Hyderabad: రెచ్చిపోయిన హైదరాబాదీలు..బిర్యానీ, హలీమ్ తెగ తిన్నారు

హైదరాబాద్ అంటే బిర్యానీ.. బిర్యానీ అంటే హైదరాబాద్. పండగ అయినా, క్రికెట్ అయినా, ఉత్సవం అయినా బిర్యానీలు తినాల్సిందే. అలాంటిది రంజాన్ అంటే తగ్గుతారా మనోళ్ళు. అందుకే ఈ పండుగకు పది లక్షల బిర్యానీలు, 5.3 లక్షల హలీం పేట్లు తినేశారు.

New Update
Hyderabad: రెచ్చిపోయిన హైదరాబాదీలు..బిర్యానీ, హలీమ్ తెగ తిన్నారు

Biryani & Haleem Orders For Ramadan: పండుగ ఏదీ, ఎవరిది అనవసరం...బిర్యానీ ఉండాల్సిందే. తినాల్సిందే. అసలు బిర్యానీ పేరు చెపితేనే నోట్లో నీళ్ళూరుతాయి. అందులోనూ హైదరాబాదీ బిర్యానీ లాంటిది మరెక్కడా దొరకదు కూడా. ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా హైదరాబాద్ బిర్యానీ పేరు వినిపిస్తూనే ఉంటుంది. అలాంటి బిర్యానీని రంజాన్ మాసంలో (Ramadan 2024) హైదరాబాదీలు తెగ తినేశాంట. నెల రోజుల వ్యవధిలోనే పదిలక్షల పేట్ల బిర్యానీ తిన్నారంటే..అర్ధం చేసుకోవచ్చను హైదరాబాదీలకు ఇది అంటే ఎంత మక్కువో. ఇప్పుడు ఈ లెక్క చెబుతున్నది కూడా ఒక్క స్విగ్గీనే (Swiggy). కేవలం ఈ ఫుడ్ డెలివరీ సంస్థ ద్వారానే పదిలక్షల బిర్యానీలు ఆర్డర్ అయ్యాయి. అదే జొమాటో, డైరెక్ట్‌గా వెళ్ళి తినడం లాంటివి కలుపుకుంటే ఈ సంఖ్య అపరిమితంగా పెరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

మార్చి 11న ప్రారంభం అయిన రంజాన్ మాసం ఇవాల్టితో ముస్తుంది. ఇక మాసంలో బిర్యానీతో పాటూ చెప్పుకోవల్సింది..హైదరాబాద్‌కుమాత్రమే ప్రత్యేకమైనది హలీం. దీన్ని కూడా ఈ నెల రోజుల్లో విపరీతంగా తిన్నారని చెబుతోంది స్విగ్గీ. మొత్తం 5.3 లక్షల ప్లేట్ల హలీం ఆర్డర్ చేశారు. రంజాన్‌ మాసం సందర్భంగా సాయంత్రం 5.30 గంటల నుంచి 7 గంటల వరకు ఇఫ్తార్‌ ఆర్డర్లు 34 శాతం పెరిగాయని తెలిపింది. ఇది ఒక రికార్డేనని అంటోంది స్విగ్గీ.

స్విగ్గీకి వచ్చిన ఆర్డర్లలో ఎక్కువగా చికెన్‌, మటన్‌ బిర్యానీ, హలీమ్‌, సమోసా, ఫలుదా, ఖీర్‌ ఉన్నాయని చెబుతోంది. గత ఏడాది కన్నా మొత్తంగా హలీమ్‌ ఆర్డర్లు 1454.88 శాతం, ఫిర్ని 80.97 శాతం పెరిగినట్లు తెలిపింది. మాల్పువా ఆర్డర్లు 79.09 శాతం, ఫలుదా 57,93 శాతం, డేట్స్‌ 48.40 శాతం ఆర్డర్లు పెరిగాయని చెప్పింది.

Also Read:Telangana : టాస్క్ ఫోర్స్ మాజీ DCP రాధాకిషన్‌రావుపై మరో కేసు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Khushdil Shah: చిర్రెత్తిపోయిన చిన్నోడు.. అభిమానులను కొట్టబోయిన పాక్ క్రికెటర్ - వీడియో చూశారా?

న్యూజిలాండ్‌తో 3వన్డేల సిరీస్‌లో భాగంగా పాకిస్థాన్ 0-3 తేడాతో ఓడిపోయింది. ఫైనల్ మ్యాచ్ తర్వాత పాక్ క్రికెటర్ ఖుష్దిల్ షా ప్రేక్షకులను కొట్టడానికి దూసుకెళ్లాడు. ఆఫ్ఘన్ అభిమానులు పాక్ క్రికెటర్లతో అనుచితంగా ప్రవర్తించడంతో అతడు అలా చేసినట్లు తెలుస్తోంది.

