Gold Purchases : టన్నుల కొద్దీ బంగారం కొంటున్న బ్యాంకులు.. ఎందుకో తెలుసా?

ప్రపంచవ్యాప్త అనిశ్చితి నేపథ్యంలో, కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోళ్లను క్రమంగా పెంచుతున్నాయి, దీనివల్ల బంగారు నిల్వలు పెరుగుతున్నాయి.  ప్రపంచవ్యాప్తంగా, కేంద్ర బ్యాంకులు తమ బంగారు నిల్వలను నిరంతరం పెంచుకుంటున్నాయి.

New Update
gold

Gold purchases

Gold purchases : ప్రపంచవ్యాప్త అనిశ్చితి నేపథ్యంలో, కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోళ్లను క్రమంగా పెంచుతున్నాయి, దీనివల్ల బంగారు నిల్వలు పెరుగుతున్నాయి.  ప్రపంచవ్యాప్తంగా, కేంద్ర బ్యాంకులు తమ బంగారు నిల్వలను నిరంతరం పెంచుకుంటున్నాయి. 'ది కోబేసీ లెటర్' ప్రకారం, ఫిబ్రవరిలో సుమారు 19 టన్నుల బంగారం కొనుగోలు చేయబడింది. ఈ బంగారు కొనుగోలు ధోరణి గత 23 నెలలుగా కొనసాగుతోంది. జనవరిలో 6 టన్నుల కొనుగోలుతో, ఈ ఏడాది ఇప్పటివరకు మొత్తం బంగారం నిల్వలు 25 టన్నులకు చేరింది. అనిశ్చిత పరిస్థితుల్లో కూడా కేంద్ర బ్యాంకులు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా పరిగణిస్తున్నాయని ఈ గణాంకాలు చూపిస్తున్నాయి.  

ఏ దేశాలు తమ బంగారు నిల్వలను అత్యధికంగా పెంచుకున్నాయో పరిశీలిస్తే.. ఫిబ్రవరిలో తన బంగారు నిల్వలను పెంచుకోవడంలో పోలాండ్ జాతీయ బ్యాంకు ముందుంది. పోలాండ్ దాదాపు 20 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయడంతో, దాని మొత్తం నిల్వలు 570 టన్నులకు చేరుకున్నాయి. ఇది దేశం యొక్క మొత్తం విదేశీ మారక నిల్వలలో సుమారు 31 శాతానికి సమానం. ఉజ్బెకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ కూడా తన బంగారు నిల్వలను పెంచుకుంది. ఈ బ్యాంకు సుమారు 8 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. దీంతో దాని మొత్తం బంగారు నిల్వలు 407 టన్నులకు చేరుకున్నాయి, ఇది దాని విదేశీ మారక నిల్వలలో సుమారు 88 శాతానికి సమానం.

Also Read :  పాకిస్తాన్‌లో శాంతి చర్చలు.. ఇరాన్‌కు మరోసారి అమెరికా వార్నింగ్

అమ్మకం దిశగా అడుగులు

బంగారం నిల్వ(Gold reserves) లపై ఇరాన్ యుద్దం(Iran Israel America War) దెబ్బ భారీగానే పడింది. ఏటా సుమారు 1,000 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేస్తూ మార్కెట్‌కు ఒక రక్షణ కవచంలా నిలిచిన కేంద్ర బ్యాంకులు(Central banks).. 2026 ఏప్రిల్ నాటికి విక్రయదారులుగా మారాయి. దీనికి ప్రధాన కారణం మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం..దాని ఫలితంగా ఆకాశాన్నంటిన చమురు ధరలు అని చెప్పవచ్చు. చమురు ధరలు పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా డాలర్‌కు డిమాండ్ పెరిగి, ఇతర దేశాల కరెన్సీలు బలహీనపడ్డాయి. తమ దేశ కరెన్సీ విలువ పాతాళానికి పడిపోకుండా కాపాడుకోవడానికి, ద్రవ్యోల్బణాన్ని నియంత్రిం చడానికి ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు తమ వద్ద ఉన్న బంగారు నిల్వలను నగదుగా మార్చుకోక తప్పడం లేదు. 

ఈ విక్రయాల్లో టర్కీ(turkey) అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. ఇరాన్ యుద్ధ ప్రభావంతో తమ దేశ కరెన్సీ 'లీరా'ను రక్షించుకోవడానికి టర్కీ ఏకంగా 60 టన్నుల బంగారాన్ని (సుమారు 8 బిలియన్ డాలర్లు) మార్కెట్లో విక్రయించింది. మరోవైపు గత రెండేళ్లుగా బంగారాన్ని విపరీతంగా కొనుగోలు చేసిన పోలాండ్ కూడా ఇప్పుడు తన నిల్వలను ఉపయోగించుకోవాలని చూడటం మార్కెట్ విశ్వాసాన్ని దెబ్బతీసింది. వీటన్నిటికీ మించి రష్యా(russia) తన యుద్ధ ఖర్చుల కోసం దాదాపు 25 ఏళ్ల తర్వాత మొదటిసారిగా ఫిజికల్ Gold బార్లను మార్కెట్లోకి విడుదల చేస్తోంది. 2026 మొదటి రెండు నెలల్లోనే రష్యా దాదాపు 14 టన్నుల బంగారాన్ని అమ్మడం మార్కెట్‌పై తీవ్ర ఒత్తిడిని పెంచింది. 

Also Read :  ఇజ్రాయెల్ Vs పాకిస్థాన్.. వీరి గొడవ ఇప్పటిది కాదు.. షాకింగ్ స్టోరీ!

అత్యధిక బంగారు నిల్వలను కలిగి ఉన్న దేశాలు

అత్యధిక బంగారు నిల్వలు కలిగిన దేశాల విషయానికి వస్తే, యునైటెడ్ స్టేట్స్ అగ్రస్థానంలో ఉంది. 1. అమెరికా (8,133 టన్నులు), 2. జర్మనీ (3,350 టన్నులు), 3.  ఇటలీ (2,452 టన్నులు), 4.  ఫ్రాన్స్ (2,437 టన్నులు), 5.  రష్యా (2,330 టన్నులు). 6.  చైనా (2,299 టన్నులు). 7. స్విట్జర్లాండ్ (1,040 టన్నులు), 8.   భారతదేశం (880 టన్నులు)

Advertisment
తాజా కథనాలు