీవ్రంగా గాయపడ్డ నదీమ్ ను ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పేలుడు ఎవరు చేశారన్నది ఇంకా తెలియలేదు. దీని బాధ్యత ఇప్పటివరకూ ఎవరూ ప్రకటించలేదు. 

మరోవైపు బలూచ్ లిబరేషన్ ఆర్మీ సంచలన ప్రకటన చేసింది. పాక్ ఆర్మీతో తమ యుద్ధం కొనసాగుతోందని తెలిపింది. ఖైదీల మార్పిడి ప్రతిపాదనకు 48 గంటల డెడ్‌లైన్ ముగిసిందని, ఇకపై ఏం జరిగినా పాకిస్థాన్‌ ఆర్మీదే బాధ్యత అంటూ వార్నింగ్ ఇచ్చింది. 

Also Read: AP: పవన్ అన్న అంటూ మంత్రి లోకేశ్ స్పెషల్ ట్వీట్...

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

నౌకాశ్రయంలో భారీ పేలుడు.. 400 మందికి పైగా?

ఇరాన్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించింది. బందర్‌ అబ్బాస్‌ సమీపంలోని రజేయీ నౌకాశ్రయంలో పేలుడు సంభవించగా.. 400 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ పేలుడు ఎలా సంభవించిందని విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

New Update
Iran Harbor

Iran Harbor

ఇరాన్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించిన ఘటన చోటుచేసుకుంది. బందర్‌ అబ్బాస్‌ సమీపంలో రజేయీ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించగా.. 400 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ భారీ పేలుడు ఎలా సంభవించిందని విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

చమురు, పెట్రోకెమికల్స్ కారణంగా..

నౌకాశ్రయంలోని కంటెయినర్ల నుంచి పేలుడు సంభవించిందని భావిస్తున్నారు. ఇక్కడ ఎగుమతి, దిగుమతి కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే ఈ కంటైయినర్లలో చమురు, పెట్రోకెమికల్స్ ఉన్నాయి. వీటి కారణంగా పేలుడు సంభవించి ఉంటుందని భావిస్తున్నారు.

ఇది కూడా చూడండి: BIG BREAKING: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు