ముగ్గురు చిన్నారుల మిస్సింగ్.. విశాఖలో కలకలం..

వైజాగ్‌లో ముగ్గురు చిన్నారుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. ఇంటి నుంచి ఆడుకోవడానికి వెళ్లిన ముగ్గురు పిల్లలు తిరిగి రాలేదు. తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒడిస్సా బోర్డర్‌లో ఆ ముగ్గురు చిన్నారులను పోలీసులు గుర్తించారు.

New Update
missing children vijayawada

missing children

ఏపీలోని విశాఖపట్నంలో ముగ్గురు చిన్నారులు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ముచ్చమాంబ కాలనీకి చెందిన ముగ్గురు చిన్నారులు అదృశ్యం అయ్యారు. జనవరి 31వ తేదీన ఆడుకోవడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ముగ్గురు పిల్లలు ఆదిత్య సాహు (9), లక్ష్మీ సాహు (7), గొర్లి గంగోత్రి (9)  తిరిగి రాలేదు. తల్లి గౌరీ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒడిస్సా బోర్డర్‌లో పోలీసులు చిన్నారులను గుర్తించారు. అయితే వీరు స్వతహాగానే వెళ్లారా? లేకపోతే ఎవరైనా వీరిని తీసుకెళ్లారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: CM Chandrababu: ఇలాంటి బావమరిది దొరకడం నా అదృష్టం.. చంద్రబాబు ఎమోషనల్!

వరుసగా నాలుగు విల్లాల్లో..

ఇటీవల తిరుపతిలో శనివారం అర్థరాత్రి భారో చోరీ జరిగింది. కొందరు దొంగలు ఏకంగా ఇళ్లను బద్దలు కొట్టి బంగారం కొట్టేశారు. 1.048 కిలోల బంగారాన్ని దోచుకున్నారు. తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వరసగా ఉన్న నాలుగు ఇళ్లపై కేటుగాళ్లు దాడి చేసి డబ్బులు తీసుకెళ్లారు. అర్ధరాత్రి సమయంలో ఓ విల్లా సోలార్ ఫెన్సింగ్ కట్ చేసి లోపలికి ప్రవేశించారు. వరసగా 80, 81, 82, 83 విల్లాల్లో చోరీకి ప్రయత్నించారు.

ఇది కూడా చూడండి: Jayalalitha: జయలలిత ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికే...సీబీఐ స్పెషల్‌ కోర్టు తీర్పు!

బాధితులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అంత సెక్యూరిటీ ఉన్న ఇంట్లోనే దొంగలు దోచుకున్నారంటే.. సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: AP Crime: కొడుకును నెత్తురు కక్కేలా కొట్టిన తండ్రి.. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే!

ఇది కూడా చూడండి: RC16: 20 ఏళ్ళు వెనక్కి వెళ్లి.. RC16 షూటింగ్ కోసం బుచ్చిబాబు పెద్ద ప్లానింగ్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Bus Accident: వరంగల్‌లో బోల్తా పడ్డ ఆర్టీసీ బస్సు

హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం చింతగట్టు రింగురోడ్డు దగ్గర టీఎస్‌ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయాలు కాగా.. మరో 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

New Update
TSRTC bus overturning accident

TSRTC bus overturning accident

హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం చింతగట్టు రింగురోడ్డు దగ్గర టీఎస్‌ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయాలు కాగా.. మరో 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి.  ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Also Read :   Alekhya Chitti Pickles Issue: మమ్మల్ని రోడ్డుపైకి లాగేశారు కదరా.. మా అక్కకి ఏదైనా జరిగితే - రమ్య వీడియో వైరల్

TGSRTC Warangal Bus Accident

 

ఇది కూడా చదవండి:  పాపం ప్రణీత్.. గంట పాటు చిత్ర హింసలు పెట్టి చంపిన ఫ్రెండ్స్.. అసలేమైందంటే..!

క్షతగాత్రులను వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. బస్సు ఒంగోలు నుంచి ఆదిలాబాద్‌ వెళ్తుండగా  ప్రమాదం చోటు చేస్తుంది. మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాట్లు పోలీసులు తెలిపారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇది కూడా చదవండి: ఆఫీసు పనిలో సహోద్యోగులు ఎగతాళి చేస్తున్నారా.. ఇలా చేయండి

Also Read :  Allu Arjun - Atlee Movie: బట్టలు చించుకునే టైం ఆగయా.. హాలీవుడ్ రేంజ్‌లో అల్లు అర్జున్ - అట్లీ మూవీ (వీడియో చూశారా)

latest-telugu-news | today-news-in-telugu | telangana crime news | telangana crime case | telangana-crime-updates

Advertisment
Advertisment
Advertisment