/rtv/media/media_files/2026/03/22/iran-war-2026-03-22-10-22-38.jpg)
Iran War
America:ఇరాన్ డ్రోన్ దాడులను తిప్పికొట్టేందుకు అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. సౌదీ అరేబియాలోని 'ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్' వద్ద ఉక్రెయిన్కు చెందిన 'స్కై మ్యాప్' (Sky Map) అనే యాంటీ డ్రోన్ సాంకేతికతను అమెరికా మొహరించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, అమెరికా తన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకుంటోంది. ఇటీవల జరిగిన డ్రోన్ ,క్షిపణి దాడుల్లో భారీ నష్టం వాటిల్లడంతో పాటు ఒక అమెరికా సైనికుడు మరణించిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ఇరాన్ తయారీ 'షాహెద్' డ్రోన్లను ఎదుర్కోవడంలో ఈ సిస్టమ్ అద్భుతంగా పనిచేసింది. ఇప్పుడు అదే సాంకేతికతను అమెరికా సైనికులు సౌదీలో వినియోగిస్తున్నారు. ఉక్రెయిన్ సైనిక నిపుణులు స్వయంగా అమెరికా సైనికులకు ఈ వ్యవస్థపై శిక్షణ ఇస్తుండటం గమనార్హం. కేవలం సౌదీలోనే కాకుండా పశ్చిమాసియాలోని ఇతర దేశాల్లో కూడా ఉక్రెయిన్ నిపుణులు మోహరించారు.
ఒకప్పుడు ఇరాన్ డ్రోన్ల దాడితో ఉక్రెయిన్ అల్లాడుతున్నప్పుడు అమెరికా సాయం కోరింది. ఆ సమయంలో డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని బహిరంగంగా అవమానించడమే కాకుండా మీడియా ముందు ఎగతాళి చేశారు. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభంలో జెలెన్స్కీ అమెరికాకు సాయం చేస్తామని ఆఫర్ ఇచ్చినా, అప్పుడు అమెరికా నిరాకరించింది. కానీ ఇప్పుడు అగ్రరాజ్యానికి ఉక్రెయిన్ అందించే చవకైన , సమర్థవంతమైన యాంటీ-డ్రోన్ సాంకేతికత తప్పనిసరి అయ్యింది.
ఉక్రేనియన్ నిపుణుల శిక్షణ
ఈ వ్యవస్థను నిర్వహించడంలో అమెరికా సైనిక సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు ఉక్రేనియన్ నిపుణులను సౌదీ అరేబియాకు కూడా పంపారు. ఈ సహకారం, ఉక్రెయిన్ యొక్క పోరాట అనుభవం ఇప్పుడు ఇతర రంగాలలో కూడా వినియోగించబడుతోందని సూచిస్తుంది.
ఇటీవలి వరుస డ్రోన్ , క్షిపణి దాడుల నేపథ్యంలో ఈ మోహరింపు జరిగింది. ఈ దాడులలో వైమానిక స్థావరం మౌలిక సదుపాయాలు దెబ్బతినడంతో పాటు, కనీసం ఒక అమెరికన్ సైనికుడు మరణించాడు. ఇరాన్కు సుమారు 400 మైళ్ల దూరంలో ఉన్న ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరం కొంతకాలంగా తరచుగా దాడులను ఎదుర్కొంటోంది.
ఈ చర్య అమెరికా వాయు రక్షణ వ్యవస్థలోని కొన్ని బలహీనతలను బయటపెట్టిందని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థలు, ముఖ్యంగా చౌకగా, భారీగా ఉత్పత్తి చేయబడిన డ్రోన్ల విషయంలో, ప్రభావవంతంగా లేవని భావిస్తున్నారు. అందుకే అమెరికా వేగంగా కొత్త సాంకేతికతలు, వ్యూహాలను అభివృద్ధి చేస్తోంది.
ఇరాన్ డ్రోన్లను ఎదుర్కోవడానికి ఉక్రెయిన్ సాయం అక్కర్లేదని కొన్ని వారాల క్రితమే ట్రంప్ ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది, ఇప్పుడు అమెరికాకు ఉక్రెయిన్ నిపుణుల అవసరం ఏర్పడింది.సాంప్రదాయ భారీ ఆయుధాల కంటే, డ్రోన్ల వంటి తేలికపాటి మరియు చవకైన ఆయుధాలే ఇప్పుడు పెద్ద సవాలుగా మారాయని పెంటగాన్ గుర్తించింది. యాంటీ-డ్రోన్ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు సెన్సార్లు, ఇంటర్సెప్టర్లు మరియు నిఘా వ్యవస్థలపై అమెరికా పెట్టుబడులను పెంచింది.
Follow Us