New Update
Pakistan Cricketer Khushdil Shah Attacks Fans During NZ ODI

Pakistan Cricketer Khushdil Shah Attacks Fans During NZ ODI

పాకిస్థాన్ క్రికెటర్ ఖుష్దిల్ షా వార్తల్లో నిలిచాడు. అతడు తన అనుచిత ప్రవర్తన ద్వారా విమర్శలకు గురయ్యాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం ఖుష్దిల్ షా ప్రేక్షకులను కొట్టడానికి వెళ్లడంతో హాట్ టాపిక్‌గా మారాడు. ఇంతకీ ఏం జరిగింది?.. ఎందుకు ప్రేక్షకులను కొట్టడానికి వెళ్లాడు? అనే విషయానికొస్తే.. 

ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

న్యూజిలాండ్ vs పాకిస్థాన్ మధ్య మూడు వన్డేల సిరీస్ జరిగింది. ఈ సిరీస్‌‌లో భాగంగా న్యూజిలాండ్ చేతిలో పాకిస్థాన్ 0-3 తేడాతో ఘోరంగా ఓటమిపాలైంది. మొదటిగా రెండు వన్డేలు ఓడిపోయిన పాకిస్థాన్ శనివారం (ఏప్రిల్ 5) జరిగిన మూడో వన్డేలో సైతం కుప్పకూలిపోయింది. ఈ చివరి మ్యాచ్‌లోనూ న్యూజిలాండ్‌పై పాక్ 43 పరుగుల తేడాతో ఘోరంగా ఓటమిపాలైంది. దీంతో పాక్ క్రికెటర్లు, అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. 

ఇది కూడా చూడండి: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

దానికి తోడు ఇటీవలే టీ20 సిరీస్‌ను సైతం పాకిస్థాన్ కోల్పోయింది. 1-4 తేడాతో ఓటమిపాలైంది. అప్పటికే తీవ్ర నిరాశలో ఉన్న పాకిస్థాన్‌కు ఇప్పుడు మరో షాక్ తగిలింది. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ కావడంతో పాక్ క్రికెటర్లు ఆవేదనకు అంతులేకుండా పోయింది. ఇదే క్రమంలో న్యూజిలాండ్‌తో మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ ఆల్‌రౌండర్ క్రికెటర్ ఖుష్దిల్ షా అనుచిత ప్రవర్తన వైరల్‌గా మారింది. 

ఇది కూడా చూడండి: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

ప్రేక్షకులపై దాడికి యత్నం

ఈ మ్యాచ్ జరిగిన తర్వాత ఖుష్దిల్ షా క్రికెట్ అభిమానుల మీదకు దూసుకెళ్లాడు. అందుకు ఓ కారణం ఉన్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ తర్వాత కొంతమంది ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ ప్రియులు పాక్ క్రికెటర్లతో అనుచితంగా ప్రవర్తించినట్లు తెలిసింది. దానిని ఆపమని ఖుష్దిల్ షా వారిని కోరినా.. వారు దుర్భాషలాడుతూనే ఉండటంతో అతడు ప్రేక్షకులను కొట్టడానికి వెళ్లినట్లు సమాచారం. అప్పటికే సిరీస్ టీ20 సిరీస్‌ను కోల్పోయిన పాక్.. ఇప్పుడు వన్డే సిరీస్‌ క్లీన్ స్వీప్ కావడంతో విలవిల్లాడిపోయిందని అందుకే ఖుష్దిల్ క్రూరంగా ప్రవర్తించాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 

ఇది కూడా చూడండి: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి

పీసీబీ స్పందన 

దీనిపై పీసీబీ స్పందించింది. ‘‘జాతీయ ఆటగాళ్లను ఉద్దేశించి విదేశీ ప్రేక్షకులు దుర్భాషలాడడాన్ని పాకిస్తాన్ క్రికెట్ జట్టు యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. ఈరోజు మ్యాచ్ జరుగుతున్న సమయంలో, మైదానంలో ఉన్న క్రికెటర్లపై విదేశీ ప్రేక్షకులు అనుచిత వ్యాఖ్యలు చేశారు" అని పిసిబి తెలిపింది. 

(latest-telugu-news | telugu-news | pcb | Khushdil Shah | NZ vs Pak)

Advertisment
Advertisment
Advertisment